హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసినా.. కేసుకు సంబంధించిన పలు కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయనను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని అత్తాపూర్ పోలీసులు నిర్ణయించారు. కస్టడీలో భాగంగా పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణా రెడ్డి సమాధానం చెప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. ముఖ్యంగా కేసులో కీలకంగా మారిన ఐఫోన్ ఆచూకీ, కత్తి, మహిళా ట్రైనీ ఐపీఎస్తో పరిచయం తదితర అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అయితే విచారణలో ఆశించిన స్థాయిలో సమాచారం రాకపోవడం తో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయం అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ పూర్తయిన అనంతరం ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆయన సైబరాబాద్ సీపీ సజ్జనార్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాతపూర్వక ఫిర్యాదు అందించినట్లు తెలుస్తోంది.
Trainee IPS Uday Krishna Reddy, CP Sajjanar Encounter Threats, Upparapally Court Show Cause Notice, SVPNPA Trainee IPS Controversy, Telangana Police Legal News
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trainee-ips-uday-krishna-reddy-36-228335.html
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు