స‌భా స‌మ‌రం.. ఈసారి కేసీఆర్ హాజరా? గైర్హాజరా?!

Publish Date:Dec 4, 2024

Advertisement

తెలంగాణ‌లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని గ‌వ‌ర్న‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ సమావేశాలలో ప‌లు అంశాలు చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వ‌హిస్తార‌నేది ఈ నెల 9న జ‌రిగే బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. సంక్రాంతి త‌రువాత రైతు భ‌రోసా నిధులు వేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.  అందుకు సంబంధించిన విధి విధానాల రూప‌క‌ల్ప‌న‌పై ఏర్పాటైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఇప్ప‌టికే ప‌లు అంశాల‌తో కూడిన నివేదిక‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ అంశాల‌ను అసెంబ్లీలో చ‌ర్చించి అర్హులైన రైతుల‌కే రైతు భ‌రోసా ద‌క్కేవిధంగా ముందుకు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. మ‌రోవైపు కొత్త‌గా తీసుకురానున్న ఆర్వోఆర్ చ‌ట్టంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన‌సాగుతున్న కుల‌గ‌ణ‌న స‌ర్వే   గ‌ణాంకాల‌ను అసెంబ్లీలో పెట్టి చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటై సంవ‌త్స‌రం పూర్తయ్యింది. ఈ సంవ‌త్స‌రకాలంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లుచేయ‌డంలో విఫ‌ల‌మైంద‌ని బీఆర్ఎస్ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  ఈ క్ర‌మంలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో  ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకు   బీఆర్ఎస్ రెడీ అవుతోంది. దీంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తరఫున నేతలు సభలో ఎంత గట్టిగా గళమెత్తినా, కేసీఆర్ సభకు గైర్హాజరైతే మాత్రం సభలో కాంగ్రెస్ దే పై చేయి కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకూ రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ రెండు సందర్భాలలోనూ  కాంగ్రెస్‌, బీఆర్ఎస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర‌ స్థాయిలో వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌భ‌లో లేక‌పోవ‌టంతో   కాంగ్రెస్‌  ఆధిప‌త్యం  స్పష్టంగా కనిపించింది.  బీఆర్ఎస్ త‌ర‌పున కేటీఆర్‌, హ‌రీశ్ రావు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా కాంగ్రెస్ స‌భ్యులు దీటుగా స‌మాధానం ఇచ్చారు.   కేసీఆర్ స‌భ‌లో ఉండిఉంటే పరిస్థితి వేరేలా ఉండేద‌న్న భావ‌న‌ గత రెండు సందర్భాలలోనూ బీఆర్ఎస్ శ్రేణులలో వ్య‌క్తం అయ్యింది.  కేసీఆర్ మాత్రం ఒక్క‌రోజు మిన‌హా అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఒక్క‌రోజు మాత్ర‌మే అసెంబ్లీకి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌జ‌ల బ‌డ్జెట్ కాద‌ని, అవ‌స‌ర‌మైన ప‌థ‌కాల‌కు, ప్రాజెక్టుల‌కు బ‌డ్జెట్ లో నిధులు కేటాయించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇక నుంచి అసెంబ్లీకి వ‌స్తా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంతుచూస్తానంటూ కేసీఆర్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో ఇక నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ స‌భ్యుల‌కు కేసీఆర్ చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని.. రేవంత్ ఇక కాస్కో అంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అప్పట్లో పోస్టులు పెట్టాయి. అయితే, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. దీంతో బీఆర్ ఎస్ శ్రేణులు తీవ్ర‌స్థాయిలో నిరాశ‌కు గుర‌య్యాయి. 

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై అనేక అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ , కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి , విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో అవినీతికి జరిగిందంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ అంశాల‌పై విచార‌ణ‌కు సైతం  ఆదేశించారు. అయినా కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు.  అధికారం కోల్పోయిన నాటినుంచి ఆయ‌న కేవ‌లం ఫాంహౌస్‌కే ప‌రిమితం అవుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ రావాల‌ని అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే  గ‌తంలో కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాల‌ని కేసీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావించగా.. ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇద్దామ‌ని, సంవ‌త్స‌ర కాలం స‌మ‌యం ఇచ్చిన త‌రువాత ప్ర‌భుత్వం ప‌నితీరు, విధానాల‌పై ప్ర‌శ్నిద్దామ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి సంవ‌త్స‌ర కాలం పూర్తయ్యింది. అంటే కేసీఆర్ చెప్పిన గడువు ముగిసింది. దీంతో  ఈనెల 9నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌ర‌వుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెల‌కొంది. బీఆర్ఎస్ వర్గాలు అయితే కేసీఆర్ సభకు హాజరౌతారనీ, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతారనీ ఆశాభావంతో ఉన్నాయి. 

అన్నిటికీ మించి ఈనెల 9 నుంచి జ‌రిగే అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ఎంతో ముఖ్య‌మైన‌వి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది అయ్యింది. ఈ నేప‌థ్యంలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీని నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్షానికి మంచి అవ‌కాశ‌మ‌ని రాజ‌కీయ నిపుణులు పేర్కొంటున్నారు. రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, పెన్ష‌న్ల తొల‌గింపు, మూసీ ప్ర‌క్షాళ‌న పేరుతో పేదల ఇళ్ల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై రేవంత్ సర్కార్ ను నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి ఇదో మంచి అవకాశంగా బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టి పై చేయి సాధించాలంటే పార్టీ అధినేత కేసీఆర్ సభకు వచ్చి గళం విప్పాల్సి ఉంటుందనీ, ఆయన గైర్హాజరైతే మాత్రం విపక్షంగా బీఆర్ఎస్ వైఫల్యాన్ని అంగీకరించినట్లే అవుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రేవంత్ రెడ్డి డిమాండ్ మేర‌కు, బీఆర్ఎస్ శ్రేణుల విజ్ఞ‌ప్తుల మేర‌కు కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తారా.. లేకుంటే ఈసారికూడా డుమ్మా కొడ‌తారా అనే అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతున్నది.

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.