తెలంగాణా పోలీస్ వాహనాల కొనుగోలులో కుంభకోణం?

Publish Date:Jun 28, 2015

Advertisement

 

కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన తరువాత చిన్న పిల్లలకు బొమ్మకార్లు కొనిపెట్టినట్లుగా హైదరాబాద్ లో పోలీసులకు కొన్ని వందల ఇన్నోవా కార్లు, హీరో మోటార్ సైకిల్స్ కొనిపెట్టేయడంతో పోలీసులే కాదు ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. కమీషన్లకి కక్కుర్తిపడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు మళ్ళీ ఇన్నాళ్ళకి మెరుపువేగంతో పనిచేసే ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. ఇంతకు ముందు డొక్కుజీపులు వేసుకొని తిరిగే పోలీసులు ఇప్పుడు ఇన్నోవా కార్లలో వస్తుంటే మన పోలీసులకి కూడా ఇప్పుడు “ఫారిన్ కంట్రీ పోలీస్ లుక్” వచ్చేసిందని ప్రజలు చాలా సంబరపడ్డారు. కానీ ఒక ప్రముఖ జాతీయ ఛానల్ ఈ వాహనాల కొనుగోలు వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని శనివారం బయటపెట్టింది.

 

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్ నాయుడుకి టయోటా కార్ల డీలర్ షిప్, అదేవిధంగా కేసీఆర్ కుమారుడు కే.టి.ఆర్. కి హీరో హోండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందని వారిరువురికి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణా ప్రభుత్వం ఎటువంటి టెండర్లు పిలవకుండా రూ.271 కోట్లు వ్యయం చేసి ఒకేసారి 3,883 ఇన్నోవా కార్లు, 2000 హీరో హోండా మోటార్ సైకిల్స్ కొందని సదరు న్యూస్ ఛానల్ బయటపెట్టింది. వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్ నాయుడికి టయోటా కార్ల డీలర్ షిప్ ఉన్న మాట వాస్తవమే. కానీ మంత్రి కే.టి.ఆర్. తనకు హీరో హోండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందన్న వార్తలను, దానికి తమ ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్న సదరు న్యూస్ ఛానల్ చేసిన ఆరోపణలను ఖండించారు. అది పూర్తి నిరాధారమయిన ఆరోపణలని ఆయన అన్నారు.

 

ఇక ఈ విషయంపై తెలంగాణా డి.జి.పి. అనురాగ్ శర్మ స్పందిస్తూ, “నిజానికి తెలంగాణా ప్రభుత్వం కార్లు, మోటార్ సైకిల్స్ అన్నిటికి కలిపి కేవలం రూ. 206 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. భారత ప్రభుత్వం ఇచ్చిన డి.జి. మరియు డి. రేట్ కాంట్రాక్ట్ మార్గదర్శకాలు, నిర్ణయించిన ధరల ప్రకారం ఆ వాహనాలను నేరుగా ఉత్పత్తిదారుల నుండి కొన్నిటిని, మరి కొన్నిటిని వారి అధీకృత డీలర్స్ వద్ద నుండి తెలంగాణా ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్ణయించిన నిర్దిష్ట ధరల ప్రకారం ఆ వాహనాలను ఓపెన్ టెండర్ విధానంలో ఈ-ప్రోక్యూర్ మెంట్ పద్దతిలో కొనడం జరిగింది. కనుక టెండర్లు పిలవలేదనే ఆరోపణలు అవాస్తవం,” అని అన్నారు.

 

తెలంగాణా రాష్ట్ర ఐ.జి. సంజయ్ కుమార్ జైన్ మీడియాలో వస్తున్న ఈ ఆరోపణలపై స్పందిస్తూ, “తెలంగాణా ప్రభుత్వం 3,883 ఇన్నోవా కార్లు కొందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 696 ఇన్నోవా వాహనాలను మాత్రమే కొంది. అవి కాకుండా టాటా, మహేంద్ర తదితర కంపెనీలకు చెందిన మరికొన్ని వాహనాలను ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానంలో కొంది. ఇటువంటి అవాస్తవాలను ప్రసారం చేసినందుకు సదరు న్యూస్ ఛానల్ పై పోలీసు శాఖ పరువునష్టం దావా వేయాబోతోంది,” అని తెలిపారు.

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.