ఈ సారి సర్వేపల్లి సోమిరెడ్డిదేనా?

Publish Date:Apr 6, 2024

Advertisement

సర్వేపల్లి నియోజకవర్గం.. ఈ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రంగంలో ఉన్నారు. అయితే సోమిరెడ్డికి సర్వేపల్లి పెద్దగా కలిసి వచ్చే నియోజకవర్గం కాదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉండేది. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు పరాజయం పాలయ్యారు. అయినా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయనకు మరో సారి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం సోమిరెడ్డిని గెలుపు పట్టించేలా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అయితే సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ బలమైన నాయకుడే. అయితే ఐదేళ్ల జగన్ పాలనా వైఫల్యాలకు తోడు స్వయంగా కాకాణిపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రజలలో ఆయన ప్రతిష్ఠను పలుచన చేశాయంటున్నారు. 

నిజానికి నెల్లూరు జిల్లా అంటే పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా వైసీపీకి కంచుకోటలా ఉంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీదే ఆధిపత్యం.ఆ ఎన్నికలలో జిల్లాలో తెలుగుదేశం మూడు నియోజకవర్గాలలో విజయం సాధించింది. వైసీపీ ఏడు నియోజకవర్గాలలో విజయభేరి మోగించింది. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాలలోనూ వైసీపీయే గెలిచింది. ఆ ఎన్నికలలో జిల్లాలో తెలుగుదేశం ఖాతాయే తెరవలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మాత్రం వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి.  ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు   కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామ్‌నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు దాదాపు ఏడాది కిందటే వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. తాజాగా   వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం తెలుగుదేశం కండువా కప్పుకుని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ చేరికలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వడమే కాకుండా పార్టీ బలోపేతం అవ్వడానికి దోహదపడ్డాయి.

తెలుగుదేశం జిల్లాలో ఎంతగా పుంజుకున్నా సర్వేపల్లి నియోజకవర్గం మాత్రం వైసీపీకి పెట్టని కోటే అన్న భావన ఇటీవలి కాలం వరకూ ఉండేది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత   పరిస్థితిలో ఒక్క సారిగా మార్పు వచ్చింది. నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు,  కార్యకర్తలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రచారానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. నియోజకవర్గంలో  పొదలకూరు మండలం కాకాణి గోవర్ధన్ రెడ్డికి కంచుకోట అనడంలో సందేహం లేదు. ఆ మండలంలోనే సోమిరెడ్డికి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో ఈ సారి సోమిరెడ్డి చంద్రమేహన్ రెడ్డి విజయం నల్లేరు మీద బండినడకే అనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్కసారిగా సర్వేపల్లిలో వైసీపీకి ఎదురుగాలి వీచడానికి  కాకాణిపై   ఉన్న అవినీతి ఆరోపణలే కారణమంటున్నారు.

కృష్ణపట్నం పోర్టు నుంచి బయటకు వచ్చే లారీలు, వాహనాల నుంచి కాకాణి  పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారన్న  ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన వసూళ్ల దెబ్బకు తట్టుకోలేక   పోర్టు ద్వారా కంటైనర్ల  రాకపోకలు నిలిచిపోయాయని నియోజకవర్గంలో  గట్టిగా వినిపిస్తోంది.  ఆ కారణంగా కనీసం 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారనీ, అంతే కాకుండా రొయ్యల గుమతులకు సైతం ఇబ్బందులు ఎదురౌతున్నాయనీ అంటున్నారు. ఈ కారణంగా కాకాణిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఆ వ్యతిరేకతకు తోడు మూడు సార్లు నియోజకవర్గం నుంచి మూడు సార్లు పరాజయం పాలైన సోమిరెడ్డిపై సానుభూతి కూడా ఉందనీ చెబుతున్నారు. ఆ సానుభూతికి నియోజకవర్గంలో కాకాణిపై వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీకి సానుకూలత తోడై సొమిరెడ్డి విజయానికి దోహదపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అంతా బాగున్నప్పటికీ విజయం కోసం సోమిరెడ్డి చెమటోడ్చక తప్పదని అంటున్నారు.  

By
en-us Political News

  
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.