కట్టలు తెంచుకున్న తెలుగుదేశం శ్రేణుల ఆగ్రహం.. వైసీపీకే కాదు.. టీడీపీకీ హెచ్చరికే!

Publish Date:Feb 2, 2026

Advertisement

 

భారతదేశంలో  అత్యంత ప్రజాదరణ ఉన్న పార్టీలలో తెలుగుదేశం పార్టీ ఒకటి అన్నది నిస్సందేహంగా చెప్పవచ్చు.  పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ  వామపక్షాలు, బీజేపీ వంటి పార్టీలకు దీటుగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తారు. ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఎన్ని దాడులకు గురైనా, ఆ పార్టీ నేతలు ఎన్నడూ కట్టుదాటి ప్రవర్తించిన దాఖలాలు కనిపించవు.

తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అన్ని సంక్షోభాలనూ కూడా శాంతియుత ఆందోళనలు, పోరాటాల ద్వారానే అధిగమించింది. ముఖ్యంగా 1984లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అత్యంత అప్రజాస్వామికంగా కూల్చివేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నభూతో అన్నచందంగా చరిత్రలో నిలబడిపోతుంది. ఇక గత జగన్ హయాంలో అంటే 2019 నుంచి  2024 వరకూ  తెలుగుదేశం రాజకీయ మనుగడ లేకుండా చేయాలన్నలక్ష్యంతో జరిగిన కుట్రలకు లెక్కే లేదు. స్కిల్ కేసు అంటూ అక్రమంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో నిర్బంధించిన సందర్భంలో కూడా ఎక్కడా గీత దాటకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగానే తెలుగుదేశం శ్రేణులు ఉద్యమించాయి. అయితే  శనివారం (జనవరి 31)న తెలుగుదేశం శ్రేణులు అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించి విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం చరిత్రలో ఈ రీతిగా కార్యకర్తలు రెచ్చిపోవడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం చెబుతున్నారు.  

అయితే తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించడమే కారణం అంటున్నారు.   అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగు రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తెలుగుదేశం శ్రేణులు ఫైర్ అయ్యాయి.   ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ముట్టడించారు.  ఇలా ఒక రోజు వ్యవధిలోనే తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు వైసీపీ నేతల ఇళ్ల ముట్టడి.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించురకుంది.

గతంలో అంటే వైసీపీ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఆగ్రహం వ్యక్తం కాలేదు. అయితే ఇప్పుడుఈ స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమనడం విశేషం. అధినేతను దూషించినా, అనుచితంగా వ్యవహరించినా ఇక ఊరుకునేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని తెలుగుదేశం శ్రేణులు ఈ ఘటనల ద్వారా   వైసీపీకి, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వైసీపీయులపై చర్యల విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికీ  ఈ సంఘటనలు ఒక హెచ్చరికగా భావించవచ్చన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది.  

By
en-us Political News

  
అనర్హత వేటు భయంతో పాటు.. ఇంకా అసెంబ్లీ బహిష్కరణ అంటే పార్టీ ఎమ్మెల్యేలు తన మాట వినకపోవచ్చన్న ఆందోళన కూడా జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో తన వైఖరి మార్చుకోవడానికి కారణం కావచ్చని పరిశీలకులు అంటున్నారు.
అయితే వైసీపీ నేతలు మాత్రం సిట్ చార్జిషీట్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆనవాళ్లే లేవని పేర్కొందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్ర‌బాబు తాజాగా స్పందించారు.
అంబటి భాష సరికాదని పేర్కొంది. ఇష్టారీతిగా మాట్లాడతాం, రక్షణ కల్పించండి అంటే ఎలా అని పేర్కొంది. నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల పని కాదన్న కోర్టు, సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని పేర్కొంది.
ఆ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్య వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై అంబటిపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అంబటి రాంబాబును ఆయన నివాసంలో శనివారం (జనవరి 31) అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోనికి తీసుకుని పోలీసు వాహనంలో నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా?
వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు. కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నంబర్ 11 తో నెటిజనులు మరో సారి వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. 11 నుంచి ప్రారంభయమ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ 11 మందీ హాజరౌతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పురాణం విప్పారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్లపాటు సమర్థవంతంగా నడిపించడం, స్థిరమైన, నిలకడైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించడం ఆమె పరిణితికి నిదర్శనంగా ప్రధాని అభివర్ణించారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.