జగన్ తిరుమల పర్యటనపై జనసేనాని ఎమన్నారంటే..?

Publish Date:Sep 27, 2024

Advertisement

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. డిక్లరేషన్ అంశం ఉద్రిక్తతలకు కారణమౌతోంది. గతంలో ముఖ్యమంత్రిగా జగన్ తిరుమల దేవుడిని సందర్శించుకున్న ఏ సందర్భంలోనూ డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే.  శుక్రవారం (సెప్టెంబర్ 27)సాయంత్రానికి జగన్ తిరుపతి చేరుకుని అక్కడ నుంచి తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమలలో బస చేస్తారు. శనివారం ఉదయం (సెప్టెంబర్ 28) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

అయితే హిందూ సమాజం జగన్ తిరుమల పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తిరుమల దేవుడిని అన్యమతస్థులు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దేవుడిని దర్శించుకుంటానని జగన్ ప్రకటించాలనీ, లేకుండా ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ, హిందూ సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. జగన్ అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వస్తే అడ్డంగా పడుకుని ఆయనను కదలనివ్వబోమని హెచ్చరించాయి. 

 జగన్ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వేంకటే శ్వరస్వామిని దర్శించుకోవడానికి అంగీకరించేది లేదని అల్టిమేటమ్ ఇచ్చారు. మొత్తంగా జగన్ తిరుమల పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసు అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ శ్రేణులకు కీలక సూచన చేశారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఎటువంటి ఆందోళనలకు దిగవద్దని పిలుపు నిచ్చారు.  అన్య మత స్థుడైన జగన్ ను డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వడం, ఇవ్వక పోవడం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  అందుకే జగన్ మతం, ఆయన పర్యటన లక్ష్యంగా ఎటువంటి ఆందోళనలూ చేయవద్దని పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో జగన్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఆందోళణల్లోనూ పాలుపంచుకోకూడదని జనసేన శ్రేణులు నిర్ణయించుకున్నాయి.   

ఇలా ఉండగా జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమౌతున్నాయి. అయితే  జగన్ పర్యటనను  అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందు సంఘాల హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు భద్రతా పరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలులో ఉంటుందని ప్రకటించారు. మొత్తానికి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం బయ టపడిన నేపథ్యంలో జగన్ నష్ట నివారణ చర్యలలో భాగంగా తిరుమల పర్యటన పెట్టుకున్నారు. అయితే దొంగే.. దొంగ దొంగ  అని అరిచిన చందంగా జగన్ తీరు ఉందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగం, కల్తీ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో దోషులెవరన్నది బయటపడతారు. ఈ లోగా ఈ అంశంపై తిరుమల పర్యటనకు జగన్ రెడీ అవ్వడం ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.