రాజీనామా చేయకుండా రాద్దాంతమేల?

Publish Date:Jul 22, 2015

Advertisement

 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి ఆయన చాలా ధీటుగానే బదులిచ్చారు. కానీ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసానని గొప్పగా చెప్పుకొంటున్న ఆయన వారడిగిన ప్రశ్నకు సూటిగా బదులీయకుండా తనను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేయడం, అందరి బాగోతాలు బయటపెడతానని బెదిరించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఇటువంటి పొరపాటుని అన్ని రాజకీయపార్టీలు చేస్తున్నాయి కనుక తను చేయడం తప్పు కాదన్నట్లుంది ఆయన వాదన. అటువంటప్పుడు నైతిక విలువల గురించి చెప్పుకోవడం ఎందుకు?

 

స్పీకర్ కి ఇచ్చిన రాజీనామా లేఖను తను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని ఆయన చెపుతున్నారు. కానీ ఒకపక్క తను ఎప్పుడో రాజీనామా చేసానని చెప్పుకొంటూ దానిని 8 నెలలయినా ఆమోదింపజేసుకోనప్పుడు ఇక దానికి అర్ధం ఏముంటుంది? దానిని జేబులో పెట్టుకొని తిరగడం వలన ప్రయోజనం ఏముంటుంది? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నైతిక విలువలకి కట్టుబడి ఉన్నానని తలసాని ప్రకటించుకొన్నప్పుడు, తను ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. కానీ అందరూ చేస్తున్న తప్పునే ఆయన చేయాలనుకొంటే ఇక నైతిక విలువల గురించి మాట్లాడటమే అనవసరం.

 

ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ చేతికి ఇచ్చేనని చెపుతుంటే, అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి తమకు ఆయన రాజీనామా చేరలేదని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డికి లికిత పూర్వకంగా తెలియజేసారు. మరయితే ఆయన రాజీనామా లేఖ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్లు? అని గండ్ర అడుగుతున్న ప్రశ్నకు స్పీకర్ ద్వారా జవాబు చెప్పించగలిగితే బాగుండేది. కానీ అలా చేస్తే అప్పుడు “ఇంతకాలం తలసాని రాజీనామా లేఖను ఎందుకు ఆమోదించలేదు?” అనే ప్రశ్నకు స్పీకర్ సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుంది.

 

తను మళ్ళీ ఎమ్మేల్యేగా గెలవగలననే ధీమా ఉన్నందునే తను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదని తలసాని చెప్పుకొన్నారు. తెదేపా ఎమ్మేల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుని తనతో సనత్ నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలవమని, ఒకవేళ తను ఓడిపోతే రాజకీయల నుండి తప్పుకొంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. కానీ అసలు ఇంతవరకు తన రాజీనామానే ఆమోదింపజేసుకోకుండా ఆయన తన ప్రత్యర్ధులకు ఇటువంటి సవాళ్ళు చేయడం అర్ధరహితమనే చెప్పక తప్పదు.

 

ఇక రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన “రెండు రోజులు రాజకీయాలను కాదనుకొంటే...నాలుగు రోజులు ప్రభుత్వం లేదనుకొంటే నేనేమిటో చెపుతాను” అని మాట్లాడటం బాధ్యతారాహిత్యమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ఆయన ఇవన్నీ మాట్లాడకుండా స్పీకర్ చేత తక్షణమే తన రాజీనామాను ఆమోదింపజేసుకొని ఉంటే ప్రతిపక్షాలకు గట్టి జవాబు చెప్పినట్లు ఉండేది. కానీ ఆ పని చేయకుండా ఈవిధంగా వాదోపవాదాలు చేయడం వలన ఆయనే స్వయంగా ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నట్లవుతోంది. దాని వలన ఆయనకి, తెరాస ప్రభుత్వానికి మరింత అప్రదిష్ట కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.