తెలంగాణా జేయేసీ తన ఉనికి కాపాడుకోగలదా?

Publish Date:Nov 9, 2014

Advertisement

 

ఒకానొక సమయంలో తెలంగాణా ఉద్యమాలలో చాలా చురుకుగా పాల్గొని, కీలక పాత్ర పోషించిన తెలంగాణా జేయేసీ, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొంటానని ప్రకటించింది. తెరాసతో కలిసి పనిచేసినప్పటికీ తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే గట్టిగా నిలదీస్తానని కూడా చెప్పింది. కానీ ఈ ఐదు నెలల కాలంలో తెరాస ప్రభుత్వం చాలా బలపడి, ప్రతిపక్షాలను, ఆంధ్ర, కేంద్రప్రభుత్వాలని కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుండటంతో క్రమంగా టీ- జేయేసీ తన ఉనికిని కోల్పోసాగింది. నిజానికి టీ- జేయేసీని కేవలం తెలంగాణా సాధన కోసమే ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్రం ఏర్పడగానే పూర్తిగా రద్దు చేసి ఉండి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. కానీ చేయలేదు. అటువంటప్పుడు నీళ్ళు, విద్యుత్ తదితర అంశాలపై తెలంగాణా ప్రభుత్వం పొరుగు రాష్ట్రంతో చేస్తున్న యుద్దాలు, రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్సుమెంటు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి అనేక సమస్యలపై మాట్లాడి ఉండాలి. కానీ నోరు మెదపకుండా మౌనం వహించింది. చివరికి తెలంగాణా ప్రభుత్వం కేవలం 453 మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించినపుడు, టీ- జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తన వద్ద అమరవీరుల జాబితా ఉందని దానిని ప్రభుత్వానికి అందజేస్తానని అన్నారు. ఆయన ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లయితే, ప్రభుత్వం కేవలం తను గుర్తించి అమరవీరుల కుటుంబాలకు మాత్రమే పరిహారం మంజూరు చేస్తున్నప్పుడయినా మిగిలిన వారి కుటుంబాలకు కూడా తప్పనిసరిగా పరిహారం ఇచ్చితీరాలని టీ- జేయేసీ ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోయింది ఎందుకో. ఇక రాష్ట్ర పునర్ణిర్మాణంలో పాల్గోవడం సరేసరి.

 

బహుశః ఆవిధంగా చేసినట్లయితే సమాంతర ప్రభుత్వం నడుపుతున్నామనే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే భయమో లేకపోతే కేంద్రప్రభుత్వంతోనే యుద్ధం చేయడానికి వెనకాడని కేసీఆర్ తో పెట్టుకొంటే తట్టుకోలేమనే భయమో లేకపోతే కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాలనే ఆలోచనతోనో తెలియదు కానీ టీ- జేయేసీ ఇంతవరకు మౌనం వహించి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. అందువల్లే ప్రజలు కూడా దానిని పట్టించుకోవడం మానివేశారు.

 

ఈ పరిస్థితుల్లో మళ్ళీ చాలా రోజుల తరువాత ఈ రోజు టీ-జేయేసీ స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో పైన పేర్కొన్న అన్ని సమస్యలపై చర్చిస్తారని సమాచారం. అందువలన ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందని భావించవచ్చును. ఒకవేళ ఇక నుండి తాము కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీయాలని టీ-జేయేసీ నిర్ణయించుకొంటే, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే టీ-జేయేసీ ప్రభుత్వానికి అండగా నిలబడి దానిని వెనకేసుకొని వస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినట్లయితే, ఇప్పటికే క్రమంగా తన ఉనికిని కోల్పోపోతున్న టీ-జేయేసీ పూర్తిగా తన ఉనికిని పోగొట్టుకొంటుంది.

 

అందువలన ఈ సమావేశంలో టీ-జేయేసీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే దానిపైనే దాని భవితవ్యం ఆధారపడి ఉంటుందని భావించవచ్చును. అయితే కేసీఆర్ తో కత్తులు దూసి ఇబ్బందులు పడటంకంటే, మౌనం వహించడమే మేలని భావించినట్లయితే, తెలంగాణా ప్రభుత్వానికి శ్రేయోభిలాషిగా ఏవో కొన్ని సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.