తెలంగాణాలో తెదేపా-బీజేపీల స్నేహం కొనసాగుతుందా?

Publish Date:Aug 21, 2014

Advertisement

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టిన అమిత్ షా నిన్న హైదరాబాదు వచ్చారు. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల నాటికి విజయం సాధించే విధంగా పార్టీని తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఆయనను కలిసి అరగంటసేపు మాట్లాడారు. త్వరలో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరగనున్నాయి గనుక బహుశః ఆ విషయంపై వారిరువు చర్చించి ఉండవచ్చును. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు గనుక, బహుశః ఇప్పుడు కూడా అమిత్ షా ఆయన మద్దతు కోరి ఉండవచ్చును. జనసేన పార్టీ నిర్మాణం ఇంకా జరుగలేదు గనుక బహుశః పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించవచ్చును.

 

కానీ ఈసారి కూడ బీజేపీ తెదేపాతో పొత్తులు పెట్టుకొంటుందా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందువలన అంటే మొదటి నుండి తెదేపాతో ఎన్నికల పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. తెదేపా తమకు మిత్రపక్షమని తెలిసి ఉన్నప్పటికీ ఆయన ఆ విధంగా చెప్పడం చూస్తే, బహుశః ఆయన బీజేపీ అధిష్టానం అనుమతితోనే ఆ విధంగా చెప్పి ఉండవచ్చునని భావించవలసి ఉంటుంది.

 

అమిత్ షా కూడా తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకొని, వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం గురించి మాట్లాడారు తప్ప కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండించలేదు అలాగని సమర్ధించలేదు కూడా. అంటే జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొంటుందా లేదా? అనేది అనుమానంగానే ఉంది. కానీ తెలంగాణాలో అధికారం చేప్పట్టినప్పటి నుండి క్రమంగా బలం పుంజుకొన్న తెరాసను, హైదరాబాదులో మంచి బలం కల మజ్లీస్ పార్టీలను ఎదుర్కోవాలంటే, కిషన్ రెడ్డికి ఇష్టమున్నా లేకపోయినా బలమయిన క్యాడర్ ఉన్న తెదేపాతో బీజేపీ పొత్తులు పెట్టుకోవలసి ఉంటుంది. కనుక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కూడా ఈ విషయమై చర్చించిన తరువాతనే బీజేపీ ఒక నిర్దిష్ట ప్రకటన చేయవచ్చును.

 

ఒకవేళ బీజేపీ ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీకి దిగదలచుకొంటే, ఆ రెండు పార్టీలను   విమర్శించేందుకు ప్రతిపక్షాలకు చక్కటి అవకాశం దొరుకుతుంది. అది వాటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కల్పించవచ్చును. కనుక ఈ విషయంలో బీజేపీ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి నుండి బీజేపీకి, నరేంద్ర మోడీకి చాలా అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు గనుక ఆ రెండు పార్టీల మధ్య పొత్తులకు ఎటువంటి సమస్య, పునరాలోచన అవసరం ఉండకపోవచ్చును.

By
en-us Political News

  
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.