ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది సత్యమే ..కానీ

Publish Date:Mar 27, 2025

Advertisement

తెలంగాణాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది, ముమ్మాటికీ నిజం. శాసన సభ వేదికగా ఆయన చేసిన ప్రసంగం మాటల్లోంచి, ఒక్క అక్షరాన్ని కూడా తప్పు పట్ట లేము. తీసి వేయలేము.  సరే..కోర్టు విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల  అంశాన్ని సభలో ప్రస్తావించ వచ్చునా? లేదా? అలా ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ అవుతుందా? కాదా? అన్నది, వేరే విషయం. మళ్ళీ అది కోర్టు పరిధిలోని విషయం. ఎలాగూ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆల్రెడీ ప్రకటించారు, కాబట్టి  ఆ విషయాన్ని  కోర్టు చూసుకుంటుంది. 
ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇక ముఖ్యమంత్రి ప్రసంగం విషయానికి వస్తే  బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి  కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావని  కుండ బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ఏమి జరిగిందో ఇప్పడు కూడా అదే జరుగుతుందన్న విశ్వాసంతో ఉప ఎన్నికలు ఎందుకురావో కూడా వివరించారు.  అవును  గత టీబీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలోనూ ఫిరాయింపులు జరిగాయి. అప్పుడున్న చట్టమే ఇప్పుడూ ఉంది. అప్పుడున్న స్పీకర్ వ్యవస్థే ఇప్పడూ ఉంది.  సో.. అప్పుడు పార్టీ ఫిరాయించిన ఏ ఒక్కరి పైనా అనర్హత వేటు పడలేదు. ఏ ఒక్కరూ రాజీనామ చేయలేదు. ఏ ఒక్క నియోజక వర్గంలోనూ ఉప ఎన్నిక రాలేదు. సో.. ఇప్పుడు కూడా ఏ ఒక్కరిపైనా అనర్హత వేటు పడదు. ఏ  ఒక్కరూ రాజీనామా చేయవలసిన అవసరం రాదు. ఏ ఒక్క నియోజక వర్గంలోనూ ఉప ఎన్నిక రాదు. అని ఎవరైనా అనుకోవచ్చును. ముఖ్యమంత్రి చెప్పిందీ, అదే. అందులో అభ్యంతరం చెప్పవలసింది ఏమీ లేదు. ఒక విధంగా ముఖ్యమంత్రి, ఎలాంటి శషబిషలు లేకుండా చేసిన ప్రకటన గుమ్మడి కాయ దొంగలు బుజాలు తడుముకునేలా చేసింది. అయితే  ముఖ్యమంత్రి సభలో అలాంటి ప్రకటన చేయవచ్చునా? అది  ఫిరాయింపులను ప్రోత్సహించడం అవుతుందా కాదా? అనేది వేరే విషయం.    
నిజానికి  గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో జరిగిన ఫిరాయింపులతో పోలిస్తే  ప్రస్తుత కాంగ్రెస్   హయాంలో జరుగుతున్న ఫిరాయింపుల  పెద్ద విషయం కాదు.  2014 నుంచి 2023 వరకు వరసగా రెండు సార్లు అధికారంలోకివచ్చిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ మొత్తం మీద ఓ 50 మందికి పైగానే  ఇతర  పార్టీల  ఎమ్మెల్యేలను కారు ఎక్కించి, గులాబీ కండువా కప్పించిది.  అంతే కాదు,  అందులో చాలా మందిని మంత్రులను చేసింది.  

నిజానికి  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం, స్వాగతించడం మాత్రమే కాదు, ఏకంగా  శాసన సభా పక్షాలను స్వాహా   చేసింది. టీఆర్ఎస్/బీఆర్ఎస్  శాసన సభా పక్షంలో వినీనం చేసుకుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు..  తెలుగు దేశం, సిపిఐ పార్టీల శాసన సభా పక్షాలను టీ(బీ)ఆర్ఎస్  స్వాహ చేసింది.  తెలంగాణ తొలి ముఖ్యమంతి కేసీఆర్   ఇతర పార్టీల ఎమ్మెల్యేల సర్పయాగంతోనే  తెలంగాణ స్వీయ పాలనకు శ్రీకారం చుట్టారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీలనూ వదలకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను  సగౌరవంగా స్వాగతించి  స్వాహా  చేశారు. ఒక్క బీజేపీ  సిపిఎం ఎమ్మెల్యేలు మాత్రమే కేసీఆర్   స్వాహా యాగం నుంచి తప్పించుకున్నారు. అవును  కేసీఆర్  ఎంఐఎం ఎమ్మెల్యేల జోలికి కూడా పోలేదు. కానీఎంఐఎంను మిత్ర పక్షం చేసుకున్నారు. 

నిజానికి, 2014 లో టీఆర్ఎస్ గెలిచింది 63 సీట్లు మాత్రమే.  అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్  రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ ,టీడీపీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలను కారెక్కించారు. అలాగే  ఇతర పార్టీల ఎమ్మెల్యేను తమ వైపుకు తిప్పుకుని అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని గణనీయంగా పెంచుకున్నారు.  అలాగే, 2018లో సొంత సంఖ్యా బలం 88కి పెరిగినా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మందిలో 14(13 ప్లస్ 1) మందిని  లాగేసుకుని  కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా  కూడా లేకుండా చేశారు. అలాగే  టీడీపీ సహా ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు` గులాబీ కడువలు కలిపి, అసెంబ్లీలో బీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని సెంచరీ దాటించారు. అందుకే ఇప్పడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని ఆరోపించడం  వెయ్యి బర్రెలను తిన్న ... సామెత గుర్తుకు తెస్తున్నదని అంటున్నారు. 

అయితే  రాజకీయ విశ్లేశకులు మాత్రం  గతంలో ఏమీ జరగలేదు కాబట్టి  ఇప్పడు కూడా ఏమీ జరగదు అనుకుంటే అది పొరపాటే అవుతుందంటున్నారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ను ఆదర్శంగా తెసుకుని అదే మార్గంలో నడిస్తే ఏమవుతుందో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి చెప్పారు. సో ..మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు.

By
en-us Political News

  
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు.
పాకిస్తాన్‌లో నీటి కోసం ఆ దేశ హోంమంత్రి జియా ఉల్‌ హసన్‌ ఇంటిని తగలబెట్టారు. ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహావేశాలను అదుపు చేయడంలో పాక్ ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌‌పై భద్రతా బలగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం ముగిసింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దని థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణించినట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహా దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో ఆకారణంగా విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి దీక్షకు దిగారు.
వచ్చే ఏడాది మార్చి 31లోపు నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్ వేదికగా తెలిపారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నంబాల మృతిని అమిత్‌ షా అధికారికంగా ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మే 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. ఈ సారి ఆయన హస్తినలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది.
కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.