పంజాగుట్టలో కిలో బంగారం చోరీ చేసిన దొంగ అరెస్టు

Publish Date:Feb 16, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న ప్రముఖ ఆభరణాల దుకాణం జాయ్ అలుకాస్‌లో చోరీ జరుగుతున్నట్లుగా నిన్న యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేదించారు. పోలీసుల దర్యాప్తులో షాపులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను క్రమంగా అపహరించిన ఘటన  బయట పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న ఆదివారం 15వ తేదీన జై అలుకాస్ యజమాన్యం తన షాప్ లో బంగారు బిస్కెట్లు చోరీ జరిగినట్లుగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దొంగతనానికి పాల్పడిన ఉద్యోగి అసలు రంగు బయటపెట్టారు. పంజాగుట్ట సంబంధిత ఉద్యోగి జాయ్ అలుకాస్ షాపులో పనిచేస్తూ ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా అతి జాగ్రత్తగా రోజుకు కొద్దికొద్దిగా ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. షాపులో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరే కావడంతో అతనిపై తొలుత ఎలాంటి అనుమానం కలగలేదు. అయితే స్టాక్‌ తనిఖీల సమయంలో ఆభరణాలు మిస్సింగ్‌గా గుర్తించిన యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది.

సీసీటీవీ ఫుటేజ్‌లు, స్టాక్ రికార్డులను పరిశీలించిన అనంతరం ఆ ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు జాయ్ అలుకాస్ యాజమాన్యం నిర్ధారించింది. వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన సమాచారంతో  నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి  1,65,00,000 రూపాయల విలువ చేసే 10 బంగారు బిస్కెట్లు, ఒక బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపగా, షాపింగ్ మాల్స్ మరియు ఆభరణాల దుకాణాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పోలీసులు సూచించారు.


 

By
en-us Political News

  
బెంగళూరు నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఓటర్ల ఉత్సాహంతో ఊగిపోయింది
ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.