Publish Date:Oct 20, 2022
ఒత్తుగా, పొడవుగా చక్కటి జడ వేసుకుని ఆడపిల్లలు తిరుగుతూండాలే అంటూంది పెద్దమ్మ. అలా ఈ రోజుల్లో అవుతోందా? పదో తరగతి దాటితే చాలు పొడవు జడ కాస్తా స్టయిల్ మార్చుకుంటుంది. కానీ అది ఏమాత్రం బావుందనేది వేరే సంగతి.ట్రండ్ ఫాలో కావాలి. అభిమాన హీరోయిన్ ఎలా వేసుకుంటే అలా ఉండాలంతే. దీనికి తల్లి కూడా అంగీకరించాల్సిందే. పిల్ల మరీ ముద్దొస్తోందే.. పోనీలే ఉండనీ అని గారా బు చేసి పెద్దామెను ఒప్పిస్తుంది. అదో సరదా! కానీ ఈ పాప మాత్రం సరదాగా ఏమీ లేదు. అద్దం ముందు చూసుకుంటున్న తన వొత్తయిన చూడముచ్చటి జుత్తు చూసి ఎంతో ఆనందిస్తోంది. కానీ అదో విగ్గు! అవును విగ్గు పెడుతున్నావిడ పేరు టిఫానీ.
టిఫానీకి ఆ పిల్లంటే మహా ప్రేమ. అంతకు మించిన దయా, కరుణ. కానీ ప్రేమ కంటే దయను ఆమె ప్రదర్శించడం ఇష్టంలేదు. ఎందుకంటే ఆ పిల్ల అనారోగ్యం టిఫానీకి బాగా తెలుసు. ఆ పిల్ల చూడ ముచ్చట గానే ఉంది. కానీ ఆమె కాన్సర్తో బాధపడుతోంది. ఆమెకు కెమో థెరిపీ చేస్తున్నారు. ఆ కారణంగా ఆ చిన్నతల్లి చక్కటి జుత్తును కోల్పోయింది. కానీ ఆమెను దిగులుగా చూడటం ఇష్టంలేక తల్లి విగ్గు పెట్టించి ఆ పిల్లను ఆనందంగా ఉండేట్టు చేసింది. అందుకే విగ్గులు తయారుచేసి ఇలాటివారికి ఉచితంగా ఇచ్చే టిఫానీ అనే ఫ్యాషన్ డిజైనర్ని కలిసింది. పాప కథ విన్నది. తీసుకువచ్చాక మనసు రోదించింది. దగ్గరకు తీసుకుని నీకు మంచి జుత్తు నేను ఇస్తానన్నది. అంతే కొత్తగ తయారుచేయించి ఆమెకు అమర్చి అద్దం ముందు కూర్చోబెట్టి చూపింది.
ఆమెకు కాన్సర్ అని తెలిసినప్పటికి ముందు, కిమోథెరపీ చేయించుకోవడానికి ముందు ఎలా ఉండేదో అంతే అందమైన జుత్తుతో ముద్దుగా ఉంది. ఆ భావం టిఫానీ కల్పించింది. అదే ఆనందంతో ఆమె మరి కొన్నాళ్లు ప్రశాంతంగా, ఇతర పిల్లల్లా చక్కగా నవ్వుతూ సరదాగా బతికేస్తుంది. వాస్తవానికి ఆమె జబ్బు చాలా సీరియస్ స్థాయికి చేరుకుందని డాక్టర్లు చెప్పారు. ఆమెకు మాత్రం అదేమాత్రం నిన్ను బాధిం చదు. కాకుంటే కాస్తంత జుత్తు పోయిందంతే...జుత్తుకోసం బెంగెట్టేసుకోకమ్మా.. అన్నారు. డాక్టర్లు ఇచ్చే ధైర్యం, తల్లిదండ్రుల ప్రేమ ఆమెను మరింత కాలం కాలంగడిపేలా చేస్తుంది. ఇపుడు ఆమెకు టిఫానీ ఇచ్చిన ధైర్యాన్ని, సరదానీ మించి ఎవరు ఇవ్వగలరు. తోటి స్నేహితులు, పక్కింటివాళ్లూ ఆమెను మళ్లీ ఇంతే సరదాగా చూడాలనుకుంటున్నారు. ఇదే చూస్తారు, చూడాలి. ఆమె చిరకాలం బతకాలనే అనుకుంటు న్నారు. మనసు మాత్రం రోదిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tiffany-medicine-to-cancer-girl-39-145794.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.