పెండింగ్ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం

Publish Date:Mar 29, 2024

Advertisement

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను  ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది.  ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది. ఆయనను ఆయన కోరుకున్న భీమిలి నియోజకర్గం నుంచే బరిలోకి దింపింది. ఆయనకు ఇద్దామని భావించిన చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా కళా వెంకటరావును ప్రకటించింది.

 ఇక కదిరి స్థానంలో ఇప్పటికే  కందికుంట యశోద పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ఆమెకు బదులుగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు అవకాశం ఇచ్చింది.  ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చింది. విజయనగరం లోక్‌సభ స్థానానికి   కలిశెట్టి అప్పలనాయుడును అభ్యర్థిగా ప్రకటించింది.  అనంతపురం అర్బన్ స్థానాన్ని ఆశించిన  ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగులుస్తూ అక్కడ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. 

చీపురుపల్లి - కళా వెంకట్రావు,  భీమిలి - గంటా శ్రీనివాసరావు, పాడేరు (ఎస్టీ) - కిల్లు వెంకటరమేశ్ నాయుడు,  దర్శి - గొట్టిపాటి లక్ష్మి,  రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం,  ఆలూరు - వీరభద్ర గౌడ్,  గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,  కదిరి - కందికుంట వెంకటప్రసాద్

ఇక  లోక్ సభ అభ్యర్థులుగా విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు,  ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ,  కడప నుంచి భూపేశ్ రెడ్డిలను ప్రకటించింది. 

By
en-us Political News

  
వైసీపీకి భవిష్యత్ లేదా? ఈ విషయం పార్టీలో దగాకు గురైన వారే కాదు.. నిన్న మొన్న వచ్చి చేరిన వారికి కూడా అర్ధమైపోతోందా? అంటే ఎలాంటి సందేహం లేకుండా ఔనని చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉంటాయి.
తిరుపతి జిల్లాలోని చారిత్రక నగరం చంద్రగిరిలోని విజయనగర కాలపు ఇటుక రాతి దిగుడుబావిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సోమవారం (ఏప్రిల్ 29) నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా తమిళిసైను ఎన్నికల ప్రచారంలోకి దింపిందని అంటున్నారు.
వైసీపీ నేతలు ఒక్కొక్కరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు
హరీష్ రావు.. బీఆర్ఎస్ లో అధిష్ఠానం పెద్దగా ఇష్టపడని కీలక నేత. పార్టీలో ఆల్ఈజ్ వెల్ పరిస్థితి ఉన్న సమయాలలో ఆయనకు ఎప్పుడూ పెద్ద ప్రాధాన్యత లభించలేదు. అదే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా, అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నా పార్టీ హైకమాండ్ కు ముందుగా గుర్తుకు వచ్చేది హరీష్ రావే. ఆఘమేఘాల మీద ఆయన మెడలో వీరతాళ్లేసేసి పార్టీని ఇబ్బందుల నుంచి గట్టెక్కించుందుకు తెరమీదకు తీసుకు వస్తుంటుంది.
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ లో తీవ్ర నిర్వేదం కనిపిస్తోంది. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారు.. అందుకు ఫలితం అనుభవిస్తారు అన్నట్లుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం శాపనార్ధాలు పెడుతోంది. ఈ విషయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రెండాకులు ఎక్కువగానే తిన్నట్లు కనిపిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం(ఏప్రిల్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డం వంటి ప‌నుల‌కే జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు.
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న వ‌ర్గీయుల అరాచ‌కం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇదేంట్రా బాబు.. మ‌నం ఏమైనా పిచ్చోళ్ల‌మా అని చ‌ర్చించుకుంటున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి.
రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది. అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.