సుప్రీమ్ కోర్టు సుప్రిమెసీకి బీటలువారుతున్నాయా?

Publish Date:Oct 2, 2016

Advertisement

సుప్రీమ్ కోర్ట్... భారతీయులందరికీ దీనిపై ఇప్పటికీ చాలా విశ్వాసం, భయ, భక్తులు వున్నాయి. సుప్రీమ్ లో విషయం తేలిపోతే ఇక మరో దిక్కుండదని అంతా భావిస్తారు. ఆఖరుకు ఉరి శిక్ష అయినా సరే సుప్రీమ్ వరకూ ఒక్కో కోర్టులో ప్రశ్నిస్తూ వెళ్లవచ్చు. కాని, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చాక ఎవ్వరైనా చేసేదేమీ వుండదు. క్షమాభిక్షలు పెట్టే అవకాశం రాష్ట్రపతికి వున్నా ఆయన కూడా సుప్రీమ్ కోర్టు మాటను తక్కువ చేస్తూ ఇష్టానుసారం క్షమాభిక్షలు పెట్టరు! అంతలా దేశంలోని ప్రతీ ఒక్కరూ అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తారు. అందుకు తగ్గట్టే చాలా సార్లు న్యాయం వైపు తీర్పులు ఇస్తూ మన సుప్రీమ్ చరిత్ర సృష్టించింది... 


చిన్న చిన్న ఆస్తి గొడవలు మొదలు అయోధ్య రామ మందిర వివాదం వరకూ ఎన్నో కేసులు సుప్రీమ్ గడప తొక్కుతుంటాయి. అక్కడైతే న్యాయం దక్కుతుందన్న విశ్వాసం అందరిలోనూ వుంది. కాని, రాను రాను మన దేశంలో అన్ని వ్యవస్థల్లాగే సుప్రీమ్ కు కూడా ప్రమాదం పొంచి వున్నట్టు కనిపిస్తోంది! గత కొన్ని రోజుల్లో రెండు సార్లు సుప్రీమ్ కోర్టు ఆర్డర్స్ ధిక్కరణకు గురయ్యాయి. అదీ ఏ విదేశీ కంపెనీల వల్లనో, లేక ఉగ్రవాదుల వల్లనో కాదు.. మన దేశంలోని సంస్థలు, ప్రభుత్వాలే అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానపరుస్తున్నాయి!


సుప్రీమ్ కోర్టుకు బీసీపీఐకి ఇప్పుడు ఇంచుమించూ వార్ నడుస్తోంది. వేల కోట్ల విలువైన బీసీసీఐ రాజకీయాల పుట్ట. ఇది అందరికీ తెలిసిందే. అందుకే, అందులో సంస్కరణలు రావాలని, నిజమైన క్రికెటింగ్ టాలెంట్ వెలుగు చూడాలని, ప్రపంచ క్రికెట్లో మన భారత టీం మరింత సమర్థంగా రాణించాలని చాలా మంది అంటుంటారు. మరీ ముఖ్యంగా బీసీపీఐ నిర్వహణ, నిధుల వినియోగం, టీమ్ సెలక్షన్స్, ఐపీఎల్ లాంటి అంశాల్లో ఈ మధ్య తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. గోల్ మాల్ ఎక్కువైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐని భారీగా సంస్కరించేందుకు లోథా కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులు చాలా వరకూ బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. అవ్వి అంగీకరిస్తే తమ పప్పులు ఇక మీద ఉడకవని వారి భయం, బాధ. కాని, ఈ మొత్తం వ్యవహారంలోకి సుప్రీమ్ కోర్టు కూడా ఎంటర్ అయింది. బీసీసీఐని లోథా కమిటీ సిఫార్సులు అంగీకరించి పారదర్శకత పెంచమని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, విచిత్రంగా దేశపు అత్యున్నత న్యాయస్థానం చెప్పినా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ధిక్కరించేసింది. ఓ మీటింగ్ పెట్టుకుని లోథా కమిటీ సిఫార్సులు దాదాపుగా తిరస్కరిస్తున్నట్టు చెప్పేసింది! కోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసేసింది!


సుప్రీమ్ మాటని కాదని షాక్ ఇచ్చిన మరో వ్యవస్థ... కర్ణాటక ప్రభుత్వం. ఈ మధ్య తమిళనాడుకి కావేరీ నీళ్లు ఇవ్వమని పదే పదే న్యాయస్థానం సిద్దరామయ్య సర్కార్ కు చెబుతోంది. అయినా ససే మీరా అంటోంది అక్కడి కాంగ్రెస్ గవర్నమెంట్. తమ రాష్ట్రానికి నీళ్లు సరిపడా స్టోర్ అయ్యాకే తమినాడుకి వదులుతామని తేల్చి చెప్పేస్తున్నారు! ఏకంగా మాజీ ప్రధాని దేవేగౌడ నిరాహార దీక్షకు కూర్చుని కోర్టుని అవమానిస్తున్నారు! న్యాయం ఆధారంగా తీర్పునిచ్చే కోర్టును కూడా మన రాజకీయ నేతలు పట్టించుకోకుంటే... ఇక వివాదాలు తేలేది ఎలా? 


బీసీసీఐ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీమ్ తీర్పుల్ని ధిక్కరించటం వెనుక బలమైన కారణాలే వుండొచ్చు. అవ్వి సరైనవా కాదా అనేది చర్చ కాదు. రీజన్స్ ఎన్ని వున్నా ఇలా ఎవరికి వారు మొండిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరిస్తే... ఆ వ్యవస్థ వుండటం ఎందుకు? మామూలు జనం మాత్రం సుప్రీమ్ ని ఎందుకు గౌరవిస్తారు? ఎందుకు విశ్వాస్తారు? ఇప్పటికే కోర్టుల్లో తీర్పులు కొనుక్కోవచ్చని కొంత మంది ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు వచ్చిన సరైన తీర్పుల్ని కూడా పాటించకపోతే.... న్యాయ స్థానాలకి వున్న ప్రతిష్ఠ పూర్తిగా పోతుంది. అది దేశంలో అరాచకానికి దారి తీసే ప్రమాదం వుంది. కాబట్టి సుప్రీమ్ కోర్టుని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే! ప్రవైట్ సంస్థ అయిన బీసీసీఐ అయినా... ప్రజలు ఎన్నుకున్న కర్ణాటక సర్కార్ అయినా...

By
en-us Political News

  
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.