డిల్లీలో ముగిసిన తెలంగాణా దీక్షలు

Publish Date:May 1, 2013

Advertisement

 

పార్లమెంటు ముందు తెలంగాణా కాంగ్రెస్ యంపీలు, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన రెండు రోజుల దీక్షలు నేటితో ముగిసాయి. పార్లమెంటు మెట్ల మీద ఎంత పడిగాపులు గాసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తరపున ఏ ఒక్కరూ కూడా వచ్చికాంగ్రెస్ యంపీలను పరమార్శించడానికి రాలేదు. కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ అయినా వచ్చి తమతో మాట్లాడి సముదాయిస్తారని వారు ఆశించారు కానీ, ఆయన కూడా రాకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. తమ పట్ల అధిష్టానం ఇంత కటిన వైఖరి పాటిస్తుందని ఊహించకపోవడంతో తమ దీక్ష ముగిసేలోగా తప్పనిసరిగా అధిష్టానం తరపున తమతో మాట్లాడేందుకు ఎవరో ఒకరు వస్తారని ఆశగా ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది.

 

ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో పార్టీకి అండగా నిలబడవలసిన కాంగ్రెస్ యంపీలే ఈ విధంగా సమస్యలు సృష్టించడంతో వారిపట్ల కాంగ్రెస్ అధిష్టానం కటినంగా వ్యవహరింఛి ఉండవచ్చును. ఇటీవల వారు తెరాస అధినేత కేసీఆర్ తో రహస్య సమావేశాలవడం, వారిలో కొందరు పార్టీ మారుతారనే వార్తలు మొదలయిన అంశాలు కూడా పార్టీ అధిష్టానానికి వారిపట్ల వ్యతిరేఖత ఏర్పరచి ఉండవచ్చును. రేపు టికెట్స్ కేటాయింపు సమయంలో కూడా పార్టీ ఇదే ధోరణి అనుసరిస్తుందా లేక ఈ కోపం తాత్కాలికమేనా అనేది రానున్న కాలమే చెపుతుంది.

 

కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, బేనీ ప్రసాద్ వర్మ మాత్రం వారిని పలుకరించారు. సాటి తెలంగాణా మంత్రులయిన సర్వే సత్యనారాయణ మరియు బలరం నాయక్ లిరువురు తమను పరమార్శించలేదని తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రం నుండి కే.జానా రెడ్డి, అరెపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ బాబు, భిక్షమయ్య తదితరులు తెలంగాణా యమ్పీలకు సంఘీభావం ప్రకటించేందుకు నిన్న డిల్లీ తరలి వెళ్ళారు.

 

ఇక, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన దీక్ష మాత్రం విజయవంతం అయిందని చెప్పవచ్చును. తెలంగాణకు మద్దతు ఇచ్చే అన్ని జాతీయ పార్టీల నేతలు వచ్చి వారి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న యన్.సి.పీ నేతలు కూడా ఈ దీక్షలో ఉత్సాహంగా పాల్గోనడమే కాకుండా, తెలంగాణా జేయేసీలో సభ్యత్వం కూడా స్వీకరించడం జేయేసీ నేతలకి ఉత్సాహం కలిగించింది.

 

రాష్ట్రంలో బీజేపీతో పెట్టుకోబోమని తెరాస నిర్ద్వందంగా ప్రకటించినప్పటికీ, తెరాస ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ దీక్షకు సుష్మా స్వరాజ్ వంటి బీజేపీ నేతలు కూడా వచ్చి తమ మద్దతు తెలుపడం విశేషం. బహుశః రానున్న ఎన్నికలలో పొత్తులకు తాము సానుకూలమని తెలియజేసేందుకే వారు వచ్చి ఉండవచ్చును.

By
en-us Political News

  
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018 ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ధాఖలు చేసిన పరువునష్టం కేసు సుల్తాన్ పూర్ లోని ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.
రాజకీయాల్లో నానాటికీ తీసికట్టుగా మారుతున్న సంస్కారంపై డోలేంద్ర ప్రసాద్ గుర్రానికి, గాడిదకి తేడా ఏంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో గత జగన్ పాలనలో చోటుచేసుకున్న పరిణామాలు, భాషా ప్రయోగం, రాజకీయాలలో హుందాతనాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతలపై పలు సూచనలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.