కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు దేశం పార్టీ మాజీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు. "మీ తండ్రి పెద్ద వీరారెడ్డిని చంపినట్లే నిన్నూ చంపేస్తాం.. మీ ఇంట్లోనే హత్య చేస్తాం" అంటూ నాలుగు పేజీల లేఖను స్పీడ్ పోస్టు ద్వారా పంపినట్లు సమాచారం. తప్పుడు చిరునామాతో ఈ లేఖను ఆయన ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీకి, అలాగే టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
"ఇలాంటి బెదిరింపులకు భయపడను" : ప్రవీణ్ కుమార్ రెడ్డి
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లేఖ రాసిన వ్యక్తి నీచుడని, గుంటనక్కలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన తండ్రి పెద్ద వీరారెడ్డి ప్రజల కోసం పోరాడుతూ రౌడీయిజాన్ని అణచివేసినందుకే హత్యకు గురయ్యారని పేర్కొన్నారు.
తమ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమని, వీరశివారెడ్డి, లక్ష్మీదేవమ్మ, తాను ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధులుగా పనిచేశామని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాకుండా నేరుగా ఎదురుగా రావాలని సవాల్ విసిరారు. ఈ బెదిరింపు లేఖ వెనుక ఉన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-leader-praveen-kumar-reddy-36-221997.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్స్పెక్టర్ బి. మహేందర్కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.