డిక్లరేషనే దిక్కా.. లడ్డూ వివాదంలో జగన్ ను వదిలేసిన వైసీపీ సీనియర్లు?

Publish Date:Sep 27, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం తార స్థాయికి చేరుకున్న వేళ.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. శుక్రవారం తిరుపతికి చేరుకోనున్న వైఎస్ జగన్.. శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తమపై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమలలో పర్యటించి.. శ్రీవారి దర్శనం తీసుకోనున్నారు. అయితే వైఎస్ జగన్.. తిరుమల శ్రీవారి దర్శనం వేళ.. డిక్లరేషన్ అంశం కీలకంగా మారింది.  కొందరు హిందూ సంఘాల నేతలు.. జగన్ తిరుమలకు రావద్దని పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంతటి ఉద్రిక్తతల నేపధ్యంలో జగన్ శనివారం (అక్టోబర్ 28) తిరమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే జగన్ ను అడ్డుకుని తీరుతామంటూ.. బీజేపీ, హిందూ సంస్థలు ఇప్పటికే హెచ్చరించారు.  

ఇదంతా పక్కన పెడితే జగన్ డిక్లరేషన్ ఇస్తారా? అన్న విషయమే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.  జ .జగన్ 27 వతేదీనే తిరుమల చేరుకుంటారు. అదే సమయంలో హిందూ సంస్థలు,బీజేపీ  జగన్ తిరుమల వెళ్లాలంటే అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల పవిత్రత కాపాడాలని హిందూ సంఘాలు మూడు రోజుల పాదయాత్ర చేట్టాయి.ముఖ్యంగా  బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పురంధరేశ్వరి అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ మాత్రం తాను 2009లో డిక్లరేషన్ ఇచ్చానని ప్రకటించారని,ఒ కసారి డిక్లరేషన్ ఇస్తే చాలని ఇప్పుడు ఇవ్వనవసరం లేదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేసి చేతులు ఊరుకోవడమే వైసీపీకి అవకాశం ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ జ్యుడిషియల్ విచారణ కాని, సీబీఐ విచారణ గాని చేయాలని డిమాండ్ చేస్తున్నది. అయితే తెలుగుదేశం వైసీపీ డిమాండ్ పై స్పందించడం లేదు.  ఎందుకంటే.. సందేహాలకు అతీతంగా వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అవకతవకలు  ఒక్కోటి బయటకు వస్తున్నాయి. వాణీ ట్రస్ట్, విఐపీ టిక్కెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు,  కొనుగొళ్లలో కమీషన్లు వైసీపీ పరువును ఇప్పటికే పాతాళానికి దిగజార్చాయి. ఈ వివాదాల్లో పలువురు వైసీపీ నాయకుల హస్తం ఉందనే జనం నమ్ముతున్నారు.లడ్డూ తయారీకి వాడే ఆవునెయ్యి లో రివర్స్ టెండరింగ్ ద్వారా ధరలను తగ్గించడం కూడా ఉత్పత్తి దారుడికి కల్తీ చేసే అవకాశం అప్పటి టిటీడీ పాలకమండలి   ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి  ఆదాయం బాగానే వస్తున్నా కూడా రివర్స్ టెండరింగ్ లు, నాణ్యతా ప్రమాణాలను తగ్గినా పట్టించుకోకవడం ఎందుకు అంటే  కమీషన్ల కోసమేనని పలువురు భావిస్తున్నారు. జనబాహుల్యంలో కూడా అదే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతున్నాది. 

గతంలో జగన్ సీఎం కుమారుడిగా, సీఎంగా తిరుమల అనేక సార్లు వెళ్లారు. కాని డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారం అడ్డంపెట్టుకుని వెళ్ళారు.ఇప్పుడు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అందులో లడ్డూ తయారీలో కల్తీ జరిగిన విషయంలో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా ఆయన శ్రీవారిని దర్శించుకోవడం అనుమానమే. డిక్లరేషన్ ఇవ్వడం అంటే వెంకటేశ్వర స్వామి పై విశ్వాసం ఉందని చెప్పడమే. మరి జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.  ఇక ధర్మ పరిరక్షణ జేఏసీ అయితే ఒక అడుగు ముందుకు వేసి జగన్ కు నిజంగా వెంకన్న దేవుడిపై విశ్వాసం ఉంటే భార్య భారతి తో తిరుమల కాలినడకన వచ్చి గుండు కొట్టించుకోవాలని మరీ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.

పుట్టుకతో క్రైస్తవుడయిన జగన్ అంత తొందరగా డిక్లరేషన్ ఇస్తారని ఆశించలేం.గతంలో వైఎస్ విజయమ్మ మేము హిందూ దేవాలయాలకు వెళ్లడం కేవలం హిందూ ఓటు బ్యాంక్ కోసమేనని చెప్పిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.  లడ్డూ వివాదంతో  హిందూ ఓటర్లను దూరం చేసుకున్నామన్న ఆందోళనే జగన్ ను తిరుమల పర్యటనకు పురిగొల్పిందనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు అదే  తిరుమల దేవుడి దర్శనం కోసం  జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించే ధైర్యం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

అలా అనుమానాలు వ్యక్తం కావడానికి  కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా  మంత్రులుగా పని చేసిన వారు, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పిన వారు, ఇతర సీనియర్ నాయకులు లడ్డూ వివాదం విషయంలో జగన్ కు మద్దతుగా మాట్లాడేందుకు సాహసించడం లేదు.  వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మాజీ టీటీడీ చైర్మన్లు గా వివరణ ఇచ్చారు గాని పార్టీ నాయకులుగా జగన్ కు మద్దతుగా మాట్లాడడానికి సాహసించడం లేదు.  తగుదునమ్మా అంటూ పొన్నవోలు మీడియా ముందుకు వచ్చి.. జగన్ ను, వైసీపీని ఇంకా డిఫెన్స్ లో పడేశారు.  ఈ పరిస్థితిలో జగన్  డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దేవుడిని దర్శించుకోవడమంటే.. ప్రజలలో తన పరపతిని మరింత దిగజార్చుకోవడమే అవుతుంది.  మొత్తం మీద జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో రచ్చ జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తిరుమలలో రాజకీయ ప్రకటనలు చేయడం కూడా నిషేధం. మరి ఈ పరిస్థితుల్లో ఏమి జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.