తెలంగాణ అన్ స్టాపబుల్ మాత్రమే కాదు..అన్ బీటబుల్!

Publish Date:Dec 9, 2025

Advertisement

భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన   తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో  భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. వచ్చే పాతికేళ్లలో తెలంగాణను  దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రం గా తెలంగాణ అన్న లక్ష్యంతో కృషి చేయాలన్న ఆశయం మహోత్కృష్టమైనదన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో    భాగంగా మంగళవారం (డిసెంబర్ 9) విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో   ప్రసంగించిన దువ్వూరి సుబ్బారావు.. తను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో   ఆర్థిక కార్యదర్శిగా,  ఖమ్మం కలెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.   ఇప్పుడు తాను హైదరాబాద్ వాడిననీ, తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు.  

తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటబుల్  అంటున్నానని చెప్పారు.   చైనాలోని గ్వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా తెలంగాణ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.  2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధించడానికి,   ఏటా 8 నుంచి 9 శాతం వృద్ధి సాధించాలన్న దువ్వూరి సుబ్బారావు, ఇది నిజంగా ఒక చాలెంజ్, కొంచం కష్ట సాధ్యమే అయినప్పటికీ ఇంతటి గొప్ప లక్ష్యం పెట్టుకున్న సీఎం రేవంత్ ను అభినందిస్తున్నాన్నారు. హైదరాబాద్ ను అద్భుత నగరంగా అభివర్ణించిన దువ్వూరి సుబ్బారావు,  ఒకప్పుడు తెలంగాణ పేదరికంతో వెనుకబడి ఉండేది కానీ,  ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. రెండు దశాబ్దాల కిందట  ప్రజలందరూ బెంగళూరుకు వెళ్లేవారు, ప్పుడు అందరూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారనీ, దీన్ని బట్టే  తెలంగాణ గొప్పతనం ఏంటో అఅర్ధం చేసుకోవచ్చని దువ్వూరి అన్నారు.  

తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, నీతి ఆయోగ్ సంస్థలకు చెందిన మేధావులతో రూపొందించడం అభినందనీయమన్న ఆయన  సలహా మండలి సభ్యుడిగా ఈ డాక్యుమెంట్ అమ లుకు తన వంతు కృషి చేస్తానన్నారు.  హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, జీసీసీల్లో అభివృద్ధి సాధించిందనీ,  ఇప్పుడిక తయారీ రంగం, వ్యవసాయ రంగం, ఇతర ఉపాధి రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.    

By
en-us Political News

  
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టునూ ఆశ్రయించారు. రెండు చోట్లా వారికి చుక్కెదురైంది. సుప్రీం కోర్టు వారి ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేస్తూ రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
వెంకన్న దేవుడి సొమ్ము స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి సొమ్ము ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు.
ఇంతకీ మెస్సీ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే? గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లెస్సీ భారత్ లోని నాలుగు ప్రధాన నగరాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. ఇంతకీ గోట్ అంటే ఏమిటి అంటారా గోట్ అంటే గ్రేటెస్ట్ ప్లేయర్ ఆప్ ఆల్ టైమ్.
పాపులర్ ఫ్రాంచైజీలు.. చేతులు మారనున్నాయ్. అసలు.. ఐపీఎల్ స్వరూపమే మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. జరుగుతున్న పరిణామాలు, కనిపిస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయ్.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, 2014 ఎన్నికలకు ముందు ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్య కేసు విచారణ అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది.
మెస్సీతో మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకోవడానికి, రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ లో గూగూల్ ఫర్ స్టార్టప్ హబ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలను ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సహకాలను వినియోగించుకుని స్టార్టప్ లు భవిష్యత్ లో గూగుల్ వంటి సంస్థలుగా విస్తరించాలని పిలుపునిచ్చారు.
మావోయిస్టుల పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ మన్యంలో సంచలనం రేపాయి. మావోయిస్టుల సంచారం పెద్దగా కనిపించని అల్లూరి మన్యంలో ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ మావోయిస్టులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పాలన ఉండాలని నిర్దేశించారు. ఆన్ లైన్ సేవలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చాలన్నారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దుతో ఎనిమిది రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలంటూ సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌, సీవోవోలకు డీజేసీఏ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో ఒక్క పవర్ సెక్టార్‌లోనే 3 లక్షల 24 వేల 698 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారంటూ ఆ బ్యాంక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఏసీపీ మునావర్‌పై అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో జోక్యం, కొన్ని కేసుల్లో అనచితంగా వ్యవహరించారన్న పలు ఫిర్యాదులు అందడంతో సిపి సజ్జనార్ పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.