అమరావతిలో తిరుమల.!

Publish Date:Jul 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో తిరుమల  వెలుస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం  శ్రీకారం చుట్టింది.  రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలోని  శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ  260 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న భారీ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాస్త్రోక్తంగా నిర్వహించి  శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ   ప్రాజెక్టును కేవలం రెండున్నరేళ్ల కాలపరిమితిలోనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

ఈ   ప్రాజెక్టును మొత్తం రెండు విడతల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత పనుల కోసం  140 కోట్ల రూపాయలు కేటాయించారు.  మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఆంజనేయస్వామి ఆలయం,  పుష్కరిణి , అలాగే ఆలయ పరిసరాల అంతటా సుందరమైన కట్-స్టోన్ ఫ్లోరింగ్ పనులను ఈ విడతలో పూర్తి చేయనున్నారు. అమరావతి నగరానికి వచ్చే భక్తులకు తిరుమల దివ్య క్షేత్రాన్ని దర్శించిన అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్మాణ శైలి ఉండ నుంది. 

ఇక రెండవ విడత పనుల కోసం రూ. 120 కోట్లను కేటాయించి భక్తుల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా తిరుమల కొండ తరహాలోనే ఇక్కడ కూడా ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆలయానికి అనుసంధానంగా ఉండే ప్రధాన రహదారులను విస్తరించనున్నారు. వేలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాద వితరణ చేసేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన భారీ అన్నదానం కాంప్లెక్స్, అలాగే భక్తులకు   వసతి గృహాలు,  ఆలయ అర్చకులు,   ఇతర సిబ్బంది నివాస సముదాయాలను నిర్మించనున్నారు. 

వాస్తవానికి  2019 కంటే ముందే కృష్ణా నది తీరాన దాదాపు 25.4 ఎకరాల సువిశాల స్థలంలో తిరుమల ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి భూమిని కేటాయించింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించి, పనులను దాదాపు నిలిపివేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను మళ్లీ వేగవంతం చేసి, అమరావతిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు ఈ భారీ విస్తరణ ప్రణాళికను పునరుద్ధరించారు. రాజధాని అమరావతిని దైవసంకల్పంతో కూడిన నగరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభివర్ణించారు.  

Amaravati TTD Temple, Sri Venkateswara Swamy Temple Amaravati, Chandrababu Naidu Temple Foundation

By
en-us Political News

  
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్‌డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.