తెలుగు భాష వెలుగులు పూయించిన పుణ్యమూర్తి..గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి..!

Publish Date:Aug 29, 2025

Advertisement

 

 


ఆగస్టు 29వ తేదీ ప్రతి తెలుగు పౌరుడు ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన దినం. తెలుగు భాషను తన సహజ శైలిలో, జనజీవనానికి దగ్గరగా తీసుకెళ్లిన మహనీయుడు, గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి ఈ రోజు. ఆయన తెలుగు బాషకు చేసిన కృషి కారణంగా ఆయన జయంతినే తెలుగు బాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలుగు భాష కొరకు ఇంత పాటుపడిన గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి తెలుసుకుంటే..

వ్యక్తిత్వం..

1854 ఆగస్టు 29న విశాఖపట్నం జిల్లాలోని రాజమహేంద్రవరం సమీపంలోని పార్లకిమిడి ప్రాంతంలో జన్మించారు.  ఆయన  చిన్నతనం నుంచే తెలివితేటలతో, నేర్చుకోవాలనే తపనతో ఉండేవారు.  ఆర్థిక ఇబ్బందులున్నా  చదువు ఆపకుండా, స్వయంగా సాధన చేస్తూ తరువాత ఉపాధ్యాయుడిగా, పండితుడిగా, సాహితీవేత్తగా వెలుగొందారు.

పాండిత్యం – ఆచరణ – సాహిత్యం..

ఆ కాలంలో తెలుగు భాష గ్రంథిక భాష ఆధిపత్యంలో ఉండేది. అది సాధారణ జనజీవనానికి దూరమై, పుస్తకాలకే పరిమితమైపోయింది. విద్యార్థులు అర్థం కాని భాషలో పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చేది. గిడుగు పంతులు దీన్ని బలంగా వ్యతిరేకించారు.  పుస్తకాలలో గ్రాంథిక బాష,   వాడుకలో మాతృ భాష ఉండటం వల్ల విద్యార్థులు సరిగా విద్యను అభ్యసించ లేకపోతున్నారని ఆయన స్పష్టంగా చెప్పారు.

ఈ ఆలోచనలతోనే ఆయన వ్యావహారిక భాషా ఉద్యమం ప్రారంభించారు. తెలుగు మనుషులు తమ నిత్య జీవితంలో మాట్లాడే భాషలోనే పాఠాలు, రచనలు, విద్య జరగాలి అన్నది ఆయన వాదన. ఈ ఆలోచన అప్పట్లో పెద్ద సంచలనమే.

భాషా సంస్కరణల పితామహుడు..

వ్యావహారిక భాష ఉద్యమం – తెలుగు పుస్తకాలను, పాఠ్యాంశాలను సులభమైన వ్యావహారిక శైలిలో రాయాలని ఆయన కృషి. “భాషా గిడుగు”.. అనే బిరుదు  ఆయన చేసిన సంస్కరణల వల్లే ఆయనకు ఈ బిరుదు లభించింది.

అండమాన్‌లో ఆంధ్రులు – అక్కడి తెలుగు ఖైదీలతో మాట్లాడుతూ వారి జీవన శైలిని, భాషను ఆయన పరిశీలించి రచనలు చేశారు.

లాంబాడీల (బంజారా జనజాతి) భాష, సాహిత్యం పై పరిశోధనలు చేసి, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా గిరిజనుల గొంతుకను వినిపించారు.

ఆయన కృషి తెలుగు భాషకు తెచ్చిన మార్పు..

గ్రంథిక vs వ్యావహారిక అనే విభేదాన్ని తొలగించి, తెలుగు సాహిత్యాన్ని ప్రజలకు దగ్గర చేశారు. విద్యార్థులు తమ మాతృభాషలోనే చదువుకోవాలనే హక్కు ఆయన కృషి వల్ల సాధ్యమైంది. ఆ తరువాతి తరాల రచయితలు, కవులు, పండితులు ఆయన మార్గదర్శకత్వంలో సరళమైన తెలుగులో రచనలు చేశారు.

తెలుగు భాష గొప్పదనం..

తెలుగు భాష అతి పురాతనమైనది.  దీనికి  2,000 సంవత్సరాలకు పైగా చరత్ర ఉంది. మృదు, మధురమైన ఉచ్ఛారణ తెలుగు భాష సొంతం.

వందలాది కవులు, పండితులు, తాత్వికులు ఈ భాషను కీర్తి గగనంలో నిలిపారు. నేటి వరకు 8 కోట్లకుపైగా ప్రజలు ఈ భాషను తమ మాతృభాషగా మాట్లాడుతున్నారు.

తెలుగు భాష అందాలు కేవలం సాహిత్యంలోనే కాక, నిత్యజీవనంలో, సంస్కృతిలో, సాంప్రదాయాలలో ప్రతిఫలిస్తాయి.

గిడుగు పంతులు నేర్పినదిదే..

గిడుగు పంతులు గారు మనకు నేర్పింది ఒకే ఒక్క విషయం .. భాష అంటే ప్రజల గొంతుక. అది అందరికీ అర్థమయ్యేలా, అందరికీ అందుబాటులో ఉండాలి. తెలుగు కేవలం పుస్తకాల భాష కాదు, అది మన ఊపిరి, మన అనుభూతి, మన గౌరవం.

తెలుగు భాషకు ఓ గుర్తింపు తెచ్చి,  ఈనాడు అందరూ ఇంత సరళమైన తెలుగు భాషలో చదువుతూ, రాస్తూ అభివృద్ది వైపు నడుస్తున్నారంటే అది గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారి కృషి వల్లే.. అందుకే ఆయన్ను స్మరించుకోవాలి.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.