త్వరలో కవిత కొత్త పార్టీ ! తండ్రికి లేఖ వెనుక ఎత్తుగడ ఇదే !

Publish Date:May 23, 2025

Advertisement

 

క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని  విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం. ఇదంతా జ‌రిగే ప‌నేనా? అందుకా అవ‌కాశాలున్నాయా? అని ఆలోచిస్తే.. ఇదంతా నేరుగా కేసీఆర్ నుంచే వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌గా తెలుస్తోంది. గులాబీ బాస్ త‌న ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అల్లుడు హ‌రీష్ రావ్ కి ఇస్తే ఆయ‌న స‌సేమిరా అన్నాడని స‌మాచారం. మామ‌కు ద్రోహం చేసిన రెండో చంద్ర‌బాబును అవుతాను. అది నాకిష్టం లేదు. ఆ ముద్ర నేను వేయించుకోలేన‌ని డైరెక్టుగా విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు హ‌రీష్ రావు చెప్ప‌డం కూడా అంతే వాస్త‌వం. ఒక వేళ అలా జ‌రిగినా కూడా తాను త‌న మామ కేసీఆర్ బ‌తికుండ‌గా పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. క‌ట్ చేస్తే పార్టీలో ప్ర‌స్తుతం కేసీఆర్ త‌ర్వాత అంత‌టి సుప్రిమో కేటీఆరే. త‌ర్వాత హిమాన్షు ప‌రం అవుతుందేమోగానీ మ‌రెవ‌రికీ ఇందులో భాగ‌స్వామ్యం లేదు. 

ఇక్క‌డ కేసీఆర్ అస‌లు ప్లానేంటంటే డీఎంకే, అన్నాడీఎంకేలాగా.. పార్టీ చీలినా పెద్ద స‌మ‌స్య‌లేద‌ని.. అధికారం మాత్రం మ‌న ఇంట్లోనే ఉండాల‌న్న‌ది చంద్ర‌శేఖ‌ర‌రావు అస‌లు ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. అలా తొలుత హ‌రీష్ రావును ఆ దిశ‌గా ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నిస్తే అది ఆదిలోనే హంస‌పాదులా మారిందట‌. అప్ప‌ట్లో అమిత్ షా కూడా హ‌రీష్ రావును గ‌ట్టిగానే ట్రై చేసిన‌ట్టు స‌మాచారం. హ‌రీష్ బీజేపీలోకి వెళ్తారేమోన‌ని కేసీఆర్ కూడా బాగానే ఎదురు చూశార‌ట‌. అలాగైనా మ‌న‌లో ఒక‌డు ఇత‌ర పార్టీలోకెళ్లి అక్క‌డి నుంచి అధికారంలో ఉండ‌టం కూడా క‌లిసొచ్చే అంశ‌మే అన్న‌ది కేసీఆర్ అస‌లు వ్యూహ‌మ‌ట‌. ఇప్పుడు.. చూడండీ ఎక్క‌డి నుంచో పొడుచుకొచ్చిన రేవంత్ సీఎం అయి కూర్చుని కాళేశ్వ‌రం గుంత‌లు మొత్తం త‌వ్వుతున్నాడు. ఏమో కాంగ్రెస్ వాళ్లే కాళేశ్వ‌రాన్ని పేల్చేశారేమో అని కేటీఆర్ ఎంత బ‌నాయిస్తున్న.. వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. రేవంత్ అయితే సీఎం ఐయిపోయాడు.. క‌ల్వ‌కుంట్ల కుటుంబం ముక్కు పిండుతున్నారు.

అదే గ‌తంలో కేసీఆర్ ఆశించిన‌ట్టు హ‌రీష్ పార్టీ బ‌య‌ట‌కు వెళ్లి ఏ బీజేపీలోనో చేరి ఉంటే.. అప్ప‌టికి మంచి ఫామ్ లో ఉన్న బీజేపీ అధికారంలోకి వ‌చ్చి.. హ‌రీషే సీఎం అయి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేదిగా.. అన్న‌ది కేసీఆర్ మ‌న‌సులో మ‌రుగుతోన్న‌ట‌ ఆలోచ‌న‌ట‌.ఇదంతా ఇలా ఉంటే అల్లుడి వ‌ల్ల ఎలాగూ వ‌ర్కువుట్ కావ‌డం లేదు.. ఈయ‌న సంగ‌తి ఇలా ఉంచి.. త‌న కూతురి ద్వారా మ‌రో ప్ర‌యోగం చేసి చూద్దాం.. త‌ద్వారా ఏదైనా స‌క్సెస్ సాధించ‌వ‌చ్చేమో. పోతే వెంట్రుక వ‌స్తే కొండ‌.. అన్న కోణంలో ఇప్పుడు కూతురు క‌విత  నుంచి న‌రుక్కొస్తున్న‌ట్టుస‌మాచారం.క‌విత వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌ని.. చూస్తే.. అట్ లీస్ట్ ఓట్ల‌ను చీల్చి.. బీఆర్ఎస్ కి స‌పోర్ట్ చేయ‌నైనా చేయ‌రా? అన్న‌దొక అంచ‌నా. ఆమె ఎవ‌రి ఓట్లు చీలుస్తారు? ఆమె వెన‌క దాగిన ఓటు బ్యాంకు ఎలాంటిద‌ని చూస్తే.. ఆమె తొలి నుంచి తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ ఆడ‌ప‌డుచుగా చేసిన బ‌తుక‌మ్మ‌లు మ‌హిళా లోకాన్ని ఆక‌ర్షించాయి. ఈ దిశ‌గా మ‌హిళా ఓటు బ్యాంకును కాస్త క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇక పోతే బీసీ ఓటు బ్యాంకు. బీసీల వాణి వినిపించ‌డంలోనూ క‌విత ఒక ప్ర‌యార్టీగా తీసుకున్నారు. 

దానికి తోడు తెలంగాణ‌లో బీసీల గురించి భారీ ఎత్తున కొట్లాట న‌డుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ వ‌ర్సెస్ తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ పోరు షురూ  అయ్యింది. మ‌ల్ల‌న్న అయితే ఏకంగా బీసీల కోసం త‌న కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వాన్ని కూడా కోల్పోయాడు. రెడ్ల‌తో ఢీ అంటే ఢీ అన్నాడు. దానికి తోడు రేవంత్ రెడ్డే చివ‌రి రెడ్డి సీఎం కావాల‌ని అన్నాడు. ఈ బీసీ బ్యాగ్రౌండ్ లోకి క‌విత సైతం ప్ర‌వేశించి.. ఇక్క‌డ నాలుగు ఓట్లు చీలినా.. త‌న బీఆర్ఎస్ కి ఆమె మేలు చేసిన‌ట్టే లెక్క‌!ఇలా ప‌రి ప‌రివిధాలా ఆలోచించి క‌విత  ను ఒక బాణంగా ప్ర‌యోగించాల‌ని కేసీఆర్ చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? గ‌తంలో ఎవ‌రైనా ఇలా చేశారా? అని చూస్తే జ‌గ‌న్ త‌న సోద‌రి ష‌ర్మిళ‌ను కూడా స‌రిగ్గా ఇలాగే వినియోగించిన‌ట్టు ఒక టాకుండేది అప్ప‌ట్లో. ఆమె ఒక ఎమోష‌న‌ల్ డ్రామాను పండించి.. మొద‌ట ఇక్క‌డ త‌న పార్టీని తెలంగాణ‌లో తెరిచి తిరిగి అక్క‌డ ఏపీలోకి వెళ్లి.. త‌మ ఓటు బ్యాంకు చీలి కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌డ‌కుండా ఒక కాపు కాచార‌న్న‌ది అప్ప‌ట్లో వినిపించిన మాట‌. 


అలా క‌విత కూడా ఒక రాజ‌కీయ ప్ర‌యోగంగా తాను సైతం త‌న బీఆర్ఎస్ కి ఒక బీ టీంని ఎందుకు ఏర్పాటు చేసుకోవ‌ద్దు? మ‌న‌కి బీజేపీకి లింకు అంట‌గ‌ట్టి ఈ బీటీ మ్ ప్రాప‌గాండా చేయించుకోవ‌డం కంటే ఇదే మేలు. అదే మ‌న ద‌గ్గ‌ర ఒక సైడు దుకాణం ఉంటే.. దానితోనే లింకు పెట్టి మాట్లాడ‌తారు. దీంతో డ్యామేజీని భారీగా మేనేజ్ చేయొచ్చుగా అన్న‌ది క‌విత త్రూ కేసీఆర్ ఆడుతున్న మ‌రో రాజ‌కీయ డ్రామాగా దీన్ని అభివ‌ర్ణిస్తున్నారు ఆర్కే రేంజ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు.కేసీఆర్ కి తొలి నుంచి ఇలాంటి ప్ర‌యోగాలు ముక్కుతో పెట్టిన విద్య‌. ముక్కాయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. విజ‌య‌వంత‌మైన టీఆర్ఎస్ పేరు కూడా బీఆర్ఎస్ అంటూ పేరు మార్చిన ఆయ‌న‌కు క‌విత ద్వారా మ‌రో తెలంగాణ శ‌బ్ధంతో కూడిన పార్టీ పెట్టించ‌డం ఒక లెక్క కాదు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా పలు పార్టీ పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. ఇక నేడో రేపో క‌విత నుంచి ఈ సౌండ్ మ‌నం విన్నా వినొచ్చ‌ని రాజ‌కీయ అభిజ్ఞాన వ‌ర్గాల భోగ‌ట్టా.

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.