కీలక శాఖలు తన వద్దే ఉంచుకున్న సీఎం విజయ్

Publish Date:May 16, 2026

Advertisement

 

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి విజయ్ తన వద్ద హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై వంటి కీలక శాఖలను ఉంచుకున్నారు.

టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్.ఆనంద్, ఆదవ్ అర్జున, అరుణ్ రాజ్, సెంగొట్టయ్యన్, బి.వెంకటరమణన్, నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, డాక్టర్ టి.కె.ప్రభు, ఎస్.కీర్తనలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పేదరిక నిర్మూలన, నీటిపారుదల ప్రాజెక్టుల శాఖలను ఎన్.ఆనంద్‌కు అప్పగించారు. పబ్లిక్ వర్క్స్, హైవేస్, మైనర్ పోర్ట్స్, క్రీడల అభివృద్ధి శాఖలను ఆదవ్ అర్జునకు కేటాయించారు. ఆరోగ్యం, మెడికల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలను డాక్టర్ కె.జి.అరుణ్ రాజ్‌కు అప్పగించారు. ఫైనాన్స్, పెన్షన్స్ శాఖల బాధ్యతలను కె.ఎ.సెంగొట్టయ్యన్‌కు అప్పగించగా.. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, ప్రైస్ కంట్రోల్ శాఖలను పి.వెంకటరమణన్‌కు కేటాయించారు. 

విద్యుత్, న్యాయ, జైళ్లు, అవినీతి నిరోధక శాఖలను ఆర్.నిర్మల్ కుమార్‌కి కేటాయించారు. స్కూల్ ఎడ్యుకేషన్, తమిళ అభివృద్ధి, సమాచార ప్రచార శాఖ, కల్చర్, ఫిల్మ్ టెక్నాలజీ శాఖలను రాజ్ మోహన్‌కు అప్పగించారు. మైన్స్ అండ్ మినరల్స్ శాఖను డాక్టర్ టి.కె.ప్రభుకు కేటాయించగా.. ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ శాఖల బాధ్యతలను సెల్వి ఎస్.కీర్తనకు అప్పగించారు. ఆయా శాఖలను మంత్రులకు కేటాయిస్తూ లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ పరారీపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీకేజీ మరియు పరీక్ష రద్దు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న సీఎం చంద్రబాబు
దక్షిణాది రాజకీయాల్లో మరియు సినీ రంగంలో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఊహించడం కష్టం.
జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి.
ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
సమాజం తలదించుకునే అత్యంత హేయమైన, అమానవీయ ఘటన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగుచూసింది.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యంత కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
హర్యానా ల్యాండ్ డీల్ వివాదంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.