తృణమూల్‌ విజయాలను దెబ్బతీసే ఆయుధం

Publish Date:Mar 16, 2016

Advertisement

 

మమతా బెనర్జీ.... అన్యాయం జరిగినచోట ఆవేశంగా ప్రసంగిస్తారు. అవినీతి గురించి నిప్పులు చెరుగుతారు. అందుకే ఆమె వ్యక్తిత్వం అంటే బెంగాలీయులకు మహా అభిమానం. మమతా దీదీ వేసుకునే చవకబారు చెప్పుల గురించీ, ఆమె ధరించే సాదా చీర గురించీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ అభిమానంతోనే దశాబ్దాల తరబడి తిరుగులేకుండా పోయిన సీపీఐ(ఎం)ని సైతం తోసిరాజని, మమతాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. అవినీతి మీద మమత సాటిలేని పోరు సలుపుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, అవినీతికి కొమ్ముకాయడంలో తమ పార్టీ ఇతరులకంటే భిన్నమేమీ కాదని మమత నిరూపిస్తూనే ఉన్నారు.

 

పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే శారదాస్కాం అనే ఆర్థిక కుంభకోణం బయటపడింది. మమత మంత్రివర్గంలో క్రీడా, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న ‘మదన్‌మిత్రా’ అనే మంత్రికి ఈ కుంభకోణంలో ముఖ్యపాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అయినా మమతాదీదీ, మదన్‌మిత్రాను వెనుకేసుకుంటూనే వచ్చారు. మదన్‌మిత్రా అరెస్టైన తరువాత కూడా ఏడాదిపాటు మంత్రిగా కొనసాగారంటే, ఈ విషయంలో మమత ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో తెలుస్తూనే ఉంది. పైగా మదన్‌మిత్రా ఇంకా జైళ్లో ఉండగానే, ఈసారి ఎన్నికలలో ఆయన పోటీ చేయనున్నట్లు మమత ప్రకటించారు! ఏదో ఒకరిద్దరి విషయంలో మమతాదీదీ తన మమతానురాగాలను ప్రకటించారులే అని జనం ఊరుకున్నారు. కానీ ఇంతలో నారద అనే ఒక న్యూస్‌ వెబ్‌సైట్‌ మరో బాంబు పేల్చడంతో మమత తన నిష్కళంకతని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మమత ప్రతిస్పందన వేరేలా ఉంది!
    

మాథ్యూ శామ్యూల్‌, తెహల్కా అనే పరిశోధనాత్మక పత్రిక నుంచి విడివడి, నారద అనే వేరుకుంపటి పెట్టుకున్న పాత్రికేయుడు. ఆయన రెండేళ్లపాటు ఓపికగా తృణమూల్‌ ముఖ్య నేతలందరినీ తన స్టింగ్‌ ఆపరేషన్‌ ఉచ్చులోకి లాగాడు. చెన్నైలో తమకు ‘ఇంపెక్స్‌ కన్సల్టెన్సీ’ అనే సంస్థ ఉందనీ, ఆ సంస్థ పశ్చిమబెంగాల్లో అవకాశాలు చక్కించుకునేందుకు కాస్త ‘సాయం’ చేయాలంటూ ఒక్కో ప్రభుత్వ నేతనీ కదిపాడు. శామ్యూల్ ప్రయత్నం వృథా పోలేదు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు తృణమూల్‌ నేతలు ఏకంగా 11 మంది ఈ స్టింగ్‌ ఆపరేషన్లో చిక్కారు. లక్షలకు లక్షల సొమ్ము ఉచితంగా వస్తుంటే ఒక్క నేతాజీ కూడా వద్దనలేదు. అసలా సంస్థ ఉందా లేదా, ఉంటే దాని పనితీరు ఏంటి అని ఆలోచించేంత సమయాన్ని కూడా తమ మెదళ్లకు ఇవ్వలేదు.

 

ఈ స్టింగ్‌ ఆపరేషన్లో చిక్కినవారు సామాన్యలు కారు. కోల్‌కతా మేయర్ (సోవన్‌ ఛటర్జీ), ఎంపీ ప్రసూన్‌ బెనర్జీ సహా పలువులు ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు కట్టల కట్టలుగా నోట్ల కట్టలను తీసుకుంటూ కెమెరాల ముందు దొరికిపోయారు. ఇలా తన స్టింగ్‌ ఆపరేషన్‌ను ముందుకు సాగించేందుకు, నారద వార్తా సంస్థ కనీసం 65 లక్షలు ఖర్చుచేసినట్లు సమాచారం. ఈ సంస్థ ఇంత ఖర్చు చేసి తృణమూల్ నేతలనే లక్ష్యంగా పెట్టుకుని ఎందుకు పనిచేసిందన్నది ఓ సహేతుకమైన ప్రశ్నే! అందులోనూ తన స్టింగ్ ఆపరేషన్‌ వివరాలను సరిగ్గా ఎన్నికల సమయంలో విడుదల చేయడం కూడా సందేహాలకు తావిస్తోంది. మరో నెల రోజులు కూడా లేని పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో ఈ వీడియో ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలేజీ కుర్రవాడు కూడా ఊహించగలడు. కానీ వీడియో బయటకు రాగానే తృణమూల్ స్పందించిన తీరు అంతే అనుమానాస్పదంగా ఉంది.

 

స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడిన నేతల మీద తాము ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ఆ పార్టీ అధినేతలు తేల్చిపారేశారు. కనీసం వారి నుంచి వివరణను కూడా తాము ఆశించడం లేదని సెలవిచ్చారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. ‘లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి మీద విచారణ జరుపుతామని’ ఒక్క మాట అన్నా మమతాదీదీ మీద ప్రజలకు ఉన్న ఆశలు సజీవంగా ఉండేవేమో! కానీ వరుస విజయాలతో పాటు ఒంటెద్దుపోకడను కూడా అలవాటు చేసుకున్న దీదీ అందుకు సిద్ధంగా లేరు. ఫలితం! తృణమూల్‌ విషయంలో చూసీ చూడనట్లు ఉండే బీజేపీ వంటి పార్టీలు కూడా ఇప్పడు ఆ పార్టీ వ్యక్తిత్వం గురించి విరుచుకుపడుతున్నాయి. తృణమూల్‌కు బద్ధ శత్రువు అయిన వామపక్షాలకు, ఈ అంశం ఒక పాశుపతాస్త్రంగా పరిణమించింది. ఇక అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా అవినీతిలో మార్పు ఉండదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి.

 

తృణమూల్ అర్భాటంగా పోటీ చేస్తున్న కేరళ మీద ఈ ఫలితం ఎలాగూ ఉంటుంది. కానీ ఆ పార్టీకి పెట్టని కోటగా మారిన పశ్చిమబెంగాల్లో ఈ మచ్చ పెనుమార్పునే తీసుకురావచ్చు. ఇప్పటికే పలు ప్రజాభిప్రాయ సేకరణలో ఈసారి ఎన్నికలలో ఇటు తృణమూల్‌, అటు వామపక్షాలకి సరిసమానమైన అవకాశాలు ఉన్నాయని తేల్చాయి. మరి ఆఖరి నిమిషంలోనైనా మమత మేల్కొని నష్టనివారణ చర్యలు చేపడతారా. లేకపోతే అవినీతి నేతలను వెనుకేసుకుని వారితో పాటు పరాజయాన్ని కూడా మూటగట్టుకుంటారా... అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.