Publish Date:Jul 27, 2022
ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అని ఓ సినిమాలో పాట. జగన్ సరిగ్గా అందేకే నీతులు చెబుతారు. అవి ఎదుటి వారికి చెప్పేటందుకు మాత్రమే. ఆయన ఆచరించేందుకు ఎంత మాత్రం కాదు. విపక్షంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి మినరల్ వాటర్ తాగడమే మహాపాపం అన్నట్లు గగ్గొలు పెట్టారు. ఒక హిమాలయ మినరల్ వాటర్ బాటిల్ ఖరీదు ఏకంగా 60 రూపాయలు.. ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు.
విపక్ష నేతగా అప్పటి ముఖ్యమంత్రి తన వయసు దృష్ట్యా ఆరోగ్యం కోసం ఓ అరవై రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తాగితేనే మిన్నూ మన్నూ ఏకమయ్యేలా గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయిన తరువాత అయిన దానికీ కాని దానికీ కుటుంబంతో విహార యాత్రలకు స్పెషల్ చార్టర్డ్ విమానాలను ఉపయోగిస్తున్నారు. అ ఖర్చేమీ సొంత ఖాతాలోంచి ఇవ్వడం లేదు. ప్రజల ధనాన్నే తన విలాసాలకు ఉపయోగించేస్తున్నారు.
అంతెందుకు ఏ పెన్నుతో రాసినా అవే అక్షరాలు కానీ జగన్ మాత్రం చిన్న సంతకం పెట్టడానికి ఉపయోగిస్తున్న పెన్ను ఖరీదెంతో తెలుసా అక్షరాలా అరవై వేల రూపాయలు. ఆరవై రూపాయలు వెచ్చింది మినరల్ వాటర్ తాగినందుకే చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ నాడు గగ్గోలు పెట్టిన జగన్ సీఎంగా 60 వేల రూపాయల పెన్ను ఉపయోగిస్తూ కూడా ప్రజాధనాన్ని వారి సంక్షేమం కోసమే సద్వినియోగం చేస్తున్నానని ఎలా చెప్పగలరు?
దావోస్ ఆర్థిక సదస్సులకు సీఎం హోదాలో చంద్రబాబు వెళ్లినప్పుడు ఏం సాధించుకు రావడానికి ప్రజా ధనంతో విదేశీ యాత్రలు అంటూ విమర్శించిన జగనే ఇప్పుడు స్వకార్యం, స్వామి కార్యం కూడా కలిసి వచ్చేలా స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో దావోస్ వయా లండన్ సతీ సమేతంగా చేసిన విహార యాత్ర ద్వారా రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పగలరా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-cost-of-pen-that-jagan-use-is-60-25-140667.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.