తెలంగాణా రైతన్నలను కాపాడుకొందాము

Publish Date:Nov 1, 2014

Advertisement

 

యధా రాజా తధా ప్రజా అన్నారు పెద్దలు. అది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రులకి కూడా సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చును. విద్యుత్ కష్టాలకు గత ప్రభుత్వాలే కారణం కనుక రైతుల ఆత్మహత్యలకు కూడా గత ప్రభుత్వాలే కారణమవుతాయనే సిద్దాంతాన్ని ఆయన కనుగొన్న తరువాత దానిని ఆయన మంత్రులు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

 

వారిలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. కానీ ఆయన మరో అడుగు ముందుకు వేసి “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లు తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ వారి హయాం నుండే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారి పరిపాలనలో మూడువేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కావాలంటే ఇదిగో సాక్ష్యం..” అని ఏవో కాగితాలు చూపించారు. అంతేకాదు రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొన్నారో లిస్టులు తెప్పించుకొని వారి కుటుంబాలకి తమ ప్రభుత్వం సాయం చేద్దామని ఆలోచిస్తున్నట్లు చెప్పడం చూస్తే ఆయన రైతుల ఆత్మహత్యలకు, వారి కష్టాలకు ఆయన మానవత్వంతో స్పందిస్తున్నట్లు కనబడలేదు.

 

అసలు ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు, యంపీలు, యం.యల్సీలు అందరూ స్వయంగా రైతులను కలుస్తూ వారికి భరోసా కల్పించే విధంగా మాట్లాడి, వీలయినంత తక్షణ సహాయం అందించి వారు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎందుకు అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం లేదు? రైతన్నలు బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పడం ద్వారా వారికి ఎటువంటి సందేశం అందిస్తున్నారు? అని తెలంగాణా మంత్రులు తమను తాము ప్రశ్నించుకోవాలి.

 

ఇక తెలంగాణాలో ప్రతిపక్షాలు కూడా సున్నితమయిన ఈ సమస్యపై రాస్తారోకోలు, ఆందోళనలు చేసి రాజకీయంగా మరింత బలం పెంచుకోవాలని చూస్తున్నాయే తప్ప అన్ని పార్టీలు కలిసి డిల్లీ వెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం చాలా శోచనీయం. ఈ సమస్య వలన అధికార పార్టీ ఇబ్బందిపడితే దానిపై తాము పైచేయి సాద్ధిదామనే తపనే కానీ తమ కళ్ళ ముందు ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నలను చూసి కంటతడి పెట్టలేకపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం కలిసి పోరాడిన రాజకీయ పార్టీలు, జేఏసీలు ఇప్పుడు తమ రైతన్నలను రక్షించుకోవడానికి ముందుకు రాకుండా ఏమి చేస్తున్నాయి?

 

కేవలం తెలంగాణా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలే కాదు, ఆంధ్రా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలు కూడా తెలంగాణా రైతన్నలను కాపాడుకోవడం కోసం స్వచ్చందంగా ముందుకు రావాలి. కరెంటు ఇవాళ్ళ కాకపోతే రేపు వస్తుంది. కానీ రైతన్నలు చనిపోతే మరిక ఎన్నడూ తిరిగిరారనే సంగతి అందరూ గుర్తుంచుకొని, తక్షణం వారి సంక్షేమం కోసం అందరూ ఏమి చేయగలరో అది చేసి అందరికీ అన్నం పెట్టె అభాగ్య అన్నదాతలను కాపాడుకోవాలి. కార్ల మీద, మోటార్ సైకిల్ల నెంబరు ప్లేట్ల మీద ‘ఐ లవ్ ఇండియా’ అని స్టిక్కర్లు అంటించుకొని తిరగడం కాదు. ఇటువంటి సమయంలో కష్టాలలో ఉన్న రైతన్నలను ఆదుకొని ఇండియా పట్ల తమ ప్రేమ నిజమయిందని నిరూపించుకోవాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో, విదేశాలలో స్థిరపడిన ప్రవాస ఆంధ్ర, తెలంగాణా ప్రజలందరూ కూడా తెలంగాణా రైతన్నకి సహాయం చేసేందుకు తక్షణమే ముందుకు రావాలి.

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.