Publish Date:May 14, 2026
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. వారాంతం, పర్వదినాలలో వీరి సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. శ్రీవారి దర్శన భాగ్యం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండటం కద్దు. అలాగే కొండపై వసతి గదుల లభ్యత లేక కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే వారు.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీని ఆశ్రయించి భక్దులకు సులభంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన చర్యల వల్ల ఇప్పడు భకులకు మరీ జాగు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. భక్తులకు జాగు లేకుండా స్వామివారి దర్శనం లభిస్తుండటంతో కొండపై వసతి లభ్యత కూడా పెరిగింది. ఇందుకు ప్రధాన కారణంగా తిరుమల తిరుపతి దేవస్ధానం అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ కారణం.
ఈ నెలలో ఒకే రోజు తిరుమల శ్రీవారిని 91 వేల మంది భక్తులకు 12 గంటలలో దర్శించుకోగలిగారు. గతంలో అయితే ఈ సంఖ్యలో భక్తుల దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టేది. ఇక తాజాగా బుధవారం (మే 13) శ్రీవారిని 80 వేల మంది దర్శించుకున్నారు. వీరందరికీ కేవలం 8 గంటలలోనే శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. అంటే గంట వ్యవధిలో పది వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారన్న మాట. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ ద్వారా స్వల్ప వ్యవధిలోనే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుండటంతో.. కొండపై విడిది గదుల కొరత సమస్యే ఉత్పన్నం కావడం లేదని టీటీడీ చెబుతోంది.
ఎందుకంటే దర్శనం చేసుకున్న భక్తులు వెంటనే కాటేజీలు, విడిది గదులను వెకేట్ చేస్తున్నారు. దీంతో విడిది సమస్య లేకుండా పోయిందంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ దాదాపుగా వసతి లభిస్తున్న పరిస్థితి. గతంలో అయితే శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడిన దాని కంటే ఎక్కవ సేపు వసతి గదుల కోసం భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయని భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/technology-effect-36-219800.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్లైన్లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.