Publish Date:Jul 27, 2022
ఒక అద్భుత ప్రదర్శన, ఒక ఘన విజయం తర్వాత ఊహించని పరిణామాలు దేశ ఆశల్ని అడియాసలే చేస్తాయి. నీరజ్ చోప్రా విషయంలో ఇదే జరిగింది. ఈమధ్యనే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజ తం సాధించి దేశానికి ఘనకీర్తి తెచ్చిన జావెలిన్ త్రోయర్ గాయపడ్డాడు. మరి కామన్వెల్త్ గేమ్స్ పతకం చేజారినట్టే భావించాలా?
త్వరలో బర్మింగ్హామ్లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో చోప్రా స్వర్ణం సాధించి దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెస్తాడని దేశ ప్రజలంతా ఆశిం చారు. కానీ తొడ గాయం కారణంగా కామన్వెల్త్గేమ్స్లో పాల్గొనడం లేదన్నవార్త ఒక్కసారిగా అందరిని నీరసపరిచింది. 24 ఏళ్ల నీరజ్గాయం కారణంగానే పాల్గొనడం లేదని భారత ఒలింపిక్ సంఘం ప్రకటిం చింది.
అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్స్లో జావెలిన్ విసిరే సమయంలో నీరజ్ తొడ గాయం తో బాధపడ్డాడు. అది మానకపోవడంతో ఇక కామన్వెల్త్ గేమ్స్కు కష్టమని చోప్రా తెలియ జేయడం అంద రినీ నిరాశకు గురిచేసింది. అతనికి ఎమ్ఆర్ఐ స్కాన్ చేయించారు. అయితే, నెలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారని మెహతా తెలిపాడు. కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాక ధారిగా నీరజ్ వ్యవహరించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆంధ్ర కు చెందిన సబ్బినేని మేఘనతో పాటు పూజా వస్త్రాకర్ పాజిటివ్గా తేలారు. దీంతో వారు స్వదేశం లోనే ఉండిపోవలసి వచ్చింది. హర్మన్ప్రీత్ నాయకత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ వెళ్లింది. ముందుగా ఒక్కరే అనుకున్నప్పటికీ ఆ తర్వాత పరీక్షలో మరో క్రికెటర్ కూడా పాజిటివ్గా తేలిం దని ఐఓఏ తెలిపింది. ప్రొటోకాల్ ప్రకారం ఈ ఇద్దరికి నెగెటివ్ రిజల్ట్ వచ్చాకే జట్టుతో కలుస్తారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే భారత్ తొలి మ్యాచ్లో వీరిద్దరూ ఆడకపోవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-hopes-on-javelin--medal-25-140669.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.