రెండుగా చీలిన తెలుగుజాతి

Publish Date:Feb 20, 2014

Advertisement

 

దాదాపు పదేళ్లుగా తెలంగాణా ఉద్యమాలతో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతుంటే, దానిని సత్వరమే పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కమిటీలతో కాలక్షేపం చేసిన కాంగ్రెస్ పార్టీ, సరిగ్గా ఎన్నికల ముందు ఈ అంశాన్ని పరిష్కరించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేసింది. చివరికి ఈరోజు రాజ్యసభలో బిల్లుకి తనదైన శైలిలో ఆమోదముద్ర వేయించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసింది. అయితే అందుకు తెలంగాణా ప్రజలు చాలా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. వారు అనేక పోరాటాలు చేసి, అనేకమంది యువకులు బలిదానాలు చేసిన తరువాత కానీ తెలంగాణా ఏర్పాటు చేయాలనే తలంపు కాంగ్రెస్ పార్టీకి కలుగలేదు. ఏమయినప్పటికీ తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది గనుక ఇక ఇంతకాలంగా ఈ విభజన చిచ్చుతో తెలుగు ప్రజల మధ్య పతాక స్థాయికి చేరిన తీవ్ర విద్వేషాలు, విభేదాలు, అనుమానాలు, అసూయలకు ముగింపుపలికి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పూర్వ సత్సంభందాలు వీలయినంత త్వరగా పునరుద్దరించే విధంగా రాజకీయ నేతలు, పార్టీలే చొరవ తీసుకొని ప్రయత్నించవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోవచ్చును. కానీ, అది అపరిష్కృతంగా విడిచిపెట్టిన అనేక సమస్యలు మున్ముందు తలెత్తినప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు సామరస్యదోరణిలో వాటిని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. లేకపోతే ఈ వైషమ్యాలు శాశ్వితంగా నిలిచిపోయినట్లయితే అవి ఇరు ప్రాంతాల అభివృద్ధికి, శాంతికి ఆటంకంగా మారుతాయి.

 

ఇంతకాలంగా సీమాంధ్ర పాలకుల చెరలో మగ్గినందునే తెలంగాణాలో అభివృద్ధి జరుగలేదని వాదిస్తువచ్చిన తెలంగాణా నేతల చేతికే ఇప్పుడు పగ్గాలు వచ్చాయి గనుక, ఇకనయినా వారు నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య, కరీంనగర్ బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితుల సమస్యలు, సిరిసిల్లా నేతన్నల సమస్యలు, తెలంగాణా రైతన్నల సమస్యలు, లక్షలాది యువత ఎదుర్కొంటున్న విద్యా, ఉపాది సమస్యలను చిత్తశుద్దితో తీర్చేప్రయత్నం చేసి తెలంగాణాను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకొందాము.

 

ఇక సీమాంధ్ర పునర్నిర్మాణం పూర్తవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఈతరం ప్రజలు పూర్తిగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడగలరా? అని తలచుకొన్నపుడు ఎవరికయినా మనస్సు బాధతో కలుక్కుమంటుంది. కానీ, రాజకీయ పార్టీలు, వాటి నేతలు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, పట్టుదలగా కృషిచేస్తే తప్పకుండా ఒక దశాబ్దకాలంలోనే మళ్ళీ పూర్తిగా అభివృద్ధి సాధించడం అసాధ్యమేమీ కాదు. అణుబాంబులు పడిన హిరోషిమా, నాగసాకీలే మళ్ళీ లేచి నిలబడగలిగినప్పుడు, అనేక సహజవనరులు, నదులు, సముద్రాలు, ఓడరేవులు, వాణిజ్య కేంద్రాలతో చాలా దృడంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అబివృద్ధి సాధించి పూర్వ వైభవం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.

 

గత మూడు నాలుగు దశాబ్దాలుగా పాలకులందరూ కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాపానికి, ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. కనుక మళ్ళీ అటువంటి పొరపాటు పునారావృతం చేయకుండా రాష్ట్రంలో 13జిల్లాలు సరిసమానంగా అభివృద్ధి చెందేలా జాగ్రత్త పడాలి. తద్వారా అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందడమే కాకుండా, మళ్ళీ ఇటువంటి సమస్యలు పునరావుతం కాకుండా నివారించవచ్చును.

 

ఇంతకాలంగా అన్నదమ్ములవలె కలిసిమెలిసి జీవించిన తెలుగు ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టుకొని విడిపోవలసిరావడం చాలా బాధాకరంగా ఉన్నపటికీ, విడిపోతేనే సంతోషంగా ఉండగలమని తెలంగాణా ప్రజలు దృడంగా భావిస్తునందున, అందుకు అంగీకరించి వారందరికీ సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకొందాము. అదేవిధంగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా అనతికాలంలోనే ఈ బాధ, భావోద్వేగాల నుండి బయటపడి రాష్ట్ర పునర్నిర్మాణంలో తమతమ పాత్రలు పోషించి ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాటలు పరుచుకోవాలని మనస్పూర్తిగా ఆశిద్దాము. సర్వేజన సుకినో భవంతు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.