తల్లిదండ్రులు పొరపాటున కూడా ఈ విషయాలు మగపిల్లలతో చెప్పకూడదట..!

Publish Date:Jan 3, 2024

Advertisement

పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాల్. లింగ సమానత్వం అనే మాటను ఎంత సీరియస్ గా తీసుకున్నా సరే.. ఆడపిల్లలను, మగపిల్లలను పెంచే విధానంలో ఎంతో కొంత తేడా ఉండనే ఉంటుంది. ముఖ్యంగా జెండర్ కారణంగా తల్లిదండ్రులు మగపిల్లలకు కొన్ని విషయాలు చెబుతుంటారు. తల్లిదండ్రులు మంచి కోసమని చెప్పే ఆ విషయాలు  పిల్లల భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. పిల్లల వ్యక్తిత్వాన్ని ఊహించని విధంగా మార్చేస్తాయి. తల్లిదండ్రులు మగపిల్లలకు చెప్పకూడని విషయాలేంటో తెలుసుకుంటే..


మగపిల్లాడు ఏడవకూడదని చెప్పొద్దు..

అబ్బాయిలు ఏడవకూడదని, ఏడవడం తప్పు అని చాలా మంది తల్లిదండ్రులు తమ కొడుకులకు చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. ఎప్పుడైనా మగపిల్లాడు ఏడుస్తుంటే అదేంటి అలా ఏడుస్తున్నావు ఆడపిల్లలాగా అని ఎగతాళి కూడా చేస్తారు.  కానీ నిజమేంటంటే ఈ విషయం మగపిల్లలకు అస్సలు చెప్పకూడాదు. ఇవి పిల్లల మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనితో పిల్లలు తన ఆలోచనలను, భావోద్వేగాలను  తమలోనే ఉంచుకోవడం మొదలుపెడతారు.

మగపిల్లలను వెక్కిరిచకూడదు..

పిల్లలు ఎదిగేకొద్ది వారి వ్యక్తిత్వం కూడా మెరుగవుతూ వస్తుంది. తల్లిదండ్రులు అయినంతమాత్రాన మగపిల్లలు పెద్దవారు అయినా సరే వారిని  ఏదైనా అనేయవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులు మానుకోవాలి. ఓ వయసుకు వచ్చాక మగపిల్లలు ఇంట్లో ఉంటే చాలామంది తల్లిదండ్రులు ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఇంకెన్నాళ్లు ఇంట్లోనే కూర్చుని తింటావు అని అంటూ ఉంటారు. కానీ ఈ మాటలు  మగపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

అనుమానించకూడదు..

చాలామంది తల్లిదండ్రులకు కొడుకుల మీద అనుమానం ఉంటుంది. దీనికి కారణం మగపిల్లల స్నేహాలు, పరిచయాల లిస్ట్ పెద్దది. అవసరాల కోసం మగపిల్లలు తల్లిదండ్రులతో అబద్దాలు కూడా చెబుతారని అనుకుంటారు. పొరపాటున ఇంట్లో ఏదైనా వస్తువు మిస్ అయినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురైనా వెంటనే కొడుకునే అంటూ ఉంటారు. ఇది మగపిల్లల దృష్టిలో తల్లిదండ్రును చెడ్డగా మారుస్తుంది.

పోలికలు పెట్టకూడదు..

మగపిల్లలు చదువు, ఉద్యోగంలో ఏమాత్రం సెటిల్ కాకపోయినా వారిమీద పోలికల యుద్దం చాలా దారుణంగా ఉంటుంది. కేవలం కొడుకులు అనే కాదు, కూతుర్లను కూడా ఈ విషయాలలో పోల్చి చూస్తారు. వాడు ఎంత బాగా చదువుతాడో, ఎంత మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడో, మీకు తల్లిదండ్రులంటే భయం గౌరవం లేదు.. వాళ్లు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో.. ఇలాంటి మాటలు తరచుగా అంటూ ఉంటారు. కానీ ఇవి అస్సలు అనకూడదు.  తల్లిదండ్రుల మీద పిల్లలకు ద్వేషం పెరగడానికి కారణమవుతుంది.

                                            *నిశ్శబ్ద.

By
en-us Political News

  
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.