త్యాగాలు స‌రే.. గ్రాఫ్ పెంచుకుంటేనే టిక్కెట్‌!

Publish Date:Jul 19, 2022

Advertisement

పూర్వం రాజుల‌కైనా, ఇప్ప‌టి సీఎంల కైనా అధికార‌పీఠం ఇబ్బందిక‌ర‌మైన‌దే. త‌మ ప్ర‌త్యేక‌త‌లు చాటు తూ పాల‌న‌లో అద్భుతాలు చేస్తూ ప్ర‌జాభిమానాన్ని పొందితేనే నాలుగు కాలాలు పాల‌న స‌వ్యంగా సాగు తుంది. అలాగాకుండా త‌న‌కుతోచిన విధంగా త‌న మాట అంద‌రూ వినాలి, త‌న మాటేశాస‌నం అంటే మాత్రం పీఠం ఎక్కించిన‌వారే దించేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇదుగో ఇలాంటి ప‌రిస్థితే ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి ఎదుర‌యింది. ఆయ‌న ఇటీవ‌లి పాల‌నా వ్య‌వ‌హ‌రాలు ఏవీ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డం లేదు. అన్ని రంగాల్లోనూ అనుకున్న విధంగా ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. దీనికి తోడు మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించే కార్య‌క్ర‌మం చేస్తుండ‌ డంతో వారు జ‌నాల్లోకి వెళ్లి  ప్ర‌భుత్వ అద్భుత కార్య‌క్ర‌మాలు ప్రచారం చేయ‌డంలోనూ విఫ‌ల‌మై తిట్లు తింటూ వెన‌క్కి మాడిన మొహాల‌తో వ‌స్తూండ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఇపుడు వైసీపీ నేత జ‌గ‌న్ మ‌రింత కొత్త‌గా హెచ్చ‌రించారు. సోమ‌వారం జ‌రిగి న స‌మావేశంలో  జ‌గ‌న్ ఆగ్ర‌హం బ‌య‌ట‌పెట్టారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లో ప్ర‌జల్ని ఆక‌ట్టుకుంటూ త‌మ గ్రాఫ్ పెంచుకుంటేనే వ‌చ్చేసారి టికెట్ గెలుచుకుంటార‌న్న హెచ్చ‌రిక చేశా రు. అంతే మ‌ళ్లీ అంద‌రిలో భ‌యం రెండింత‌ల‌యింది. 

రాష్ట్రంలో ఇటీవ‌ల స‌ర్వేలు నిర్వ‌హించిన సంస్థ‌లు ఏతావాతా తేల్చిందేమంటే ఈప‌ర్యాయం వైసీపీకి ఛాన్సు బ‌హుత్ క‌ష్ట్ అని. అది మీడియా ద్వారానే సీఎంకీ చేరి సీట్లో నిల‌క‌డ‌గా కూర్చోలేని ప‌రిస్థితి వ‌చ్చిం ది. దీంతో ఆయ‌న అంద‌రిమీదా కారాలు మిరియాలు నూరుతున్నారు. పైగా ఇటీవ‌లి పార్టీ ప్లీన‌రీ వ‌ల్ల పెద్ద‌గా అనుకూలత సాధించ‌క‌పోగా విమ‌ర్శ‌లే బాగా విన‌ప‌డ్డాయి. ఇక ఇపుడు నోరు పారేసుకున్న నేత‌లు త‌మ గ్రాఫ్‌ను ఎలా పెంచుకోవాలో గ‌ట్టిగానే ఆలోచించాలి. ఇటీవ‌లి దాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క‌.. అన్న తిట్టిపోశాడు.. తప్ప‌దు తిమ్మిని బొమ్మిని చేసి గ్రాఫ్ పెంచుకోవాలి. కానీ హ‌ఠాత్తుగా పెరిగిపోవ‌డానికి అదేమ న్నా పెన్సిల్‌తో గీత పెంచ‌డ‌మా?   మంత్ర‌లు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లో బుద్దిగా మ‌ళ్లీ తిరుగుతూ ప్ర‌జల‌కు త‌మ త‌ప్పిదాల‌ను తామే అంగీక‌రిస్తూ, క్ష‌మాప‌ణ‌లు కోరుకుంటూ ఈసారికి ఇలా వ‌దిలేయ‌మ‌ని కోరుకోవాలి. అప్ప‌టికీ ప్ర‌జ‌లు, ఓట‌ర్లు అంగీక‌రించితే వీరంతా అదృష్ట‌వంతులే. కానీ ఆ ప‌రిస్థితి అస్స‌లు కాన‌రావ‌డం లేదు. 

జ‌గ‌న్  గ‌డ‌ప గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం పై  మ‌రోసారి వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు.  అది అతి ఘోరంగా విఫ‌ల మ‌యింద‌న్న‌ది ఆయ‌న‌కీ తెలిసొచ్చింది.  ప్ర‌జ‌లు అన్నిప్రాంతాల్లోనూ మ‌నం ఓట్లు వేసి గెలిపిం చిన పెద్ద‌మ‌నుషుల‌న్న గౌర‌వం కూడా లేకుండా, మామూలు లోక‌ల్ లీడ‌ర్ల‌ను చూసినంత చుల‌క‌న‌గానే చూస్తున్నారు. తిట్టారు, తొడ‌గొట్టి స‌వాలు చేశారు, ఒక్క మంచి ప‌నిచేశారా, ఓట్లు కోసం రావ‌డం త‌ప్పా అని మూడేళ్ల ఆగ్ర‌హాన్ని ఒక్క‌సారి కుమ్మ‌రించి మ‌రీ పంపారు. వెళ్లిన వారంతా భ‌యంతో, అవ‌మాన భారంతో నాయ‌కుని వ‌ద్ద‌కు వెళ్లి ఆ మిగిలిన తిట్లూ తిన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ గ్రాఫ్ ఎంత‌ని పెంచుకోవాలి?  అస‌లు ఎదురుగా క‌న‌ప‌డితేనే నాయ‌కునికి వీరి ప‌ట్ల చిరాకేస్తోంది. ఇక ఎన్నిక‌లు ఆట్టే దూరంలో లేవు గ‌నుక ఇక‌నైనా వెళ్లి మ‌ళ్లీ జ‌నాన్ని బుజ్జ‌గించే ప‌ని చూడండి  అని మ‌రో సారి జ‌నంలోకి తోసేసారు జ‌గ‌న్‌. పార్టీకోసం, త‌న కోసం త్యాగాలు చేశార‌ని ద‌యాదాక్షిణ్యాలు చూపించే ఛాన్స్‌కూడా లేద‌న్న‌ది జ‌గ‌న్ ఆగ్ర‌హం తాత్ప‌ర్యం. అందువ‌ల్ల అలా జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా వున్నామ‌ని, వారి ద‌య‌కు పాత్రుల‌య్యామ‌ని అనుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులూ ఇక ఈ కొద్దికాలం గ‌ట్టిగా త‌మ కోస‌మైనా శ్ర‌మించాల్సిన అవ‌స రం ఎంతైనావుంది. లేక‌పోతే  నాయ‌కుడు, పార్టీతో పాటు ప్ర‌జ‌లు త‌మ‌ని వ‌దిలేయ‌డం ఖాయ మ‌న్న‌ది ఈ స‌రికే వారంతా గ్ర‌హించే ఉండాలి.  ఎందుకంటే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ అనే కార్య‌క్ర‌మంలో పార్టీ నిర్దేశించిన మార్గ ద‌ర్శ‌కాల ప్ర‌కారం 15 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే పొల్గొంటున్నార‌ని 50 మంది అస‌లు వారి ఇంటి గ‌డ‌పే దాట‌లేద‌ని జ‌గ‌న్ ఆగ్రహించారు.  కార్యక్రమం నెలలో 16-20 రోజులు పాల్గొనాలని స్పష్టం చేశారు. 20 రోజులలో కనీసం ఆరు లేదా ఏడు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటించాలన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని జగన్‌ తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో 87 శాతం మందికి ప్రభుత్వం లబ్ధి చేసిందన్నారు. అందుకే మొత్తం 175 స్థానాలూ సాధించడం కష్టం కాదన్నారు. విజయవాడ, విశాఖ కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించాలని ఎమ్మె ల్యేలు కోరినా  సీఎం స్పందించలేదు. ‘సీఎం డెవల్‌పమెంట్‌ ఫండ్‌’ కింద నియోజకవర్గ అభివృద్ధికి రెండు కోట్లు.. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున విడుదల చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నానని జగన్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు విజిట్‌ చేసిన 2 రోజుల్లో రూ.20 లక్షల నిధులు ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.  

పట్టభద్రుల స్థానాల్లోనూ వైసీపీ పోటీపట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈసారి పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుదామని వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇప్పటి వరకూ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారికి బయటి నుంచి మద్దతిస్తూ వస్తున్నామ ని.. ఈసారి వైసీపీ తరఫున మనమే అభ్యర్థిని బరిలో కి దింపుదామని అన్నారు. కాగా..  నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని వైసీపీ ప్రకటించింది. తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన ఈయన వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అనుచరుడు. ఈయన భార్య సుస్మితారెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్‌ను టీడీపీ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికలకు అప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తుండడం విశేషం.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.