ఆదోని, కర్నూలులో కూటమి అభ్యర్థుల వైపే జనం
ముస్లిం మైనారిటీల మద్దతూ తెలుగుదేశం కూటమికే
కర్నూలులో పని చేయని వైసీపీ ముస్లిం కార్డ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి బలం రోజు రోజుకూ పెరుగుతోంది. వైసీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గాలలో కూడా కూటమి బలపడుతోంది. తొలి నుంచీ కూడా వైసీపీకి రాయలసీమలో వైసీపీకి తిరుగులేని బలం ఉంది. అయితే ఈ సారి మాత్రం ఆ పార్టీకి అక్కడ కూడా ఎదురుగాలే వీస్తోందని సర్వేలు నిర్ద్వంద్వంగా చెబుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో సీమలో ఈ సారి కూటమి మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమని తేల్చింది. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా ప్రజలు తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే పేర్కొంది. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో కూటమిదే అధికారమని తేల్చాయి. తాజాగా స్ట్రా పోల్ సంస్థ కర్నూలు జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోందని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ముఖ్యంగా కర్నూలు, ఆదోనిలలో తెలుగుదేశం కూటమికి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోందని సర్వే తేల్చింది.
కర్నూలులో తెలుగుదేశం పుంజుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న కర్నూలులో, అదీ కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా బీజేపీకి అభ్యర్థి పోటీ చేస్తున్న ఆదోనిలో కూడా కూటమిదే అధిపత్యం అని తేలడంతో ప్రాంతాలు, కులాలు, మతాలు, సామాజిక సమీకరణాలకు అతీతంగా రాష్ట్రంలో కూటమి జోరు కొనసాగుతోందని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆదోనిలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలమైన నేతలు లేరు. క్యాడర్ లేదు. అయినా ఆ నియోజకవర్గంలో వైసీపీ కంటే బీజేపీ ముందంజలో ఉందంటే.. జనాలలో వైసీపీ సర్కార్ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఆదోని నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థ సారథి బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా వై. సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా తాజా సర్వేలో డాక్టర్ పార్థ సారథికి 55.85% మంది మద్దతు పలుకుతుంటే.. వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి కేవలం 44.15% మంది మాత్రమే మద్దతుగా ఉన్నారని స్ట్రా సర్వే పేర్కొంది. అదోని అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ బీజేపీకే మొగ్గు ఉందని తేలడమంటే.. ముస్లిం మైనారిటీల్లో కూడా జగన్ పాలన పట్ల వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు.
ఇక కర్నూలు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న టీజీ భరత్ కు 50 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. వైసీపీ మైనారిటీ కార్డ్ ఉపయోగించినప్పటికీ ఇంతియాజ్ అహ్మద్ కు క ేవలం 37.5శాతం మంది ఓటర్లు మాత్రమే మద్దతుగా నిలిచారని సర్వే పేర్కొంది. మొత్తానికి ఆదోని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-alliance-ahead-in-rayalaseema-also-39-173350.html
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.