తెదేపా-బీజేపీ సభలలో ఎవరి గోల వారిదే

Publish Date:Apr 22, 2014

Advertisement

 

నిన్న నరేంద్ర మోడీ తెలంగాణాలో నిర్వహించిన నాలుగు సభలలో కొన్ని ఆసక్తికరమయిన విషయాలు కనబడుతున్నాయి. ఆయన సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గోవడం ఒక ఆసక్తికర ఆంశమనుకొంటే, అంతకంటే చాలా ఆసక్తికరమయిన విషయాలు మరి కొన్ని ఉన్నాయి.

 

తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమికి ప్రధాన శత్రువులు కాంగ్రెస్, తెరాసలు. ఆ రెండు పార్టీలను నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శిస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం కాంగ్రెస్ మీద, అది కూడా సోనియా, రాహుల్ గాంధీలపైనే సాగాయి తప్ప రాష్ట్ర నేతలని, ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్ధులపై పోటీ చేస్తున్న బలమయిన కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రస్తావనే చేయలేదు. కానీ, ఆయన తన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్ అనే మాట పలకకుండా చాలా సున్నితంగా తెరాసను ఏదో మొక్కుబడిగా తప్పదన్నట్లు విమర్శించారు.

 

మొన్న రాహుల్ గాంధీ తెరాస అధినేత కేసీఆర్ నమ్మక ద్రోహి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించి, అటువంటివారికి ఓటేయవద్దని ప్రజలను గట్టిగా కోరారు. కానీ నరేంద్ర మోడీ తెదేపా-బీజేపీ కూటమికి పట్టం కట్టమని కోరారే తప్ప, రాహుల్, పవన్, చంద్రబాబు మాదిరిగా తెరాసపై తీవ్ర విమర్శలు చేయకపోవడం చాలా విచిత్రం.

 

నిన్న జరిగిన రెండు సభలలో కూడా చంద్రబాబు మోడీ భజన చాలా గట్టిగానే చేసారు. కానీ మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ మెచ్చుకొన్నారు తప్ప, చంద్రబాబు కార్యదక్షత, సమర్ధత గురించి కానీ, తెదేపా గురించి గానీ గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పకపోవడం మరో విశేషం.

 

ఇక ఒకప్పుడు తెదేపాలో చంద్రబాబుకి ముఖ్య అనుచరుడిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి, పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆయనను తిట్టడమే వృత్తిగా పెట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి పోటీ చేస్తున్న మెహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో చంద్రబాబు పాల్గోవడం, ఆయన పక్కనే కూర్చొని ఏదో మాట్లాడటం చాలా ఆసక్తి కలిగిస్తోంది.

 

ఇక, మోడీతో కలిసి రెండుసభలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి, మోడీకి ఓటేయమని కోరారు తప్ప, తెదేపాకు ఓటేయమని ఎక్కడా కోరలేదు. ఆయన రెండు ప్రసంగాలలో తెదేపా ఊసే లేదసలు. ఆయన కూడా చంద్రబాబులాగే మోడీ భజనలో తరించిపోయారు, కానీ ఎక్కడా తన ప్రసంగంలో చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదు.

 

ఇక తెలంగాణాలో ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తెలుగుజాతి ఔనత్యం గురించి, కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని ఏవిధంగా అవమానించింది వివరించి, తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా వేరయినా ఒకే జాతిగా కలిసి ఉండాలని ప్రభోదించడం కూడా కొంచెం ఆశ్చర్యకరమే. సాధారణ సమయాలలో ఇటువంటి ప్రభోదం సహజంగానే అనిపించవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావన కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ చేస్తున్న వేర్పాటువాదం గురించి పవన్ ఆయనకి చెప్పినందునే, మోడీ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని ఈవిధంగా వ్యక్తపరిచారని భావించవలసి ఉంటుంది. కానీ మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ లాగ కేసీఆర్ మరియు ఆయన కుటుంబసభ్యులపై ఎటువంటి విమర్శలు చేయలేదు.

 

ముగ్గురు ముఖ్యమయిన వ్యక్తులు చేతులు కలిపి ఒకరికొకరు అండగా నిలబడి, తమ రాజకీయ ప్రత్యర్ధులను బలంగా ఎదుర్కొంటారని అందరూ భావించారు. కానీ ముగ్గురూ కూడా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం వలన, ఈసభలు వారి మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టుకొనేందుకే ఏర్పాటు చేసుకోన్నట్లుంది తప్ప, తమ ఐక్యతని చాటి చెప్పి, తమ కూటమిని బలపరుచుకొని, ప్రత్యర్ధులను గట్టిగా ఎదుర్కొనేలా మాత్రం లేదనే చెప్పక తప్పదు. (అందుకు గల కారణాలను వేరే శీర్షికలలో ప్రత్యేకంగా విశ్లేషించుకొందాము).

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.