ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన రాజీనామాను పలు నిరాధార ఆరోపణలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ పూర్తిగా అబద్ధమని, తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తన సేవా కాలాన్ని అత్యంత సంతృప్తికరమైన ప్రయాణంగా పేర్కొంటూ… ఈ రాష్ట్రాన్ని సొంత ఊరిగా భావించానని, ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, మరియు తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మద్దతుతోనే తాను ఈ స్థితికి చేరినట్టు పేర్కొన్నారు.ముందుకు సాగుతున్న తాను, సమాజానికి కొత్త రీతుల్లో సేవ చేయాలని, కృతజ్ఞత, స్పష్టత, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని తన సంకల్పాన్ని తెలియజేశారు. సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు టాక్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ips-siddharth-kaushal-39-201104.html
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పాలన కేంద్రం ఆత్మకూరులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు.
హైదరాబాద్ లక్డీకాపూల్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్నిఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్వస్థతకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో గురువారం (జులై3 ) చేరిన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే స్థానికుడి ప్రాణం పోయింది. ఆ వివాదం ముదిరింది. దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారీ.. మళ్లీ రాజుకుంటోంది.
లక్ష క్రాస్ అయినట్టు కనిపించిన బంగారం ధరలు అనూహ్యంగా యాభై నుంచి డెబ్బై వేలకు పడిపోనున్నాయా? అన్నది డిబేట్ గా మారిందిప్పుడు. కొన్ని సంస్థలు కూడా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టే ఛాన్సుందని చెబుతున్నాయి.
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైరసీకి మాత్రం ఒక్కటంటే ఒక్క ఉపాయం కూడా కనుగొనలేక పోవడం విచారకరం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే ప్రస్తుతం టాలీవుడ్ జనాలను వేధిస్తోన్న ప్రశ్న.
జపాన్ మాంగా కళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జపాన్ కి భారీ సునామీ రానుందని చెప్పడంతో.. ఎందరో తమ జపాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్కసారిగా జపాన్ టూరిజం పడకేసింది.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో కేసీఆర్ బాధపడుతున్నారు
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా? అంటే.. విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టుగా హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ శతాబ్దానికే ఇది జోక్ కావచ్చు. ఈ భూమ్యాకాశాల మధ్య కేసీఆర్ కి తెలియని రాజనీతి లేదు. రెడ్డి, కమ్మగా విడిపోయి కొట్టుకు ఛస్తున్న ఉమ్మడి ఆంధ్ర రాజకీయాల్లో వెలమల పాత్రను తిరిగి తీసుకురావడంలో అపర చాణక్యుడన్న పేరు సాధించారాయన. అంతేనా కేసీఆర్ అన్నీ తెలిసే కావాలనే చేశారని అంటారు. అలాగని కులాభిమానం అయినా ఉందా? అంటే అదీ లేదని చెబుతారు.
తిరుమల కొండపై ఏనుగులు హల్ చల్ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోనే ఏనుగుల గుంపు తిష్టవేసి ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి.