విజయమ్మ బైబిల్ పై రాద్ధాంతం అవసరమా ?
Publish Date:Jul 26, 2012
Advertisement
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మీ ఈ మద్య ఎక్కడికి వెళ్లినా బైబిలుతో వెళ్లటం చర్చనీయాంశమైంది. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఏ మతానైనా అనుసరించే వెసులుబాటు వుంది. అయినా ఈ దేశంలో పుట్టుకలో వచ్చే కులం మాత్రమే చచ్చే వరకు మారదు, కాని మతాలు మాత్రం మన ఇష్టం ఉన్నప్పుడు మారే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. మహాత్మాగాందీ ఎప్పుడూ గీతతో దర్శనమిచ్చేవారు. ఇప్పటికీ చాలామంది కాశీతాడునో లేదా సాయిబాబా తాడులనో చేతులకు కట్టుకుంటారు. లేదంటే ఆంజనేయ బిళ్లలు మెడలో వేసుకుంటారు. అది వాళ్ల మానసిక స్థితికి అద్దంపడుతుంది. అంతా మంచి జరుగుతుందని, లేదంటే భయపడకుండా వుండటానికి ఇలా చాలా కారణాలు ఉండవచ్చు. వైసిపి గౌరవాద్యక్షురాలు బైబులు పట్టుకొని కనపబడటం వెనుక కారణాలను చూద్దాం. ఆమె నిన్నటివరకు సాదా సీదా మహిళ కచ్చింతంగా చెప్పాలంటే ఎన్నడూ గుమ్మందాటి ఎరుగని మామూలు మహిళ. అనుకోని పరిస్థితుల్లో రాజకీయల్లోకి రావడం, ప్రచారం చేయాల్సిరావడం వెంటవెంటనే జరిగిపోయాయి. దాంతో పరిస్థితులను వెంటవెంటనే ఆకళింపు చేసుకొని సందర్బాను సారంగా అనుసరించే పద్దతులకు ఇంకా ఆమె అలవాటు పడలేకే ఆత్మ స్ధయిర్యం కోసం బైబిలును వెంటబెట్టుకుని తిరుగుతున్నారనిపిస్తుంది. దీని వెనుక ఆమె అత్తగారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి తల్లిగారైన జయమ్మగారి ప్రభావం కూడా ఉండి వుంటుంది.
ఆమె తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడటానికి ఏళ్ల తరబడి ప్రార్ధనలు చేసారని చెబుతారు. ఆఖరికి ఆమె తన కొడుకు ముఖ్యమంత్రి అయిన తరువాతే పరమపదించారు. అకాలమరణంతో భర్తని పోగొట్టుకోవడంతో పాటు కొడుకు జైలుపాలవ్వడంతో ఆమె బైబిల్లో ప్రశాంతత వెతుకుంటున్నారనే అనుకోవాలి. అనేక గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణలోని సిరిసిల్ల పర్యటన జరపవలసి వచ్చినప్పుడు కూడా అదే తోడుగా ధైర్యాన్ని పొందారనుకుందాం. మీడియాలోని కొన్ని వర్గాలు అమె బైబిల్ పై కూడా చర్చలు జరిపి, రాద్దాంతాలు చేయడం ఎంతవరకూ సమంజసమన్న విమర్శలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/-vijayamma-ysrcongress-24-15982.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





