ఆ మందులని ఎందుకు నిషేధించారు

Publish Date:Mar 17, 2016

Advertisement

 

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అన్నా అనకపోయినా, నిత్యం నిండు ఆరోగ్యంతో ఉండాలన్న కోరిక ఎవరికైనా ఉండేదే! అందుకే శరీరానికి ఏ చిన్నపాటి తేడా వచ్చినా కంగారుపడిపోతాం. కొన్ని దశాబ్దాల క్రితమైతే, రోజువారీ వచ్చే ఆరోగ్య సమస్యలకి మన వంటింట్లోనే కావల్సినన్ని మందులు దొరికేవి. కానీ ఇప్పుడు దగ్గు వస్తే కరక్కాయ చప్పరించమని, కడుపునొప్పికి వాము నమలమనీ... ఒకో రోగానికి, ఒకో చిట్కా చెప్పేవారు లేరు. చెప్పినా పట్టించుకునేవారూ లేరు! అంత సమయమూ, సహనమూ ఇప్పుడు ఎవరికీ లేవు. అందుకే ఒంట్లో ఏమాత్రం తేడా వచ్చినా సెంటర్లో ఉన్న పదీపదిహేను మందుల షాపులలో ఏదో ఒక షాపులోకి దర్జాగా వెళ్లిపోయి, ఫలానా మందు కావాలని అడిగి తీసుకుంటాం. ఈ విషయంలో మన వైద్య పరిజ్ఞానం చాలా అసాధారణం. ఏ రోగానికి ఏ మందు వేసుకుంటే సరిపోతుందా ఖచ్చితంగా చెప్పేయగలం! కానీ గతవారం ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఒకటీరెండూ కాదు.... ఏకంగా 344 మందులు నిషేధించేసరికి మన్ముందు మన మహత్తరమైన వైద్యపరిజ్ఞానాన్ని మరింత విస్తరించక తప్పని పరిస్థితి వచ్చింది.

 

ప్రభుత్వం విధించిన ఈ నిషేధం గురించి చదువుతున్నప్పుడు తరచూ కనిపిస్తున్న మాట... ‘fixed dose combination’ (FDC). అంటే ఓ రెండు మూడు రకాల ఔషధాలని ఎడాపెడా కలిపేసి, వాటికి ఓ కొత్త పేరుని తగిలించి మార్కెట్‌లోకి విడుదల చేయడమన్నమాట! ఇలా జ్వరం, దగ్గు, నొప్పి... లాంటి సమస్యలకే కాదు, మానసిక క్రుంగుబాటు వంటి తీవ్రమైన సమస్యలకి కూడా మన దేశంలో FDC మందులు విస్తృతంగా లభిస్తున్నాయి. వీటిలో చాలామందులకు Central Drugs Standard Control Organisation (CDSCO) అనుమతి లేనేలేదు. ఒక్క నొప్పిని నివారించే మాత్రలలోనే 73 శాతం మందులకు మన దేశంలో అనుమతి లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. వీటిలో చాలా రకాల FDCలకు విదేశాలలో అనుమతే లేదు.

 

FDCలను నిషేధించేందుకు ఆరోగ్య శాఖ చూపిస్తున్న కారణాలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. రకరకాల మందులను రకరకాల మోతాదులలో ఎడాపెడా తీసుకోవడం వల్ల, అవి శరీరాన్ని విషమయం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. మున్ముందు రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, యాంటీబయాటిక్‌ మందులకు శరీరం స్పందించకపోవడం మొదల్కొని శరీర భాగాలు పనిచేయకపోవడం వరకూ నానా రకాల ప్రమాదాలూ పొంచి ఉన్నాయంటున్నారు. దురదృష్టం ఏమిటంటే... సదరు దుష్ప్రభావాలు ఏర్పడినప్పుడు కూడా అవి తాను తరచూ వాడే మందుల వల్లే అని రోగులు తెలుసుకోలేకపోవడం! రోగి తరచూ వాడుతున్న మందుల వల్లే ఈ దుస్థితి అని గ్రహించే స్థితిలో వైద్యులు కూడా లేకపోవడం. అందుకనే ఔషధి కంపెనీల ఆటలు నిరాటంకంగా చెల్లిపోతూ వచ్చాయి. తాము ఉత్పత్తి చేస్తున్న మందుని ఇన్నాళ్లూ ఎవరూ వేలెత్తి చూపలేకపోయారు కదా! అంటూ సదరు ఔషధి కంపెనీలు ఇప్పుడు కూడా వితండవాదం చేస్తున్నాయి.

 

నిజానికి FDCలకు ‘కేంద్ర ఔషధి నియంత్రణ సంస్థ’ (CDSCO) అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న నియమం 1961 నుంచే ఉంది. కానీ ఈ నియమాన్ని తుంగలో తొక్కిన వందలాది మందులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అసలు CDSCO అనుమతించిన మందులు కూడా కొన్ని పనికిరానివన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయినా ఇన్నాళ్లూ ఆరోగ్య శాఖ పట్టిపట్టనట్లు ఊరుకుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం నిద్రాణస్థితిలో ఉండటంతో మన దేశంలోని ఔషధివ్యాపారం లక్షకోట్లను దాటిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిల్చాలనుకునే సమయానికి, ఔషధిరంగం అదుపుచేయజాలనంత బలాన్ని పుంజుకుంది. ఈ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు భారతీయులు సొమ్ముని దండుకుంటూనే, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఉదాహరణకు అమెరికాకు చెందిన అబాట్‌ అనే కంపెనీ Phensedyl, ఫైజర్ అనే కంపెనీ Corex అనే దగ్గుమందులను తయారుచేస్తున్నాయి. భారతదేశంలోని దగ్గుమందులలో మూడో వంతుకి పైగా ఆధిపత్యం ఈ రెండు మందులనే అంటే నమ్మశక్యం కాదు. Codeine అనే మత్తుమందు కలిపిన ఈ దగ్గుమందు వల్ల, దీన్ని తాగిన మనిషిలో ఉత్తేజం పెరుగుతుంది. కానీ నిజానికి దీని వల్ల దగ్గు తగ్గదనీ... కొన్నాళ్లకు దగ్గు సహజంగా తగ్గిపోవడంతో వీటి వల్లే గుణం కనిపించిందని రోగి అనుకుంటాడని కొందరి విమర్శ. కేవలం ఈ దగ్గుమందులో ఉన్న మత్తుమందు కోసం, దాన్ని సేవించే వ్యసనపరుల సంఖ్య కూడా అసాధారణంగానే ఉంది.

 

జరిగిందేదో జరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవడం ఒక శుభసూచకమే! కానీ తాము అమలు చేయాలనుకున్న నిషేధం విషయంలో ప్రభుత్వం ఎంతమేరకు విజయం సాధిస్తుందో చూడాలి. కోట్లాదిగా మూలుగుతున్న డబ్బు, న్యాయాన్ని ఏమార్చగల పలుకుబడి ఉన్న సదరు ఔషధి సంస్థలతో ఢీకొని, ప్రభుత్వం తన పంతాన్ని ఎంతవరకు నెగ్గించుకోగలదో చూడాలి. వైద్య వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న అపనమ్మకం కూడా ఈ స్థితికి ఓ కారణమే. చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా దగ్గర్లో ఉన్న వైద్యుని సలహా తీసుకునేందుకు రోగులు భయపడుతున్నారు. ఎంత డబ్బు గుంజుకుంటారో, ఎలాంటి రోగనిర్ధరణ పరీక్షలు రాస్తారో అని వణికిపోతున్నారు. ఆర్‌.ఎం.పీ వైద్యులు, ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ నశించి... ఖరీదైన స్పెషాలటీ డాక్టర్లే ఇప్పడు మనకి దిక్కయ్యారు. వాళ్లు చెప్పిందే రోగం, వాళ్లు చేయించుకోవాలన్నదే పరీక్ష, వాళ్లు ఇచ్చిందే మందుగా ఆట సాగుతోంది. ఈ ఆటలను కట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. అప్పటివరకూ సగటు భారతీయుడు, ఏదో ఒక అనారోగ్యం ఏర్పడితే... ఏదో ఓ మందుని తీసుకోక మానడు!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.