Publish Date:Jun 13, 2026
హైదరాబాద్లో శుక్రవారం (జూన్ 12) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. భారీ వర్షం కారణంగా రెండు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రెండు ప్రమాదాలలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు విషాద ఘటనలకు దారితీశాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలు వురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అల్వాల్ పరిధిలోని టెలికాం కాలనీలో భారీ వర్షం కారణంగా ఓ చెట్టు విరిగి ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ తీగలు తగలడంతో తండ్రీ కూతుళ్లు సందీప్, రితిక మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో సందీప్ భార్య శ్వేత గాయపడ్డారు.
మరో ఘటనలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో తాటి చెట్టు కూలి ఓ మహిళ మృతి చెందింది. సభావత్ లక్ష్మి తన కుమా రుడు వెంకట్ రామ్, కోడలు లలితతో కలిసి రేకుల ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు కూలి ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tragedy-strikes-two-families-in-hyderabad-36-222824.html
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.