Top Stories

dummy

political-news-img

ఎస్పీ కార్యాలయంలో బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే.. పది గంటల హైడ్రామా

పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో ఏకంగా పది గంటల పాటు బైఠాయించి సంచలనం సృష్టించారు. పల్పాడు జిల్లా జిల్లా పోలీసు లీగల్ సలహాదారుగా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని వెంటనే నియమించాలంటూ ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి ఏకంగా పది గంటల పాటు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై తెలుగుదేశం అధిష్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయమేంటంటే.. పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం (మార్చి 31) ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు. ఆయన జరిపి ఉత్తర్వులిస్తానని చెప్పారు. అయితే ఎమ్మెల్యే చదలవాడ మాత్రం నియామక పత్రం చేతికిచ్చే వరకు కదిలేది లేదని ఎస్పీ ఛాంబర్‌లోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో ఆయన తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎస్పీ చాంబర్ లోనే కూర్చున్న ఎమ్మెల్యే ఒక దశలో ఆ చాంబర్ లోని బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లో మాట్లాడినా ఆయన బయటకు రాలేదు. దీంతో పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర తెలుగుదేశం నేతలు వచ్చి బుధవారం (ఏప్రిల్ 1) సాయంత్రంలోగా నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శాంతించారు. రాత్రి తొమ్మదిన్నర గంటల ప్రాంతంలో ఆయన తన నిరసర విరమించారు.

Publish Date: Apr 1, 2026 10:03AM

political-news-img

కూపర్ కనోలీ హీరోచిత పోరాటం.. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం (మార్చి 31) రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే తమ విజయాల ఖాతా తెరిచింది. పంజాబ్ విజయంలో యువ బ్యాటర్ కూపర్ కనోలీ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించి జట్టును గెలిపించాడు. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 39పరుగులు, జోస్ బట్లర్ 38 పరుగులతో ఓ మోస్తరుగా రాణించినా, పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో వారిని కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఒక దశలో సునాయాసంగా గెలిచేస్తుందనిపించినా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 37 పరుగులు చేసి ఒటైన తరువాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకానొక దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే యువ ఆటగాడు కూపర్ కనోలీ 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 72 నాటౌట్ తో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కీలక సమయంలో జేవియర్ బార్ట్‌లెట్ 5 బంతుల్లో 11 నాటౌట్ మెరుపులు మెరిపించడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. కనోలీ కేవలం 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీసినప్పటికీ, కనోలీ ఇన్నింగ్స్ ముందు అది వృధా అయింది.

Publish Date: Apr 1, 2026 7:36AM

political-news-img

కన్నబిడ్డలను కడతేర్చి.. తల్లి ఆత్మహత్య.. హైదరాబా కూకట్‌పల్లిలో దారుణం

కట్టుకున్న భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న మనస్తాపంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన కూకట్ పల్లి కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తన భర్త ప్రవీణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆవేదనతో 28 ఏళ్ల స్రవంతి తన కుమారులు కార్తిక్ , కౌశిక్ లను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణం స్రవంతి భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని గత కొంత కాలంగా తనను వేధిస్తుండటమేనని స్థానికుల ద్వారా తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదలా ఉండగా స్రవంతి తన కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో వీరి స్వగ్రామమైన వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలియగానే తాండాలో ఉన్న భర్త ప్రవీణ్ ఇంటిని స్రవంతి బంధువులు దగ్ధం చేశారు. స్రవంతిని వివాహం చేసుకున్న ప్రవీణ్ హైదరాబాద్ లో కాపురం పెట్టాడనీ, అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని స్రవంతిని నిత్యవ వేధించేవాడనీ బంధువులు తెలిపారు. భర్త వేధింపులు భరించలేక స్రవంతి పుట్టింటికి వచ్చేసిందనీ, అయితే ప్రవీణ్ ఇక నుంచీ స్రవంతి ని బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చి ఆమెను కాపురానికి తీసుకెళ్లాడనీ బంధువులు తెలిపారు. అలా వెళ్లిన స్రవంతి తన పిల్లలతో సహా ఇంట్లో విగతజీవిగా పడి ఉందనీ, ప్రవీణే భార్య పిల్లలను హత్య చేశాడని స్రవింతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగా స్రవంతి సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో స్రవంతి భర్త తనను, పిల్లలన హత్య చాకుతో పొడిచి లేదా ఉరేసి చంపేస్తానంటూ బెదరిస్తున్నాడని సోదరుడికి చెప్పుకుంటూ ఈ వీడియో ఆవేదన వ్యక్తం చేసింది.

Publish Date: Mar 31, 2026 7:31PM

political-news-img

తెలంగాణలో చికెన్ షాపులు బంద్

తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. బుధవారం (ఏప్రిల్ 1) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు చికెన్ షాపుల యజమానుల సంఘం సమ్మెకు రెడీ అయ్యింది. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చికెన్ షాపుల యజమానుల సంఘం ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో, చికెన్ షాపుల ముందు ఈ బంద్‌కు సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వ్యాపారులు ఈ మేరకు నోటీసులు, బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభాన్ని భారీగా తగ్గించేశాయన్నది చికెన్ దుకాణాల యజమానుల ప్రధాన ఆరోపణ. చికెన్ అమ్మగా వచ్చే లాభం కనీసం షాపు అద్దెకు, కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదంటున్నారు. పౌల్ట్రీ కంపెనీలు ఇష్టానుసారంగా, ఏకపక్షంగారేట్లు నిర్ణయిస్తూ తమను నష్టాల్లోకి నెడుతున్నాయని చెబుతున్న చికెన్ షాపుల యజమానులు తమ డిమాండ్లు నెరవేరే వరకూ దుకాణాలను తెరిచే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. పౌల్ట్రీ కంపెనీలు దిగి వచ్చి తమ ప్రాఫిట్ మార్చిన్ పెంచాలని విస్పష్టంగా చెబుతున్నారు. కాగా చికెన్ షాపుల నిరవధిక బంద్ ప్రకటనతో చికెన్ ప్రియులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదర్చాలని కోరుతున్నారు.

Publish Date: Mar 31, 2026 7:11PM

political-news-img

ఉదయం పించన్ల పంపిణీ.. సాయంత్రం కోదండరామస్వామికి పట్టు వస్త్రాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నెల్లూరు, కడప జిల్లాల్లో బుధవారం (ఏప్రిల్ 1)పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు ఆయన సామాజిక పింఛన్ల పంపిణీ, ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవంలో సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత బుధవారం (ఏప్రిల్ 1) ఉదయం నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందిస్తారు. అనంతరం ఆయన నేరుగా కడప జిల్లా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా సీతారాముల వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని చేసి, లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం నాలుగు గంటల 25 నిముషాలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. ఆరున్నర గంటలకు గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. ఒక బుధవారం రాత్రి ఒంటిమిట్టలోనే బస చేస్తారు.

Publish Date: Mar 31, 2026 6:56PM

political-news-img

మెరుగైన ప్రజారోగ్యం కోసం.. స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్ మెంట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ప్రతి నెలా 4వ శనివారం పాపులేషన్ మేనేజ్ మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కుప్పం, నారావారి పల్లెలలో నిర్వహించి అది సక్సెస్ కావడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం (మార్చి 31) సమీక్ష నిర్వహించారు. జులై నాటికల్లా సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలన్న లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూన్సిట్ అవసరం కానున్నాయని, రూ.162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇక వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గేలా సేవలు అందించాలనీ, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలనీ సీఎం చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఏమేరకు మెరుగయ్యిందో పరిశీలించాలని సూచించారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని అనే ఈ 5 పిల్లర్లతో త్వరలో ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీని త్వరలో అమలు చేయాలన్న అంశంపై కూడా ఈ సందర్భంగా సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు.

Publish Date: Mar 31, 2026 5:43PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img