ఆత్మార్పణం చేసుకోవడం చట్టరీత్యా నేరం. సనాతన ధర్మం కూడా మహాపాపం అని బోధిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, సంపన్నులు అక్కడే చనిపోవాలని బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో చనిపోతే వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుందని ఆయన బోధిస్తున్నాడు. ఇటీవల అక్కడ తొక్కిసలాట జరిగి 30 మందికిపైగా చనిపోయారు. 60 కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ సదరు ఎంపీ మాత్రం యోగి ఆదిత్యనాథ్ పక్షాన నిలబడి కుంభమేళాలో చనిపోతే మోక్ష ప్రాప్తి లభిస్తుందని కొత్త నిర్వచనం చెప్పి వార్తల్లోకెక్కాడు లోక్సభలో పప్పు యాదవ్ మాట్లాడుతూ చనిపోయిన వారి మృతదేహాలను హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిగాయని యుపి సర్కార్ తరపున వకాల్తా పుచ్చుకుంటే ప్రతి పక్షాలు మాత్రం వేరే విధంగా చెబుతున్నాయి. కుంభమేళ జరుగుతున్న త్రివేణి సంగమంలో మృతదేహాలను పారవేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందారని ఒక బాబా తనతో చెప్పారని పప్పు యాదవ్ తెలిపారు. కాబట్టి రాజకీయ నాయకులు, ధనికులు, బాబాలు కుంభమేళాలో చనిపోవడమే మార్గమని చెప్పుకొచ్చారు చట్టాలను రూపొందించే చట్ట సభలోనే పార్లమెంటు సభ్యుడి హోదాలో భక్తులను చనిపోవాలని వింత కోరిక కోరడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మోక్షానికి మూడుమార్గాలు ఉన్నవని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. ఒకటి భక్తి మార్గం, రెండు జ్ఞాన మార్గం, మూడు యోగమార్గం.
ఇందులో మొదటిది భక్తిమార్గం. ఇది సులభతరం. పూజలు, వ్రతాలు, భజనలు, కైంకర్యాలను ప్రోత్సహించటం వల్ల మోక్షం పొందొచ్చు.
రెండోది జ్ఞానమార్గం. జ్ఞానులుగా జన్మించి అంటే ఎన్నోజన్మలుగా సత్కర్మలు చేసి మోక్షంవైపు వేగంగా అడుగులు వేయొచ్చు.
మూడవది యోగమార్గం. ఈ మార్గంలోఅతి కఠినమైన యోగ సాధన చేయాలి. దీనికి గురువుల అనుగ్రహం కంపల్సరీ.
ఈ మూడుమార్గాలు కాకుండా కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోవాలని ఒక ప్రజా ప్రతినిధి నిండు లోకసభలో కామెంట్ చేయడంతో ప్రజాస్వామ్యం పట్ల సదరు ఎంపీగారికి ఉన్న అవగాహన ఏంటో తెలియజేస్తుంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/to-attain-salvation-one-must-die-in-the-kumbh-mela-25-192417.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.