ఉప్పల్ స్టేడియంలో రేవంత్ వర్సెస్ మెస్సీ.. ఎప్పుడంటే?

Publish Date:Dec 10, 2025

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెల 13న స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. “తెలంగాణ రైజింగ్ - 2047” విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే వ్యూహంతో తానే స్వయంగా గ్రౌండ్‌లోకి దిగుతున్నట్లు తెలిపారు. 

తెలంగాణలో స్పోర్ట్స్ స్పిరిట్‌ను నలుమూలలా చాటి చెప్పడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. స్వయంగా ఫుట్‌బాల్ ఆటగాడైన రేవంత్..  తన బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా సమయం చిక్కినప్పుడల్లా ఫుట్ బాల్ మైదానంలో   పరుగులు తీస్తూ, గోల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే, మే 12న హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి సీఎం ఫుట్‌బాల్ ఆడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆట మధ్యలో షూ పాడైపోయినప్పటికీ, ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.. షూ లేకుండానే తన ఆటను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ విద్యార్థులు పాల్గొన్నారు. 

ఇక ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన ఇండియా పర్యటనలో భాగంగా భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు సీఎం సన్నద్ధమౌతున్నారు.  

రోజంతా అధికారిక కార్యక్రమాలతో అలసిపోయినా, కూడా విశ్రాంతి అన్న మాటే మదిలోకి రానీయకుండా  ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి సీఎం  ఆదివారం రాత్రి గ్రౌండ్‌లోకి దిగారు. యువతతో కలిసి ఆయన ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు.   దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో   వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా బలోపేతం చేసేందుకు, ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెస్సీతో మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకోవడానికి, రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని భావిస్తున్నారు.

గోట్ టూర్​లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్‌కు వస్తున్న మెస్సీ టీంతో రేవంత్‌రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్‌లో తలపడనున్నారు. 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే  ఈ ఫ్రెండ్లీ ఫ్లెండ్లీ మ్యాచ్ లో  రేవంత్‌.. 9వ నెంబర్‌ జెర్సీని.. మెస్సీ.. 10వ నెంబర్‌ జెర్సీ ధరించి గ్రౌండ్‌లోకి దిగుతారు. ఒక ముఖ్యమంత్రి.. ప్రముఖ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గ్రౌండ్‌లో తలపడనుండటం క్రేజ్‌తోపాటు ఆసక్తిని రేపుతోంది.

By
en-us Political News

  
వెంకన్న దేవుడి సొమ్ము స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి సొమ్ము ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు.
ఇంతకీ మెస్సీ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే? గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లెస్సీ భారత్ లోని నాలుగు ప్రధాన నగరాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. ఇంతకీ గోట్ అంటే ఏమిటి అంటారా గోట్ అంటే గ్రేటెస్ట్ ప్లేయర్ ఆప్ ఆల్ టైమ్.
పాపులర్ ఫ్రాంచైజీలు.. చేతులు మారనున్నాయ్. అసలు.. ఐపీఎల్ స్వరూపమే మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. జరుగుతున్న పరిణామాలు, కనిపిస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయ్.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, 2014 ఎన్నికలకు ముందు ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్య కేసు విచారణ అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది.
హైదరాబాద్ లో గూగూల్ ఫర్ స్టార్టప్ హబ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా స్టార్టప్ లకు భారీ ప్రోత్సహకాలను ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సహకాలను వినియోగించుకుని స్టార్టప్ లు భవిష్యత్ లో గూగుల్ వంటి సంస్థలుగా విస్తరించాలని పిలుపునిచ్చారు.
మావోయిస్టుల పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ మన్యంలో సంచలనం రేపాయి. మావోయిస్టుల సంచారం పెద్దగా కనిపించని అల్లూరి మన్యంలో ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ మావోయిస్టులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పాలన ఉండాలని నిర్దేశించారు. ఆన్ లైన్ సేవలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చాలన్నారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దుతో ఎనిమిది రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలంటూ సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌, సీవోవోలకు డీజేసీఏ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో ఒక్క పవర్ సెక్టార్‌లోనే 3 లక్షల 24 వేల 698 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారంటూ ఆ బ్యాంక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఏసీపీ మునావర్‌పై అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో జోక్యం, కొన్ని కేసుల్లో అనచితంగా వ్యవహరించారన్న పలు ఫిర్యాదులు అందడంతో సిపి సజ్జనార్ పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను తెలంగాణ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటబుల్ అంటున్నానని చెప్పారు. చైనాలోని గ్వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా తెలంగాణ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.
ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు గూగుల్ ఉత్పత్తులను వినియోగిస్తున్న నేపథ్యంలో, ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ క్యాపిటల్ హోదాను బలోపేతం చేయనున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.