డిల్లీలో ముగిసిన తెలంగాణా దీక్షలు

Publish Date:May 1, 2013

Advertisement

 

పార్లమెంటు ముందు తెలంగాణా కాంగ్రెస్ యంపీలు, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన రెండు రోజుల దీక్షలు నేటితో ముగిసాయి. పార్లమెంటు మెట్ల మీద ఎంత పడిగాపులు గాసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తరపున ఏ ఒక్కరూ కూడా వచ్చికాంగ్రెస్ యంపీలను పరమార్శించడానికి రాలేదు. కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ అయినా వచ్చి తమతో మాట్లాడి సముదాయిస్తారని వారు ఆశించారు కానీ, ఆయన కూడా రాకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. తమ పట్ల అధిష్టానం ఇంత కటిన వైఖరి పాటిస్తుందని ఊహించకపోవడంతో తమ దీక్ష ముగిసేలోగా తప్పనిసరిగా అధిష్టానం తరపున తమతో మాట్లాడేందుకు ఎవరో ఒకరు వస్తారని ఆశగా ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది.

 

ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో పార్టీకి అండగా నిలబడవలసిన కాంగ్రెస్ యంపీలే ఈ విధంగా సమస్యలు సృష్టించడంతో వారిపట్ల కాంగ్రెస్ అధిష్టానం కటినంగా వ్యవహరింఛి ఉండవచ్చును. ఇటీవల వారు తెరాస అధినేత కేసీఆర్ తో రహస్య సమావేశాలవడం, వారిలో కొందరు పార్టీ మారుతారనే వార్తలు మొదలయిన అంశాలు కూడా పార్టీ అధిష్టానానికి వారిపట్ల వ్యతిరేఖత ఏర్పరచి ఉండవచ్చును. రేపు టికెట్స్ కేటాయింపు సమయంలో కూడా పార్టీ ఇదే ధోరణి అనుసరిస్తుందా లేక ఈ కోపం తాత్కాలికమేనా అనేది రానున్న కాలమే చెపుతుంది.

 

కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, బేనీ ప్రసాద్ వర్మ మాత్రం వారిని పలుకరించారు. సాటి తెలంగాణా మంత్రులయిన సర్వే సత్యనారాయణ మరియు బలరం నాయక్ లిరువురు తమను పరమార్శించలేదని తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రం నుండి కే.జానా రెడ్డి, అరెపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ బాబు, భిక్షమయ్య తదితరులు తెలంగాణా యమ్పీలకు సంఘీభావం ప్రకటించేందుకు నిన్న డిల్లీ తరలి వెళ్ళారు.

 

ఇక, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన దీక్ష మాత్రం విజయవంతం అయిందని చెప్పవచ్చును. తెలంగాణకు మద్దతు ఇచ్చే అన్ని జాతీయ పార్టీల నేతలు వచ్చి వారి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న యన్.సి.పీ నేతలు కూడా ఈ దీక్షలో ఉత్సాహంగా పాల్గోనడమే కాకుండా, తెలంగాణా జేయేసీలో సభ్యత్వం కూడా స్వీకరించడం జేయేసీ నేతలకి ఉత్సాహం కలిగించింది.

 

రాష్ట్రంలో బీజేపీతో పెట్టుకోబోమని తెరాస నిర్ద్వందంగా ప్రకటించినప్పటికీ, తెరాస ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ దీక్షకు సుష్మా స్వరాజ్ వంటి బీజేపీ నేతలు కూడా వచ్చి తమ మద్దతు తెలుపడం విశేషం. బహుశః రానున్న ఎన్నికలలో పొత్తులకు తాము సానుకూలమని తెలియజేసేందుకే వారు వచ్చి ఉండవచ్చును.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.