గుట్టు రట్టైంది.. బీజేపీతో రహస్య బంధం ఎవరిదో తేలిపోయింది!?

Publish Date:Apr 29, 2024

Advertisement

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ లో తీవ్ర నిర్వేదం కనిపిస్తోంది. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారు.. అందుకు ఫలితం అనుభవిస్తారు అన్నట్లుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం శాపనార్ధాలు పెడుతోంది. ఈ విషయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రెండాకులు ఎక్కువగానే తిన్నట్లు కనిపిస్తున్నారు.

ఏడాది లోగా రేవంత్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని  జోస్యం చెబుతున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. బస్సు యాత్రతో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలోలా కేసీఆర్ ప్రసంగాలలలో వాడి వేడి కనిపించడం లేదు. ఎన్నికల జోస్యం చెబుతూ.. మళ్లీ కింగ్స్ మేమే అంటూ చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజలలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ముందు పార్టీని వదిలి వెళ్లిపోతున్న వారిని నియంత్రించే ప్రయత్నాలు చేసుకుంటే మంచిదని పరిశీలకులు సలహాలిస్తున్నారు. 

సరిగ్గా ఎన్నికల వేళ కేసీఆర్, కేటీఆర్ రెండు వేర్వేరు సభలలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చకు దారి తీశాయి. గతంలో కేటీఆర్ ఒక సందర్భంగా రేవంత్ బీజేపీ గూటికి చేరడం ఖాయమని పేర్కొన్న సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఆయన మాట మార్చారు. రేవంత్ కాదు తామే బీజేపీ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నామని అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆదివారం ఆయన వేములవాడ, కరీంనగర్ లలో ప్రసంగించారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. ఏడాది తిరిగే సరికి మళ్లీ కేసీఆర్ తెలంగాణను శాసిస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యులు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు దారి తీశాయి. లోక్ సభ ఎన్నికలలో ఓ పది పన్నెండు స్ధానాలు గెలిస్తే బీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణను ఎలా శాసిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబు కేసీఆర్ చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎందుకంటే కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో రాబోయేది హంగ్ ప్రభుత్వమేననీ, మళ్లీ మనమే కింగ్స్ అని పదే పదే చెబుతున్నారు. రెంటినీ కలిపి చూస్తే కేటీఆర్ అన్న కేసీఆర్ తెలంగాణను శాసిస్తారు అన్న మాట వెనుక ఉన్నది బీజేపీతో పొత్తు సంకేతమేనంటున్నారు. లోక్ సభ ఎన్నికలలో పది పన్నెండు స్థానాలలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో అధికారం కోసం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని ఆయన చెప్పకనే చెప్పేసినట్లైందని అంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్, బీజేపీ రహస్య బంధాన్ని కేటీఆర్ స్వయంగా బయటపెట్టేశారని అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ కు బీజేపీతో రహస్య బంధం ఉందని ఆరోపిస్తోంది.  ఇప్పుడు కేటీఆర్ తన వ్యాఖ్యలతో ఆ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఓట‌మి భ‌యంతో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయి. ఏకంగా తెలుగుదేశం అభ్య‌ర్థుల‌పైనే హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డుతున్నాయి. సాధార‌ణంగా ఎక్క‌డైనా పోలింగ్ ముందు, పోలింగ్ రోజున ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌డం చూస్తుంటాం.
ఎన్నికల బరిలో కంగన రనౌత్
జగన్.. ఛలో లండన్!!
చంద్రగిరి వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెంచి పోషిస్తున్న రౌడీలు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై బీర్ బాటిళ్ళు, సమ్మెటలు, రాళ్లతో దాడి చేశారు.
జగన్ బ్రెయిన్ ఛైల్డ్ అయిన ‘వైనాట్ 175’ సిద్ధాంతానికే గండి కొట్టేశారు. రాయలసీమలో గత ఎన్నికలలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి 35 నుంచి 40 సీట్లు వస్తాయి అని డిక్లేర్ చేశారు.. అద్గదిగో.. ఇక్కడ వైసీపీ వర్గాల గుండెల్లో పెద్ద బండరాయి పడింది..
2019తో 2024 పోలింగ్ ను పోల్చితే 2 శాతం తేడా క‌నిపిస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం న‌మోదయితే ఈసారి 2024 లో పోలింగ్ 81 శాతాన్ని దాటిపోయేలా వుంది. దీన్ని బ‌ట్టి ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. తెలుగుదేశం కూటమికి 155 నుండి 160 సీట్లు, వైఎస్సార్సీకి 15 నుండి 21 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పిల్ల చేష్టలకి, మూడు రాజధానుల కుప్పిగంతులను వైజాగ్ ఓటర్లు మొట్టికాయలతో చక్కదిద్దారు.
జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల పోలింగ్ స్టేషన్లలో మంగళవారం (మే14) తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. తమ వంతు వచ్చే వరకూ ఓటర్లు ఓపికతో ఎదురు చూస్తే రాత్రంతా జాగారం చేయడం ఓటరు చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే...
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది. కొత్త ఓటర్లు, యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు.
అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు.
కిందపడ్డా నాదే పైచేయి అంటారు చూశారా.. అలా వుంది నగరిలో మటాష్ అవబోతున్న రోజా వ్యవహారం. మొదటగా నగరి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పదేళ్ళుగా మీ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రోజాని మీ ఓటు ద్వారా సాగనంపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.