జగన్ గ(క)డపలో టీడీపీ పాగా..?

Publish Date:Jul 25, 2016

Advertisement

కడప..ఈ పేరు చెబితే మొదటగా గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.  ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా వైఎస్‌దే హవా. తన రాజకీయ చతురతతో కాంగ్రెస్‌కు తప్ప మరోపార్టీకి కడపలో స్థానం లేకుండా చేశారు వైఎస్. గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ వైఎస్, ఆయన కుటుంబసభ్యుల మాట వినవలసిందే. ఇక వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం హవా గురించి చెప్పవలసిన అవసరం లేదు. అధికారం అంటే ఎలా ఉంటుందో..అధికారం ఎలా అనుభవించాలో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేసి చూపించారు. జిల్లాకు పవర్ సెంటర్‌లా మారి దాదాపు ప్రతిపక్షాన్ని అణచివేశారు వైఎస్. అలా కడప జిల్లా అంటే కాంగ్రెస్‌కు కంచుకోట అన్నట్లుగా తీర్చిదిద్దారు. అయితే ఆయన అకాల మరణంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

 

కాంగ్రెస్ అధిష్టానం తనను అవమానిస్తోందన్న ఆగ్రహంతో వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి హస్తానికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవ్యాంధ్రలో తెలుగుదేశానికి వైసీపీ ధీటైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా కడపలో ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలవలేకపోయింది. ఆది నుంచి పట్టున్న జిల్లా కావడం..పైగా సొంత జిల్లా కావడంతో వైసీపీ అధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 10 శాసనసభ స్థానాల్లో తొమ్మిదింటిని గెలుచుకుని జగన్ తన ఆధిక్యత చాటారు. అయితే కడపను కంచుకోటగా చేసుకున్న వైసీపీ సామ్రాజ్యంపై తెలుగుదేశం జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ తాజాగా స్థానిక సంస్థల ప్రతినిధులపై దృష్టిసారించింది.

 

ఇప్పటికే కడప, ప్రొద్దుటూరులో వైసీపీ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు సైకిలెక్కారు. ఇక మండల, జిల్లా పరిషత్‌లపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు కూడా జరగనుండటంతో మరిన్ని సమీకరణలు చేపట్టనున్నట్లు సమాచారం. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరడంతో అక్కడ స్థానిక బలం పెరిగింది. బద్వేల్‌లో ఇలాంటి పరిస్థితులపై దృష్టి సారించనున్నారు. మున్సిపాలిటీల్లో సంఖ్యాబలం పెంచుకుంటున్న టీడీపీ కొన్ని చోట్ల ఆ పీఠాలను చేజిక్కించుకునే అవకాశాల కోసం అన్వేషిస్తోంది. ఇందుకు తోడు కొందరు ముఖ్యనేతలు, సీనియర్లుగా ఉన్నవారు టీడీపీ వైపు మొగ్గుచూపుతుండటంతో ఆ పరిస్థితులు తెలుగుదేశానికి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి చేరిక ఖరారైతే వార్డు స్థాయి నుంచి పార్టీకి మరికొంత  బలం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దగ్గరుండి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

 

లోకేష్ కృషి ఫలితంగానే కడప నగరంలో వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. ఈ నెల 29న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు జిల్లాకు రానుండటంతో సమీకరణాలు మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే తాతల నుంచి వస్తోన్న ఆధిపత్యాన్ని వేరొకరికి ఇవ్వడానికి ఒప్పుకోని జగన్ "ఇజ్జత్ కా సవాల్" అన్న చందంగా సర్వశక్తులు ఒడ్డి టీడీపీపై ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేత వరకు సైకిల్‌ వైపు చూస్తోన్న తరుణంలో జగన్ మాటలు ఎవరూ వినే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమీకరణాలన్నింటి బట్టి కడప గడపలో టీడీపీ పాగా ఖాయంగా కనిపిస్తోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.