పవన్ కళ్యాణ్ లోక్ సత్తాలో చేరి ఉండాల్సిందా?

Publish Date:Apr 23, 2014

Advertisement

 

పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబుతో సమావేశమయ్యాక మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నందున ముందు ప్రకటించినట్లుగా మల్కాజ్ గిరి నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న లోక్ సత్తా అభ్యర్ధి జయప్రకాశ్ నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేనని, అయినా ఆయనంటే తనకు చాలా గౌరవమని అన్నారు.

 

అందుకు జయప్రకాష్ కూడా సానుకూలంగా స్పందిస్తూ “పవన్ కళ్యాణ్ నాకు నా స్వంత తమ్ముడు కంటే ఎక్కువగా సహాయపడ్డారు. నిజానికి తానే మల్కాజ్ గిరి నుండి పోటీ చేయాలని భావించారు. కానీ నేను అక్కడి నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలుసుకొని ఆ ఆలోచన విరమించుకొన్నారు. పవన్ నీతి నిజాయితీ గల యువకుడు. ఏ విషయాన్నయినా నిర్భయంగా చెప్పగల దైర్యం కలవాడు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో, అందుకు ఆయన ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ప్రస్తుతం మల్కాజ్ గిరిలో జరుగుతున్న ఎన్నికలు ధనానికి,ధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం వంటివి. అందులో అంతిమంగా ధర్మమే జయిస్తుందని నాకు నమ్మకం ఉంది,” అని అన్నారు.

 

జయప్రకాశ్, పవన్ ఇరువురి మధ్య ఇంత చక్కటి అవగాహన, అనుబంధం ఉన్నపుడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించే బదులు, భావ సారూప్యత, ప్రజలలో మంచి పేరున్న లోక్ సత్తాతో కలిసి పనిచేసి ఉండి ఉంటే నేడు ఆయనకు ఇటువంటి గందరగోళ పరిస్థితి ఎదుర్కోవలసిన సమస్య తప్పేది. జయప్రకాశ్ కూడా పవన్ కళ్యాణ్ లాగే మొదటి నుండి తెదేపా, బీజేపీలతో పొత్తులకు సిద్దమని చెపుతూనే ఉన్నారు. అవి కుదరనప్పటికీ నేటికీ ఆయన వాటికి తన మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కనీసం గతానుభవాలను దృష్టిలో ఉంచుకొనయినా, జనసేన ప్రకటించకముందు లోక్ సత్తాతో కలిసి పనిచేసే ఆలోచన చేసి ఉండి ఉంటే బాగుండేదేమో! కానీ, ఆయన తాను చాలా లోతుగా అధ్యయనం, ఆలోచన చేసిన తరువాతనే జనసేన పార్టీని స్థాపిస్తున్నానని చెప్పి, తన రెండవ సభతోనే పార్టీని అటకెక్కించి నవ్వులపాలయ్యారు.

 

తెదేపా అభ్యర్ధిపై పోటీ చేస్తున్న జయప్రకాశ్ కి మద్దతుగా ప్రచారం చేస్తానని వెనక్కి తగ్గడం, పొట్లూరికి టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం, ఆనక ఆయనకీ మద్దతు ఈయలేనని చెప్పడం, ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతు ఇస్తానని ప్రకటిస్తూనే అందులో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తడానికి మాత్రం ఇంకా సంకోచించడం వంటివన్నీ ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.

 

అదే ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు, మేధావి, నిజాయితీ పరుడని పేరున్న జయప్రకాశ్ నారాయణ్ తో చేతులు కలిపి, లోక్ సత్తా ద్వారా రాజకీయాలలోకి ప్రవేశించి ఉండి ఉంటే బహుశః పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరేలా ఉండేదేమో! ఇటువంటి అయోమయ పరిస్థితిని ఎదుర్కొనే ఆగత్యం ఉండేదే కాదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః లోక్ సత్తాలో చేరి వేరొకరి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే బదులు, తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి ఉండవచ్చును. కానీ దానివలన ఆయనకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. పైగా ఆయన అయోమయ స్థితి వలన ప్రజలలో చులకన అవుతున్నారు.

 

పవన్ కళ్యాణ్ వంటి ఒక నిజాయితీ కల వ్యక్తి నిజాయితీగా చేసిన ప్రయత్నం విఫలం అవడం, ఆయనకి ఇటువంటి సందిగ్ధ పరిస్థితి ఎదురవడం నిజంగా దురదృష్టకరమే. కానీ అందుకు ఆయనే భాద్యులని చెప్పక తప్పదు. ఆవేశానికి, ఆలోచనకి మధ్య పొంతన కుదరనప్పుడు ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.