బాబుకి చెప్పే ఢిల్లీకి...ఆ ఫిరాయింపు ఎంపీ కోసమే ?

Publish Date:Jun 26, 2019

Advertisement


ఏపీలో క్షణక్షణానికి మారుతున్న రాజకీయం విశ్లేషకులను కూడా కలవరపెడుతోంది. మొన్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోరంగా దెబ్బతినడంవలన ఏపీలో దాని పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ మారి కాషాయం కప్పుకోగా మిగిలిన కొందరు నేతల మీద కూడా బీజేపీ కన్నేసింది. ఇక ఈ నేపథ్యంలో, గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయ్యారనే వార్త నిన్న ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో వెంట మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని వీరదరినీ ఇటీవలే బీజేపీలో చేరిన ఎంపీ గరికపాటి రామ్మోహన్ బీజేపీ పెద్దల దగ్గరకు తీసుకెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయితే అలా ప్రచారం జరిగిన వారిలో తెలుగుదేశం అధికార ప్రతినిదిగా ఉన్న లంకా దినకర్ అనే వ్యక్తి ఒక్కరే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ ప్రచారం మీద ఢిల్లీలోనే ఉన్న రేపల్లె ఎమ్మెల్యే స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అబద్ధమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను తాను కలిసినట్టు వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరారు. ఈరోజు టీడీపీ మీటింగ్ ఉందని నిన్ననే తనకు ఫోన్ వచ్చిందని, వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నానని, రాలేననే విషయాన్ని అధినేత చంద్రబాబుకి చెప్పానని అన్నారు. అయితే గరికపాటిని ఎందుకు కలవాల్సి వచ్చిందన్న విషయం మీద కూడా ఆయన స్పందిస్తూ అనారోగ్యంతో బాధ పడుతున్న తనకు ఆప్తుడయిన గరికపాటి రామ్మోహన్ రావుని కలిసేందుకే ఇక్కడికి వచ్చానని వారి నివాసంలో తామిద్దరం కలిసి లంచ్ చేశామని అంతే నని అంతకు మించి ఏమీ లేదని అన్నారు. రేపల్లె నుండి రెండో మారు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు పరిటాల కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

By
en-us Political News

  
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు.
క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం.
తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 2019 నుంచి 2021 మూడు దశలలో కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసింది. జనం నెలల తరబడి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు లేకుండా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో సారి కరోనా విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మూడు దశలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది.
పాకిస్ధాన్ తీరు మారలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఆ దేశం ఉగ్రవాదానికి దన్ను గా ఉన్నదన్న సంగతిని ప్రపంచానికి చాటిన భారత్.. ఆ తరువాత తన సైనిక సత్తాను చాటి పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టింది.
బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.