తెలంగాణలో టార్గెట్ రాజకీయాలు

Publish Date:Jul 11, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్ధ ప్రధాని అంటూ నేరుగా మోడీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీయేమో నియంత, అవినీతి, కుటుంబ పాలన అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కేసీఆర్ నూ, కేంద్రంలో బీజేపీ పాలననూ ఏక కాలంలో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకూ పెరిగిపోతోంది.

రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడినా రాజకీయ ఉష్ణోగ్రతలు మాత్రం రోహిణీకార్తెను మించి పోతున్నాయి. ఏప్రిల్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలతో మొదలైన ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల.. మేలో వరంగల్ లో జరిగిన రాహుల్ బహిరంగ సభతో మరింత పెరిగి.. తాజగా గత వారం హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాలతో తార స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత కూడా రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోందే కానీ తగ్గే పరిస్థితే కనిపించడం లేదు. సభలు, సమావేశాలు,మీడియా సమావేశాల ద్వారా ప్రధాన రాజకీయ పార్టీలు మూడూ తమతమ బలప్రదర్శనలకు దిగుతుండటంతో రాజకీయ వేడి పరిమితుల్లేకుండా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

గతానికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో ‘టార్గెట్’ రాజకీయాలు జోరుమీద ఉన్నాయి.  టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో దాదాపు 13 తీర్మానాలు చేసింది. వరంగల్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ తెలంగాణకు ఓ డిక్లరేషన్ ఇచ్చారు. బిజెపి సంకల్ప సభలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందిస్తున్న సహాకారం, చేస్తున్న అభివృద్దిని వెల్లడించింది. ఇలా తెలంగాణ ప్రజల దృష్టిని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలను మూడు ప్రధాన పార్టీలూ శక్తి వంచన లేకుండా చేశాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ తెలంగాణలో మరో భారీ బహిరంగ సభకు రెడీ అవుతున్నారు.

ఏప్రిల్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేంద్రంపై,  బిజెపి పాలనపై సిఎం కెసిఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అనంతరం వరంగల్ సభలో టిఆర్ఎస్ పై, సిఎం కెసిఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆ తరువాత బిజెపి విజయ సంకల్ప సభలో తెలంగాణ ప్రభుత్వంపైనా, సిఎం కెసిఆర్ పైనా పలు రాజకీయ అస్త్రాలను సంధించారు. మోడీ మాత్రం తన ప్రసంగంలో తెలంగాణకు కేంద్రం అందించిన సహాయాన్ని ప్రస్తావించడానికే పరిమితమై వ్యూహాత్వకంగా వ్యవహరించారు.

ప్లీనరీ అనంతరం  మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూటిగా సిఎం కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయనపైనే పోటీ చేసి ఓడిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై రాజకీయ చర్చోపచర్చలు సద్దుమణగక ముందే.. సిఎం కెసిఆర్ ఆదివారం మీడియా  సమావేశంలో   నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ  అసమ్మర్థ పాలన అంటూ దుయ్యబట్టారు. ఇలా ఒకరి పార్టీ తరువాత మరో పార్టీ రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలను పెంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 తేదీ చెప్పండి అసెంబ్లీ రద్దుకు రెడీ అంటూ సీఎం సిఎం కెసిఆర్ బంతిని బీజేపీ కోర్టులో పడేయడంతో రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువగా  ముందస్తు ఎన్నికలు  చర్చ జోరందుకుంది. కేసీఆర్  పార్టీ సవాల్ ను బీజేపీ స్వీకరించి సై అంటూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా తానే ముందుగా ముందస్తు నగారా మోగిస్తే.. అసెంబ్లీ రద్దు వరకూ మౌనంగా ఉండి ఆ  తరువాత ముందస్తుకు కాకుండా బీజేపీ రాష్ట్రపతి పాలనకు మార్గంసుగమం చేస్తుందన్న అనుమానం  కేసీఆర్ దిఅని పరిశీలకులు చెబుతున్నారు. ముందస్తు వచ్చినా, రాకున్నా.. ప్రస్తుత రాజకీయ వేడి ఎన్నికల వరకూ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చే నెలలో మంత్రి కేటీఆర్ ఇలాకాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ అనంతరం  రాజకీయ వేడి, విమర్శల దాడి మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.