మూడు రాజధానులపై ఒక్క అడుగు వెనక్కేసిన జగన్..!

Publish Date:Dec 28, 2019

Advertisement

 

అమరావతిలో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో జగన్ ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కేసింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మూడు రాజధానులపై అధికారిక ప్రకటన ఉందంటూ ప్రచారం జరిగినా... రాజధాని రైతుల ఆందోళనలతో కొంచెం వెనక్కి తగ్గారు. ఇప్పటికిప్పుడు అధికారికంగా ప్రకటిస్తే అమరావతి గ్రామాల్లో పరిస్థితి చేయి దాటుతుందన్న సమాచారంతో మూడు రాజధానుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే, అమరావతి రైతులు, ప్రజల ఆందోళనలను చల్లార్చడానికే హైపవర్ కమిటీ అంటూ వ్యూహం మార్చారనే మాట వినిపిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించినా.... ఇంకా బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ అందాల్సి ఉందంటూ ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతేకాదు, ఈ రెండు నివేదికపై మరింత విస్తృత అధ్యయనం కోసం హైపవర్ కమిటీని అపాయింట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే, మూడు రాజధానులపై అధికారిక ప్రకటన ఆలస్యమైనట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చాకే... రెండు రిపోర్టులపైనా హైపవర్ కమిటీ విస్తృత అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, జనవరిలోనే బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనుంది.

జీఎన్ రావు కమిటీ ఇవ్వకముందే, అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల మాటను సీఎం జగన్మోహన్ రెడ్డి బయటపెట్టడం.... ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ మాటలనే దాదాపు యథాతథంగా జీఎన్ రావు కమిటీ నివేదికగా ఇవ్వడంతో విమర్శలు చెలరేగాయి. జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని... అందుకే జీఎన్ రావు కమిటీతో తాము అనుకున్నది చెప్పించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే చెడ్డ పేరు రాకూడదనే... మరింత విస్తృత అధ్యయనం కోసం సీఎం జగన్ హైపవర్ కమిటీని అపాయింట్ చేశారని అంటున్నారు.

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.