పూర్వ వైభవం దిశగా తెలంగాణ తెలుగుదేశం!

Publish Date:Jun 14, 2025

Advertisement

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ  తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు.  తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొంత వెనుకబడింది.  ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో మాత్రం ఉనికి మాత్రంగానే మిగిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తున్నది. తెలంగాణలో కూడా పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. 
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉందేమో కానీ కార్యకర్తల బలం మాత్రం దండిగా ఉంది. ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావనం, ఆ పార్టీపై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. అంతేందుకు అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలన్న ప్రయత్నిం చేసింది. 
ఇందుకు కారణం ఎవరు ఔనన్నా కాదన్నా  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండటమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో   ఉన్నారు. ఈ సంగతి పలు సందర్భాలలో సందేహాతీతంగా రుజువైంది. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం  ఒకింత ఇన్ యాక్టివ్ అయిన మాట వాస్తవమే.. కానీ ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో ఇప్పటికీ బలంగానే ఉన్నాయి.   పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ తెలంగాణ జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది.  2023   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టడమే ఇందుకు నిదర్శనం. 

2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అత్యద్భుత విజయం తరువాత.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.  తెలంగాణలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు.  పార్టీ క్యాడర్ ఎంత బలంగా ఉన్నా.. వారిని ముందుండి నడిపించే లీడర్ కూడా అవసరమే. తెలంగాణలో ఆ నాయకత్వ కొరతే తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్యగా ఇంత వరకూ ఉంది.  ఇప్పుడు ఆ సమస్యను తీర్చడంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.అందుకే గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారిని పార్టీలోకి ఆకర్షించే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయం, తదననంతర పరిణామాలతో ఆ పార్టీ బలహీనం కావడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ బలపడటానికి తెలంగాణ తెలుగుదేశం నేతలు అప్పట్లో ఆ పార్టీ గూటికి చేరడం కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. అయితే  2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి, 2024 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం ఘనవిజయంతో తెలంగాణలో తెలుగుదేశంను వీడిన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు.   ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో తెలంగాణ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఆలా హోం కమింగ్ అంటూ తెలంగాణలో తెలుగుదేశం గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్న నేతలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ఉన్నారు.  నిజానికి రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో ఇమడలేక ఉక్కపోతకు గురౌతున్న పలువురు ఇప్పుడు తెలుగుదేశం వైపే చూస్తున్నారు.  ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. 
తాజాగా గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న  కేంద్ర మాజీ మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. శనివారం (జూన్ 14) జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో వారి మధ్య జరిగిన చర్చ ఏమిటన్నది అలా ఉంచితే.. ఈ భేటీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయనడానికి తార్కానంగా నిలిచింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఓటమి తరువాత ఆయన ఫామ్ హౌస్ విడిచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అన్నిటికీ మించి కాళేశ్వరం ప్రాజెక్టు  విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన చిక్కులను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సైతం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణు ఎదుర్కొంటున్నారు. ఇక కేఃసీఆర్ కుమార్తె కవిత తీరు.. ఇలా ఏ విధంగా చూసినా ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది.  అలాగే రాష్ట్రంలో  అధికారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అంతర్గత విభేదాలతో ఇబ్బందులు పడుతోంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో ప్రజా ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటోంది.   సరిగ్గా ఈ పరిస్థితుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో ఉన్న పలువురు మాజీ తెలుగుదేశం నేతల అడుగులు హోంకమింగ్ అంటూ తెలుగుదేశం దిశగా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది.నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది.
చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు.
ఎట్టకేలకు వల్లభనేని వంశీకి బెయిల్ దొరికింది ...140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది ...అయితే ఇప్పుడే వంశీని జైలు జీవితం విడిపోతుందా! లేక ఇంకేమైనా ఈ కథలో టెస్టులు ఉంటాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి
శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వైసీపీ అధినేత జగన్ రెడ్డి జైలు యాత్ర చేపట్టనున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు.
కర్నూల్ -విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు
పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి.
CM Chandrababu, Kuppam, Handreeniva, Srisailam, Kuppam Airport, YCP, CM Chandrababu, Naralokesh, TDP, Srisailam,
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. అరవింద్‌కు నోటీసులివ్వడం ఇది నాలుగోసారి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.