దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసుకు తెర పడబోతోందా?

Publish Date:Oct 16, 2019

Advertisement

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయం లో హిందువులు ముస్లింల మధ్య శతాబ్ద కాలానికిపైగా వివాదం నడుస్తోంది.పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం పెద్దదైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది చనిపోయారు. ఆ సంఘటన తర్వాత అయోధ్యలోని భూమిపై వివాదం నడుస్తోంది. ఈ కేసును అలహాబాద్ హై కోర్టు విచారించింది.

రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైన తీర్పు ప్రకటించింది. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించారని అలహాబాద్ హై కోర్టు తీర్పిచ్చింది .ఈ మూడు భాగాల్లో ఒక భాగం హిందూ మహాసభ ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.అలహాబాద్ హై కోర్టు రెండు వేల పది సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పులో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది.

అక్కడున్న ఒక దేవాలయాన్ని కూల్చేసిన తరవాత మసీదు నిర్మించారని  పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పై ఇరువర్గాల సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, దీంతో సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సస్పెండ్ చేసింది.సుప్రీం కోర్టులో ఈ కేసును తుది దశకు చేరుకుంది.

ఎట్టకేళ్ళకు అయోధ్య భూ వివాదం విచారణ ఇవాళ ముగియనుంది. సుప్రీం కోర్టు ఈ కేసులో వాదనలను ఇవాళ మధ్యాహ్నంలోగా ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.దీనికి సంబంధించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ సూచనప్రాయంగా తెలియచేసింది.హిందూ ముస్లిం పక్షాలు తమ తమ అభిప్రాయాల్ని సమర్పించటానికి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంది.


ముప్పైతొమ్మిది రోజుల నుంచి సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబర్ పధ్ధెనిమిదివ తేదీనాటికల్లా విచారణ పూర్తి చేయాలనుకుంది. ఆ తర్వాత అందుకు ఒక రోజు ముందే అంటే పదిహెడువ తేదీన తుది గడువుగా పెట్టుకుంది.ఇప్పుడు అంతకంటే ముందే ఇవాళ విచారణని పూర్తి చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.


అయోధ్యలోని రామజన్మభూమి వద్ద మసీదును నిర్మించడం ద్వారా మొఘల్ చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారంటూ మహన్ సురేష్ దాస్ అనే హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది పరాశరన్ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట తన వాదనని వినిపించారు. అయోధ్యలో పలు మసీదులున్నాయని అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని అయితే హిందువులు మాత్రం శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చలేరని అన్నారు.


అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వానికి తావు లేదని సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడం మంచిదని ఇండియన్ ముస్లీమ్స్ ఫర్ పీస్ అనే సంస్థ చేసిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు.ఈ మాటను ఆ సంస్థ మధ్యవర్తిత్వం సాగుతున్న సమయంలో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పుడు ఆ గడువు మించిపోయిందని చెప్పారు.


చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ పదిహెడున రిటైర్ కానున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు నవంబర్ నాలుగు నుంచి పదిహేనులోగా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్ పదిహెడవ తేదీలోగా చీఫ్ జస్టిస్ గొగోయ్ తీర్పు ప్రకటించలేకపోతే ఆ అంశాన్ని కొత్త ధర్మాసనం విచారిస్తోంది.
సుప్రీంకోర్టు వివాదాస్పద భూమి ఎవరికి చెందుతుందనే అంశంపై తీర్పు నివ్వనుంది.ఆ భూమి ఎవరికి చెందుతుంది ఏ భాగం ఎవరికి లభిస్తుందని అంశంమ్మీద స్పష్టతనిస్తూ సిజెఐ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.

అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ ధర్మాసనం సమర్థించవచ్చు.అలాగే అన్ని పక్షాలకు ఉత్తమమని తాను భావించిన విధంగా ఆ భూభాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం విభజించే అవకాశం కూడా ఉంది.తీర్పు వెలువరించే రోజు అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం మీదకొచ్చి తీర్పులో తాము రాసిన భాగాన్ని ఒక్కొక్కరిగా చదివి వినిపిస్తారు.సిజిఐ స్వయంగా తీర్పు చదవడం ప్రారంభించే అవకాశం కూడా ఉంది.


అయితే అయోధ్యపై వేసిన పిటిషన్ను సున్నీ వక్ఫ్ బోర్డ్ విత్ డ్రా చేసుకుంటుందన్న ఒక కీలక మలుపు  కూడా వినిపిస్తోంది.మొత్తానికి దశాబ్దాల కాలానికి చెందిన ఈ కేసుకు నేటితో తెర పడబోతోంది. ఏమి జరగబోతోందో వేచి చూడాలి. 

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.