కర్ణాటకలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం ఓట్లు రాలుస్తుందా

Publish Date:May 1, 2013

Advertisement

 

 

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు చార్జీల పెంపు, సర్ చార్జీల వడ్డింపుల నిర్ణయాలతో రాష్ట్రంలో ఎంత వ్యతిరేఖత మూటగట్టుకొన్నపటికీ, కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల తరపున ప్రచారం చేస్తూ ఆంధ్ర రాష్ట్రం ఆయన హయంలో అద్భుతాలు సృష్టిస్తోందని, అటువంటి ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.

 

బెంగళూరు పరిసర ప్రాంతాలలో తెలుగువారు అధికంగా ఉండే అనేకల్, జయనగర్, బసవగుడి తదితర ప్రాంతాలలోపర్యటించిన ఆయన అక్కడి తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “కర్ణాటకను దోచుకొన్నబీజేపే మంత్రులు ప్రస్తుతం ఆంద్ర రాష్ట్రం జైళ్లలో ఉన్నారని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు సుస్థిరమయిన, సమర్ధమయిన, స్వచ్చమయిన పాలన అందించగలదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రలో ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలు, రాష్ట్రం సాదించిన ప్రగతి ఇత్యాదుల గురించి ఘనంగా వర్ణించి, అటువంటి ప్రగతి కోరుకొంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

 

రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నపటికీ, ఇక్కడ అంత సుభిక్షం, సస్యశ్యామలం అన్నట్లు ఆయన చాటింపు వేసుకోవడం విశేషమే!మరి ఆయన మాటలను కర్ణాటకలో ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారో లేదో చూడాలి. ఆయనతో బాటు టీజీ. వెంకటేష్, పొంగులేటి సుధాకర్, గంగ భవాని, యమ.యల్.సి. రంగా రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.