తెలంగాణా కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి
Publish Date:Jul 26, 2012
Advertisement
కాంగ్రెస్ పార్టీ తెలంగాణా జిలల్లాల్లో ఇప్పటికే సమస్యల్లో పడిరది. దీనికి తోడు నామినేటెడ్ పదవల పంపకంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పడూ పార్టీ ఆఫీసుల్లో చూడని వారిని జండాలు మోయని వారిని నామినేటెడ్ పోస్టుల్లో వేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నాయకులకు బందువులుగా ఉన్నవారిని, డబ్బున్న వారినే నాయకులు సిఫార్సులు చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఇంకా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయకపోవడం పై వారు అసహనంగా ఉన్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్ధానాలు పొందింది. దీని వెనుక కార్యకర్తల కృషి ఎన్నతగినది. అయినా పదవులకు మాత్రం వారు దూరంగానే ఉండాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో పరాజయంపాలైన రేణుకా చౌదరి తన వారికి పదవుల పట్టం కట్టటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేకోవలో తెలంగాణలోని సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కకూడా ఉన్నారు. ఈ పరిణామంతో పార్టీకింది స్థాయినుంచి బలహీనపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెట్ కమిటి చైర్మన్, ఎపిఐడిసి, ఎపిఐఐసి, మైనింగ్ కార్పోరేషన్, సివిల్సప్లై కార్పొరేషన్, యస్ సి కార్పొరేషన్ లాంటి పదవులు, దేవాదాయ కమిటీ చైర్మన్లు, గ్రంధాలయ సంస్దల చైర్మన్లు కాళీగా ఉన్నాయి. నామినేటెడ్ పదవుల భర్త్తీ అయితేనే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నిండుతుందని రాష్ట్రనాయకులు ఆలోచిస్తుండగా, కార్యకర్తలు తమను కాకుండా జిల్లానాయకులు వారి బందువులనే నామినేట్ చేస్తున్నారని ఆరోపించడం కొసమెరుపు.
http://www.teluguone.com/news/content/telangana-congress-24-15983.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





