3 రాజధానులతో ప్రజలకు లాభమా? నష్టమా?

Publish Date:Dec 18, 2019

Advertisement

అధికార వికేంద్రీకరణ... మూడు రాజధానులు... అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి... సెక్రటేరియట్ ఒక చోట... హైకోర్టు మరో చోట... అసెంబ్లీ ఇంకో చోట... ఇలాంటి మాటలు చెప్పడానికి... వినడానికి బాగానే ఉంటాయి... కానీ వాస్తవంలో మాత్రం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడతాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌.... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్‌.... అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్‌.... ఇలా ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి సంకేతాలిచ్చినా ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగమనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే, అధికార వికేంద్రీకరణ విధానం మంచిదంటూ స్టేట్ మెంట్ ఇచ్చినంత ఈజీగా ప్రజలకు మేలు జరగనే జరగదు. అందుకే, జగన్ చెప్పిన మూడు ప్రాంతాలు ...రాజధానులుగా ప్రజలకు ఎంతవరకు సౌలభ్యమనేది ఆలోచించారు. ఎందుకంటే, రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరంలో సెంట్రల్ పాయింట్ లో ఉంటేనే అందరికీ సౌలభ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, విశాఖ, కర్నూలు... ఈ రెండూ కూడా కశ్మీరూ... కన్యాకుమారి మాదిరిగా ఒకటి మ్యాప్ లో మొదట ఉంటే.... రెండోది చివర్లో ఉన్నట్లు ఉంటాయి.

అమరావతి-విశాఖ మధ్య దూరం 352 కిలోమీటర్లు.... అలాగే, అమరావతి-కర్నూలు మధ్య దూరం 342 కిలోమీటర్లు... అంటే, అమరావతి నుంచి విశాఖ మధ్య దూరం ఎంతుందో.... అమరావతి నుంచి కర్నూలు మధ్య డిస్టెన్స్ కూడా దాదాపు అంతే ఉంది. దాంతో, అమరావతి నుంచి కర్నూలు వెళ్లాలన్నా.... విశాఖ వెళ్లాలన్నా.... ప్రమాణ సమయం రెండింటికీ దాదాపు ఏడెనిమిది గంటలే పడుతుంది. అయితే, విశాఖ నుంచి కర్నూలు రావాలన్నా..... కర్నూలు నుంచి విశాఖ వెళ్లాలన్నా.... సుమారు 15గంటల సమయం పడుతుంది. దాంతో, కోర్టు పనుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలు రావాలన్నా.... రాయలసీమ ప్రజలు సెక్రటేరియట్‌ కోసం విశాఖ వెళ్లాలన్నా ...చాలా వ్యయప్రయాసలు తప్పవు. ఎందుకంటే, విశాఖ - కర్నూలు మధ్య దూరం 691 కిలోమీటర్లు. అంటే, ప్రయాణానికే దాదాపు ఒకరోజు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇది, చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నదే కాకుండా ప్రజలరు తమ విలువైన సమయాన్ని కూడా కోల్పోతారు.

మూడు రాజధానుల ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నా... ఆచరణలో మాత్రం వ్యయభారం, కాలాతీతంతో ప్రజలకు కష్టాలు తెచ్చే అవకాశముంది. ఎవరైనా ఒక వ్యక్తి మూడు రాజధానుల్లో పనులు చక్కబెట్టుకోవాలంటే విలువైన సమయాన్నీ, సొమ్మునీ కోల్పోక తప్పదు. అయితే, అటు ఉత్తరాంధ్రకు.... ఇటు రాయలసీమకు సమాన దూరంలోనూ... రాష్ట్రానికి సెంట్రల్ పాయింట్ గా ఉండే అమరావతే... ఏపీకి రాజధానిగా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.